Political News

ఆ ఆలయాల్లో సెల్ ఫోన్ వినియోగంపై నిషేధం… విజయ్ సంచలనం

తమిళనాడులో నాలుగు నెలల క్రితం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జోసెఫ్ విజయ్ ప్రజానుకూల విధానాలతో ముందుకు సాగుతున్నారు. తమిళనాడులో అనేక పుణ్యక్షేత్రాలు వున్నాయి. ప్రసిద్ధి చెందిన దేవాలయాలున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని పవిత్ర ఆలయాల్లో సెల్ ఫోన్ వినియోగాన్ని నిషేదిస్తూ సీఎం విజయ్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక యువత స్పీడ్ కు బ్రేకులు వేయడం చాలా కష్టంగా మారింది. మొబైల్ ఫోన్లో కెమెరా సౌకర్యం చేతికి వచ్చాక ఆ స్పీడ్ మరింతగా పెరిగింది. దాంతో ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాలలో పోస్టు చేయడానికి రీల్స్ చిత్రీకరించి పోస్టు చేయడం మొదలుపెట్టారు. పవిత్ర ఆలయాల్లో రీల్స్ చిట్రీకరించడం మరీ ఎక్కువై పోయింది. ఇది భక్తులకు ఇబ్బందిగా మారింది. దీన్ని నిశితంగా గమనించిన విజయ్ ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగింది.

తమిళనాడులోని 52 ప్రసిద్ధ దేవాలయాల్లో సెల్ ఫోన్ వినియోగం పై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం నుంచే ఈ ఉత్తర్వులు అమలులోకి వచ్చేలా అధికారులను ఆదేశించడం కూడా జరిగిపోయింది. మద్రాస్ హై కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు టీవీకే సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి రమేష్ మీడియాకు తెలిపారు.

ఇందులో భాగంగా అన్నీ దేవాలయాల వద్ద సెల్ ఫోన్లకు అనుమతి లేదు అంటూ బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. అలాగే దేవాలయాల ప్రవేశ మార్గం వద్ద సెల్ ఫోన్లను భద్రపరుచుకునేందుకు కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో సెల్ ఫోన్ కు 5 రూపాయలు వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

విజయ్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయాలకు వచ్చిన ఆదాయాన్ని ఆలయాలకే ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. భక్తులు కానుకల రూపంలో చెల్లించే సొమ్ములు, ఇతరా ఆదాయాన్ని వాణిజ్య అవసరాలకు మళ్ళించకుండా చర్యలు తీసుకున్నారు. దేవుడి సొమ్మును దేవాలయాల అభివృద్ధి, పురాతన దేవాలయాల పునరుద్దరణ, భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి మాత్రమే ఉపయోగించాలని తీసుకున్న నిర్ణయం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడీ సెల్ ఫోన్ నిషేధం పట్ల కూడా సంతోషం వ్యక్తం అవుతుంది.

This post was last modified on September 2, 2026 8:00 pm

Share

Recent Posts

తెలంగాణా బీజేపీలో కారు లొల్లి

తెలంగాణా బీజేపీలో ఓ సెకండ్ హ్యాండ్ కారు రచ్చ రచ్చ చేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీని రోడ్డు…

1 hour ago

ఓజి యునివర్స్ ఊహించనంత పెద్దగా

ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అభిమానులు ఎదురు చూసిన కీలక అప్డేట్ ఓజి 2.…

2 hours ago

రెండో భాస్కర్ అంత వేగంగా రాగలడా

సోలో హీరోగా దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాతోనూ వంద కోట్లు వసూలు చేయగలడని నిరూపించిన లక్కీ భాస్కర్ కొనసాగింపు…

3 hours ago

నాపై కాదు రేవంత్ పై చర్యలు తీసుకోవాలి: కొండా సురేఖ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు సుస్మిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే,…

3 hours ago

మలేరియా టాబ్లెట్లు మింగి ఒక బాలిక మృతి… 53 మందికి అస్వస్థత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా సరిహద్దుల్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలకలం రేగింది. వైద్య సిబ్బంది పంపిణీ చేసిన మలేరియా మాత్రలు మింగిన…

4 hours ago

ప్యారడైజ్ దుస్తులకు ఖరీదు ఎక్కువే

సెప్టెంబర్ 24 విడుదల కాబోతున్న ప్యారడైజ్ కోసం అభిమానుల ఎదురు చూపుల గురించి ఎంత చెప్పినా తక్కువే. నాని కెరీర్…

5 hours ago