Political News

పద్మ పురస్కారాలకు రాజకీయ వాసనలా ?

రాను రాను పద్మ పురస్కారాలకు విలువ తగ్గిపోతోందా ? జరుగుతున్నది చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పద్మ పురస్కారాలు అంటే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటివి ఏదైనా ఒక రంగంలో నిష్ణాతులైన వారికి, పర్టిక్యులర్ రంగంలో విశేషంగా సేవలు చేసిన వారికి దక్కాల్సిన పురస్కారాలు. నిజానికి ఈ పురస్కారాలను ప్రారంభించింది కూడా ఇదే స్పూర్తితో. కానీ రాను రాను ప్రభుత్వ పెద్దల ప్రాపకం ఉంటే చాలు పురస్కారాలు దక్కుతాయనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. గతంలో ఇటువంటి పురస్కారాలను అందుకున్న వారిపై ఎంతటి నిరసనలు వచ్చాయో అందరికీ తెలిసిందే.

కేంద్రం తాజాగా ప్రకటించిన పద్మవిభూషణ్ పురస్కారాలపైన కూడా ఇలాంటి ఆరోపణలే మొదలయ్యాయి. పద్మవిభూషణ్ అందుకున్న అనేకమందిలో రాజకీయనేతలు కూడా ఉండటమే ఈ ఆరోపణలకు కారణమవుతోంది. కేంద్ర మాజీ మంత్రి రాం విలాస్ పాశ్వాన్, సుమిత్రా మహాజన్, కేశూభాయ్ పటేల్, తరుణ్ గొగోయ్, జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబే లాంటి వాళ్ళకు పురస్కారాలు అందుకనే జాబితాలోఉన్నారు.

నిజానికి రామ్ విలాస్ పాశ్వాన్, తరుణ్ గొగోయ్, సుమిత్రా మహాజన్ లాంటి వాళ్ళ అచ్చమైన రాజకీయనేతలు. రాజకీయాల్లో వీళ్ళు చేసిన విశేషమైన సేవలంటు పెద్దగా ఏమీ లేవు. రాం విలాస్ చనిపోయేనాటికి ఎన్డీయేలో భాగస్వామి అయిన ఎల్జేపీ వ్యవస్ధాపక అధ్యక్షుడు. ఇక కేశూభాయ్ పటేల్ గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి. తరుణ్ గొగోయ్ అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే ప్రధానమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన నృపేంద్ర మిశ్రా కూడా కేవలం తన ఉద్యోగ నిర్వహణ మాత్రమే చేశారంతే.

ఇక జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబేకి పద్మవిభూషణ్ పురస్కారం ఎందుకిచ్చారో ఎవరీ తెలీదు. సుమిత్రా మహాజన్ లోక్ సభ స్పీకర్ గా పనిచేశారు. బీజేపీ నుండి పలుమార్లు ఎంపిగా ఎన్నికయ్యారు. బతికున్నంత కాలం గొగోయ్, పాశ్వాన్, కేశూభాయ్ లాంటివాళ్ళు అచ్చంగా రాజకీయాల్లో మాత్రమే ఉన్నారు. రాజకీయ రంగానికి వీళ్ళు చేసిన ప్రత్యేక సేవలంటు ఏమీ లేవనే చెప్పాలి. సుమిత్రకు పద్మ పురస్కారం ఎందుకిచ్చారో కేంద్రప్రభుత్వమైనా సమర్ధించుకుంటుందో లేదో తెలీదు. ఇలాంటి వాళ్ళని పురస్కారాలకు ఎంపిక చేయటం వల్లే పురస్కారాలకు రాజకీయ వాసనలు కొడుతున్నాయి.

This post was last modified on January 26, 2021 10:26 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

గట్టుమీద వదిలేసి తొందరపడ్డారేమో

నిన్న వారం విడుదలైన గోదారి గట్టుపైనకు మిక్స్డ్ టాక్ వచ్చిన మాట వాస్తవం. తండ్రి కూతురి ఎమోషన్ ని తీసుకుని…

19 minutes ago

చర్లపల్లి జైలుకు బండి భగీరథ్

ఫోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం రాత్రి తమ…

3 hours ago

రామ్ కంటే ముందు ఎవ‌రు?

టాలీవుడ్లో హీరోలు ద‌ర్శ‌కులవ‌డం కొత్త కాదు కానీ.. ఈ జాబితా మ‌రీ పెద్ద‌దేమీ కాదు. తాజాగా యువ క‌థానాయ‌కుడు రామ్…

4 hours ago

రీల్ పెద్ది వెనుక రియ‌ల్ పెద్ది

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా ఉప్పెన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా రూపొందించిన పెద్ది మీద అంచ‌నాలు ఏ…

6 hours ago

అమ‌రావ‌తి ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్టు ఎక్కడ?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం నిర్మించాల‌ని.. ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన విష‌యం తెలిసిందే. దీనిని సుమారు 5 వేల ఎక‌రాల్లో…

7 hours ago

బంగారం అయిపోయింది ఇక వెండి

ప్ర‌స్తుతం పొదుపు మంత్రం ప‌ఠిస్తున్న కేంద్ర ప్ర‌భుత్వం చ‌మురు స‌హా బంగారం వంటివాటిపై కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ప్ర‌భుత్వ ప‌రిధిలో…

8 hours ago