Political News

అనిల్ యాదవ్ సైలెంటుగా సైడ్ అయిపోతున్నారా?

వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ రాజకీయ భవిష్యత్తుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెల్లూరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయకపోవచ్చని, అసలు తన రాజకీయ ప్రస్థానమే ఆయన వ్యాఖ్యానించడం ఆసక్తి రేపుతోంది.

జగన్‌మోహన్‌ రెడ్డికి వీర విధేయుడిగా పేరున్న అనిల్‌కుమార్‌ యాదవ్‌.. గతంలో వైఎస్సార్‌సీపీ తరఫున దూకుడుగా మాట్లాడే నేతగా గుర్తింపు పొందారు. ప్రత్యర్థుల విమర్శలకు ఘాటైన కౌంటర్లతో పార్టీ తరఫున బలమైన వాయిస్‌ వినిపించేవారు. 2014, 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. 2019లో జగన్‌ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.

అయితే ప్రస్తుతం నెల్లూరు రాజకీయాల్లో అనిల్‌కుమార్‌ యాదవ్‌ పెద్దగా కనిపించడం లేదనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

తన రాజకీయ ప్రయాణంపై అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. జగన్‌ తనను ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా అక్కడి నుంచి పోటీ చేస్తానని గతంలో స్పష్టం చేశారు. తాను జగన్‌కు విధేయుడినని చెప్పారు.

‘‘వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయొచ్చు.. చేయకపోవచ్చు. నా రాజకీయ ప్రస్థానం కూడా ఉండకపోవచ్చు. కానీ నెల్లూరు జిల్లాలో నాకో చరిత్ర ఉంది. అది జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చింది’’ అని అనిల్‌కుమార్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు.

తాను నెల్లూరులో రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశానని గుర్తుచేశారు. తన రాజకీయ జీవితంలో నెల్లూరు జిల్లాలో ఒక పేజీ, ఒక చరిత్రను జగన్‌ ఇచ్చారని పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలతో అనిల్‌కుమార్‌ యాదవ్‌ రాజకీయాలకు సైలెంట్ గా సైడు అయిపోతున్నారా? లేక పార్టీ అధినేత నిర్ణయానికి అనుగుణంగా తదుపరి అడుగు వేయనున్నారా? అనే చర్చ నెల్లూరు మొదలైంది.

This post was last modified on August 27, 2026 8:02 pm

Share

Recent Posts

ప్యారడైజ్.. మామూలు టాక్ సరిపోదు

నేచురల్ స్టార్ నాని తన కెరీర్లోనే అతి పెద్ద పరీక్షకు సిద్ధమవుతున్నాడు. వచ్చే గురువారం తన కొత్త చిత్రం ‘ది…

1 hour ago

హైదరాబాద్ బెస్ట్ సింగిల్ స్క్రీన్ రెడీ

థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారు అని.. సింగిల్ స్క్రీన్లు మూతపడిపోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న దశలో గత మూడు నెలలుగా…

2 hours ago

కొత్త దారులు వెతకాలి విశ్వంభరా

వచ్చే సంక్రాంతికి విశ్వంభర రిలీజవుతుందని, కాకా వేసవికి వెళ్లిపోవచ్చనే ప్రచారం గత వారం రోజులుగా చాలా బలంగా తిరుగుతోంది. తుది…

2 hours ago

సర్దార్ చేసిన గాయం చాలా పెద్దది

మొదటి వారం పూర్తి కాక ముందే సర్దార్ 2 ఎంత పెద్ద డిజాస్టరో జనాలకు అర్థమైపోయింది. యునానిమస్ గా ఫ్లాప్…

3 hours ago

మెగా అప్‌డేట్…. మిసెస్ కాకా వచ్చేశారా

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న కాకాలో ఒక కీలక పాత్రకు సంబంధించిన ఆర్టిస్ట్ సెలక్షన్ పెండింగ్…

4 hours ago

గణేష్ నిమజ్జనంలో ఆరుగురు విద్యార్థులు మృతి

ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్న సమయంలో ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు మరణించడంతో తెలంగాణాలో విషాదం నెలకొంది. మృతి చెందిన…

5 hours ago