తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి రూటు కాస్త సపరేటుగా ఉంటుంది. ఆయన అప్పుడప్పుడు చాలా భిన్నంగా వ్యవహరిస్తుంటారు. కుర్రాళ్లకు ధీటుగా హుషారుగా వ్యవహరిస్తారు. తాను మంత్రినన్న భావన పెద్దగా కనిపించనివ్వడు. పిల్లల్లోఉన్నప్పుడు వారితో కలిసి పోవటం.. పెద్దలతో కూర్చున్నప్పుడు పెద్ద మనిషిగా వ్యవహరించటం ఆయనకు మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి మల్లారెడ్డి తాజాగా ఒక పాత బజాజ్ చేతక్ స్కూటర్ మీద మనసు పడ్డారు.
సదరు స్కూటర్ ను తనకు అమ్మాలని కోరారు. అందుకు.. స్థానిక వ్యాపారి నో చెప్పేసిన వైనం ఆసక్తికరంగా మారింది. ఇంతకూ మంత్రి మల్లారెడ్డికి ఆ పాత చేతక్ స్కూటర్ మీద అంతలా మనసు ఎందుకైనట్లు? అంటే.. విషయం సినిమాటిక్ గా ఉంటుందని చెప్పాలి. ఇప్పుడంటే మంత్రి మల్లారెడ్డికి కాలేజీలు.. వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి. మొదట్లో ఆయన పాల వ్యాపారం చేసేవారు.
విపరీతంగా కష్టపడి.. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిలబెట్టారు.పాలు అమ్మే సమయంలో ఆయన ఒక చేతక్ మీద తిరిగేవారు. ఆ స్కూటర్ ను గతంలో ఒక వ్యాపారికి అమ్మగా.. ఆ వ్యాపారి మరో వ్యాపారికి అమ్మారు. తాజాగా తన పాత స్కూటర్ కనిపించేసరికి మంత్రి మల్లారెడ్డిలో ఎక్కడలేని హుషారు వచ్చేసింది. అప్పట్లో తనకు ఎంతో కలిసి వచ్చిన ఆ స్కూటర్ ను చూసి సంతోషపడిన ఆయన.. దాని మీద ఎక్కి కాసేపు నడిపించారు.
తనకు అప్పట్లో లక్కీగా ఉన్న స్కూటర్ ను తనకు తిరిగి అమ్మాల్సిందిగా సదరు వ్యాపారిని కోరారు. అయితే.. సదరు వ్యాపారి మంత్రి మాటను సున్నితంగా రిజెక్టు చేశారు. ఆ స్కూటర్ కొన్న తర్వాతే తనకు వ్యాపారంలోకలిసి వచ్చిందని.. తాను ఆ స్కూటర్ అమ్మలేనని చెప్పారు. మొత్తానికి మంత్రి కోరుకున్నట్లుగా స్కూటర్ సొంతం కాకున్నా.. పాత గురుతుల్లోకి వెళ్లిన ఆయన.. స్కూటర్ ను చూసి తెగ సంతోషాన్ని వ్యక్తం చేయటం.. అక్కడి వారిని ఆకర్షించింది.
This post was last modified on February 6, 2021 10:47 am
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…