పారితోషకాల విషయంలో హీరోలు, దర్శకులకు నిర్మాతలతో పేచీలు టాలీవుడ్లో కొత్తేమీ కాదు. అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ విషయంలోనూ హీరో పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తమకు పూర్తి స్థాయిలో పారితోషకాలు అందలేదని నిర్మాత బీవీఎన్ ప్రసాద్ మీద కేసు పెట్టే వరకు వెళ్లింది పరిస్థితి.
ఇప్పుడు సంక్రాంతి విడుదలై బ్లాక్బస్టర్ అయిన క్రాక్ సినిమా విషయంలోనూ ఇలాంటి వివాదమే తలెత్తింది. నిర్మాత ఠాగూర్ మధు తన పారితోషకం పూర్తిగా చెల్లించలేదని కేసు పెట్టాడు గోపీచంద్ తాజాగా. నాలుగ్గోడల మధ్య సెటిల్ చేసుకోవాల్సిన వ్యవహారం కేసుల వరకు వెళ్లిందంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. నిర్మాతకు ఉన్న ఫినాన్షియల్ ఇష్యూస్ వల్లే ఈ సినిమాకు తొలి రోజు విడుదల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవడం తెలిసిందే. ఐతే ఆ అడ్డంకుల్ని దాటి విడుదలైన క్రాక్ భారీ విజయాన్నందుకుంది. నిర్మాతకు సినిమా మంచి లాభాలే అందించి ఉంటుందని భావిస్తున్నారు.
అయినా సరే.. గోపీచంద్కు పారితోషకం పూర్తి స్థాయిలో చెల్లించలేదంటే ఆశ్చర్యమే. గోపీ కొన్ని రోజులు ఎదురు చూసి ఇప్పుడు ఫిర్యాదు వరకు వెళ్లినట్లున్నాడు. ఐతే ఠాగూర్ మధుతో తనకు విభేదాలున్నాయని కొన్ని రోజుల కిందటే గోపీచంద్ సంకేతాలు ఇచ్చేశాడు. క్రాక్ సినిమా సీక్వెల్ తీస్తానని, అది మైత్రీ మూవీ మేకర్స్ బేనర్లో ఉంటుందని ఈ సినిమా రిలీజ్ తర్వాత కొన్ని రోజులకు మీడియాకు చెప్పాడు గోపీచంద్.
మామూలుగా ఓ సినిమా పెద్ద హిట్టయితే ఆటోమేటిగ్గా అదే బేనర్లో సీక్వెల్ తెరకెక్కుతుంటుంది. గోపీ అలా కాకుండా వేరే బేనర్లో సీక్వెల్ అన్నపుడే వ్యవహారం తేడాగా అనిపించింది. నిర్మాతతో విభేదాలని తేలిపోయింది. ఇప్పుడు అతను మధుపై కేసు పెట్టడంతో అసలు విషయం బయటికొచ్చింది. క్రాక్ రిలీజ్ ఇష్యూస్తో ఆల్రెడీ బ్యాడ్ అయిన మధుకు కేసు వ్యవహారం మరింత ఇబ్బందికరమే.
This post was last modified on February 6, 2021 10:44 am
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…
ప్రతి దర్శకుడూ తన అరంగేట్ర చిత్రంతోనే తన స్టైల్ ఏంటో, మున్ముందు ఎలాంటి సినిమాలు తీయబోతున్నానో ఒక సంకేతం ఇచ్చేస్తాడు. తొలి సినిమాను…
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…