Political News

అనిల్ యాదవ్ సైలెంటుగా సైడ్ అయిపోతున్నారా?

వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ రాజకీయ భవిష్యత్తుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెల్లూరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయకపోవచ్చని, అసలు తన రాజకీయ ప్రస్థానమే ఆయన వ్యాఖ్యానించడం ఆసక్తి రేపుతోంది.

జగన్‌మోహన్‌ రెడ్డికి వీర విధేయుడిగా పేరున్న అనిల్‌కుమార్‌ యాదవ్‌.. గతంలో వైఎస్సార్‌సీపీ తరఫున దూకుడుగా మాట్లాడే నేతగా గుర్తింపు పొందారు. ప్రత్యర్థుల విమర్శలకు ఘాటైన కౌంటర్లతో పార్టీ తరఫున బలమైన వాయిస్‌ వినిపించేవారు. 2014, 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. 2019లో జగన్‌ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.

అయితే ప్రస్తుతం నెల్లూరు రాజకీయాల్లో అనిల్‌కుమార్‌ యాదవ్‌ పెద్దగా కనిపించడం లేదనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

తన రాజకీయ ప్రయాణంపై అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. జగన్‌ తనను ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా అక్కడి నుంచి పోటీ చేస్తానని గతంలో స్పష్టం చేశారు. తాను జగన్‌కు విధేయుడినని చెప్పారు.

‘‘వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయొచ్చు.. చేయకపోవచ్చు. నా రాజకీయ ప్రస్థానం కూడా ఉండకపోవచ్చు. కానీ నెల్లూరు జిల్లాలో నాకో చరిత్ర ఉంది. అది జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చింది’’ అని అనిల్‌కుమార్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు.

తాను నెల్లూరులో రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశానని గుర్తుచేశారు. తన రాజకీయ జీవితంలో నెల్లూరు జిల్లాలో ఒక పేజీ, ఒక చరిత్రను జగన్‌ ఇచ్చారని పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలతో అనిల్‌కుమార్‌ యాదవ్‌ రాజకీయాలకు సైలెంట్ గా సైడు అయిపోతున్నారా? లేక పార్టీ అధినేత నిర్ణయానికి అనుగుణంగా తదుపరి అడుగు వేయనున్నారా? అనే చర్చ నెల్లూరు మొదలైంది.

This post was last modified on August 27, 2026 8:02 pm

Share

Recent Posts

ఓజి 2 సౌండ్ చెయ్యడం లేదేంటి

సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు రిలీజ్…

12 minutes ago

రాఖీ రాజీ చేసేనా? సీఎం ఇంటికి కొండా సురేఖ!

తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి ఆసక్తికరంగా మారింది. ఇటీవల చోటుచేసుకున్న వివాదం తర్వాత తొలిసారిగా ఆమె…

25 minutes ago

ప్రాణాలు తీసుకునే ముందు… ఆ పాప గుర్తుకు రాలేదా?

అప్పుల బాధతో దంపతులు గోదావరిలో దూకిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం నింపింది. మూడేళ్ల చిన్నారిని వంతెనపై స్కూటీ వద్ద…

2 hours ago

పార్ల‌మెంటు డీలిమిటేష‌న్‌పై కాంగ్రెస్ భయం దేనికి?

దేశ‌వ్యాప్తంగా 543 పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశంపై కాంగ్రెస్ పార్టీ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌ను వ‌చ్చే 25 ఏళ్ల…

3 hours ago

బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్‌… `ప‌ర్స‌న‌లైజ్` అవుతున్న పార్టీలు!

రెండు జాతీయ పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్‌లో గ‌తానికి భిన్న‌మైన `వ్య‌క్తిపూజ` సాగుతోందా?.. అంటే ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఇందిర‌మ్మ హ‌యాంలో…

5 hours ago

టీడీపీకి ఓట్ల `ప్రాజెక్టులు`… త‌మ్ముళ్లు హ్యాపీ.. !

కీల‌క‌మైన రెండు సాగు, తాగునీటి ప్రాజెక్టుల‌కు సీఎం చంద్ర‌బాబు శ్రీకారం చుట్టారు. నిజానికి ఇవి ఏళ్ల త‌ర‌బ‌డి సాగుతున్న ప్రాజెక్టుల‌నే…

10 hours ago