Political News

ఏపీలో మందుబాబులకు దిమ్మ తిరిగే షాకిచ్చిన సర్కార్

మద్యం మహమ్మారిని కట్టడి చేసే విషయంలో తనకున్న విజన్ ను ప్రదర్శిస్తోంది ఏపీ సర్కారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి మద్యం అమ్మకాల విషయంలోనూ.. సరఫరా విషయంలో సరికొత్త విధానాల్ని తెర మీదకు తేవటం తెలిసిందే. కరోనాకారణంగా విధించిన లాక్ డౌన్ తో మద్యం అమ్మకాల్ని పూర్తిగా బంద్ చేయటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఇటీవల మద్యం అమ్మకాల్ని మళ్లీ మొదలు పెట్టింది ఏపీ సర్కారు.. మందుబాబులకు దిమ్మ తిరిగే షాకిచ్చింది. మందు చుక్క గొంతులోకి వెళ్లటానికి ముందే మత్తు ఎక్కని మాటను చెప్పేసింది.ఏపీలో మద్యం ధరల్ని 75 శాతానికి పెంచేస్తూ నిర్ణయం తీసుకుంది. ధరల్ని భారీగా పెంచటం ద్వారా మద్యం అలవాటును తగ్గించుకోవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

అయినప్పటికీ మందుబాబుల జోరు ఏ మాత్రం తగ్గలేదు. మద్యం అమ్మకాలు జోరున సాగుతున్నాయి. మద్యం కోసం పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. ఇలాంటివేళ.. ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయాన్ని తసుకుంది. ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల్ని 33 శాతం తగ్గించి షాకిచ్చింది.

వాస్తవానికి ఏపీలో 4380 లిక్కర్ షాపులు ఉంటే.. వాటిని జగన్ సర్కారు 3500కు తగ్గించాయి. గతంలో మాదిరి ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేటు వారు మద్యం దుకాణాల్ని నిర్వహించే వారు. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం దుఖాల్ని ప్రభుత్వమే నిర్వహిస్తోంది.

తాజాగా ఈ షాపుల్ని 2934కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల వారీగా పలుమద్యం షాపుల్ని తగ్గిస్తూ తీసుకున్న తాజా నిర్ణయం మందుబాబులకు నిరుత్సాహాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు. మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అవుతుంది. మందు అమ్మే షాపులు మరింత తగ్గితే.. మందుబాబుల హడావుడి మరింత ఎక్కువ అవుతుంది. అదే జరిగితే లొల్లి ఖాయం.

This post was last modified on May 7, 2020 10:22 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో ‘ఆ రాజ్యాంగ ప‌ద‌వులు’ వైసీపీకి ద‌క్క‌లేదు!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం చేసే ఖ‌ర్చులు, తీసుకునే నిర్ణ‌యాల‌ను స‌మీక్షించి.. నిర్ణ‌యం తీసుకునేందుకు ప్ర‌త్యేకంగా మూడు క‌మిటీలు ఉంటాయి. ఇది…

12 minutes ago

ప్ర‌జల సంతృప్తి.. చంద్ర‌బాబు అసంతృప్తి!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం పాల‌న ప్రారంభించి.. ఏడు మాసాలు పూర్త‌యింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఏమనుకుంటున్నారు? ఫీడ్ బ్యాక్ ఏంటి?…

1 hour ago

రెట్రో : 42 వయసులో శ్రియ స్పెషల్ సాంగ్…

పాతికేళ్ల క్రితం 2001 సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చిన శ్రియ టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ ఆడిపాడింది. చిరంజీవి, బాలకృష్ణతో మొదలుపెట్టి ప్రభాస్,…

2 hours ago

జ‌గ‌న్‌ను మ‌రోసారి ఏకేసిన‌ ష‌ర్మిల

వైసీపీ అధినేత‌, ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్.. లండ‌న్ నుంచి ఇలా వ‌చ్చారో లేదో.. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు,…

2 hours ago

జూనియర్ అభిమానులు ఎందుకు ఫీలయ్యారు

జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ ని కలుసుకోవడానికి త్వరలోనే ఒక వేడుక ఏర్పాటు చేస్తానని, అప్పటిదాకా ఓపిగ్గా ఎదురు చూడమని…

3 hours ago

దొంగోడి లవ్.. ప్రేయసికి గిఫ్ట్ గా రూ.3 కోట్ల ఇల్లు..

బెంగళూరులో ఇటీవల అరెస్టైన ఓ దొంగ కథ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 37 ఏళ్ల పంచాక్షరి స్వామి అనే…

4 hours ago