పారితోషకాల విషయంలో హీరోలు, దర్శకులకు నిర్మాతలతో పేచీలు టాలీవుడ్లో కొత్తేమీ కాదు. అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ విషయంలోనూ హీరో పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తమకు పూర్తి స్థాయిలో పారితోషకాలు అందలేదని నిర్మాత బీవీఎన్ ప్రసాద్ మీద కేసు పెట్టే వరకు వెళ్లింది పరిస్థితి.
ఇప్పుడు సంక్రాంతి విడుదలై బ్లాక్బస్టర్ అయిన క్రాక్ సినిమా విషయంలోనూ ఇలాంటి వివాదమే తలెత్తింది. నిర్మాత ఠాగూర్ మధు తన పారితోషకం పూర్తిగా చెల్లించలేదని కేసు పెట్టాడు గోపీచంద్ తాజాగా. నాలుగ్గోడల మధ్య సెటిల్ చేసుకోవాల్సిన వ్యవహారం కేసుల వరకు వెళ్లిందంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. నిర్మాతకు ఉన్న ఫినాన్షియల్ ఇష్యూస్ వల్లే ఈ సినిమాకు తొలి రోజు విడుదల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవడం తెలిసిందే. ఐతే ఆ అడ్డంకుల్ని దాటి విడుదలైన క్రాక్ భారీ విజయాన్నందుకుంది. నిర్మాతకు సినిమా మంచి లాభాలే అందించి ఉంటుందని భావిస్తున్నారు.
అయినా సరే.. గోపీచంద్కు పారితోషకం పూర్తి స్థాయిలో చెల్లించలేదంటే ఆశ్చర్యమే. గోపీ కొన్ని రోజులు ఎదురు చూసి ఇప్పుడు ఫిర్యాదు వరకు వెళ్లినట్లున్నాడు. ఐతే ఠాగూర్ మధుతో తనకు విభేదాలున్నాయని కొన్ని రోజుల కిందటే గోపీచంద్ సంకేతాలు ఇచ్చేశాడు. క్రాక్ సినిమా సీక్వెల్ తీస్తానని, అది మైత్రీ మూవీ మేకర్స్ బేనర్లో ఉంటుందని ఈ సినిమా రిలీజ్ తర్వాత కొన్ని రోజులకు మీడియాకు చెప్పాడు గోపీచంద్.
మామూలుగా ఓ సినిమా పెద్ద హిట్టయితే ఆటోమేటిగ్గా అదే బేనర్లో సీక్వెల్ తెరకెక్కుతుంటుంది. గోపీ అలా కాకుండా వేరే బేనర్లో సీక్వెల్ అన్నపుడే వ్యవహారం తేడాగా అనిపించింది. నిర్మాతతో విభేదాలని తేలిపోయింది. ఇప్పుడు అతను మధుపై కేసు పెట్టడంతో అసలు విషయం బయటికొచ్చింది. క్రాక్ రిలీజ్ ఇష్యూస్తో ఆల్రెడీ బ్యాడ్ అయిన మధుకు కేసు వ్యవహారం మరింత ఇబ్బందికరమే.
This post was last modified on February 6, 2021 10:44 am
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…