Movie News

టాలీవుడ్‌పై మలయాళ నిర్మాతల మంట

అవును.. టాలీవుడ్ పేరెత్తితే ఇప్పుడు మలయాళ నిర్మాతలు మండిపడుతున్నారట. అందుక్కారణం.. ఆ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు తెలుగు సినిమాల్లో వాళ్ల స్థాయికి మించి పారితోషకాలు ఇస్తుండడమే. మలయాళంలో ఎంత పెద్ద హీరో సినిమానైనా తక్కువ రోజుల్లో, తక్కువ బడ్జెట్లలో పూర్తి చేస్తారు. కేరళ మార్కెట్ పరిధి కూడా చిన్నదే. కానీ బయటి మార్కెట్లో మలయాళ సినిమాలకు ఉండే డిమాండ్ వల్ల ఆ చిత్రాలకు వసూళ్లు బాగానే వస్తుంటాయి. పెట్టుబడి మీద మంచి లాభాలు రాబడుతుంటారు నిర్మాతలు.

ఐతే ఈ మధ్య తెలుగు సినిమాల్లో నటించే ఆర్టిస్టులు, వాటికి పని చేసే టెక్నీషియన్లను ఎక్కువగా తెలుగు సినిమాల్లో తీసుకుంటున్నారు. పారితోషకాలు కూడా వారి స్థాయికి మించి ఆఫర్ చేస్తున్నారు. మలయాళంలో పుచ్చుకునేదాని కంటే మూణ్నాలుగు రెట్ల రెమ్యూనరేషన్ తెలుగులో వస్తుండడంతో వాళ్లు క్రమంగా ఇక్కడి సినిమాలకు ప్రయారిటీ ఇచ్చే పరిస్థితి వస్తోంది.

దుల్కర్ సల్మాన్ కొన్నేళ్ల నుంచి ఎక్కువగా తెలుగులోనే సినిమాలు చేస్తున్నాడు. మలయాళంలో సినిమాలు బాగా తగ్గించేశాడు. అందుక్కారణం.. ఇక్కడి కథలు బాగుండడంతో పాటు తన సొంత ఇండస్ట్రీలో కంటే నాలుగైదు రెట్ల పారితోషకం ఇక్కడ అందుతుండడమే అని సమాచారం. ఇక మామిత బైజు, అనస్వర రాజన్ లాంటి యంగ్ హీరోయిన్లు మలయాళంలో రూ.20-30 లక్షల పారితోషకం అందుకునే స్థాయిలో ఉంటే.. వారికి ఇప్పుడు తెలుగులో కోటి రూపాయల దాకా ఆఫర్ చేస్తున్నారు. దీంతో వారిని మలయాళ సినిమాల్లో పెట్టుకోవడం కష్టమవుతోంది.

తెలుగులో ఇస్తున్నట్లే ఎక్కువ రెమ్యూనరేషన్ అయినా ఇవ్వాలి. లేదంటే వారి మీద ఆశలు వదులుకోవాలి. ఇదంతా తెలుగు నిర్మాతల పుణ్యమే అని.. వారి స్థాయికి మించి పారితోషకాలిచ్చి చెడగొడుతున్నారని మలయాళ ప్రొడ్యూసర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఐతే తెలుగు నిర్మాతల వాదన వేరుగా ఉంది.

తాము కావాలని ఎక్కువ పారితోషకం ఇవ్వట్లేదని, న్యాయంగానే చెల్లిస్తున్నామని వారంటున్నారు. మలయాళంలో మాదిరి నెల రోజుల్లో ఇక్కడ సినిమా అయిపోదని.. వర్కింగ్ డేస్ ఎక్కువ, బడ్జెట్లు ఎక్కువ, కాల్ షీట్స్ కూడా ఎక్కువ అవసరం పడతాయి కాబట్టి.. ఇక్కడి మార్కెట్, ప్రమోషన్ సహా అవసరాలు అన్నీ చూసుకుని కరెక్ట్‌గానే మలయాళ ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు డబ్బులు చెల్లిస్తున్నామని మన ప్రొడ్యూసర్లు వాదిస్తున్నారు.

This post was last modified on August 27, 2026 7:25 pm

Share

Recent Posts

ప్రాణాలు తీసుకునే ముందు… ఆ పాప గుర్తుకు రాలేదా?

అప్పుల బాధతో దంపతులు గోదావరిలో దూకిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం నింపింది. మూడేళ్ల చిన్నారిని వంతెనపై స్కూటీ వద్ద…

25 minutes ago

పార్ల‌మెంటు డీలిమిటేష‌న్‌పై కాంగ్రెస్ భయం దేనికి?

దేశ‌వ్యాప్తంగా 543 పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశంపై కాంగ్రెస్ పార్టీ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌ను వ‌చ్చే 25 ఏళ్ల…

2 hours ago

బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్‌… `ప‌ర్స‌న‌లైజ్` అవుతున్న పార్టీలు!

రెండు జాతీయ పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్‌లో గ‌తానికి భిన్న‌మైన `వ్య‌క్తిపూజ` సాగుతోందా?.. అంటే ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఇందిర‌మ్మ హ‌యాంలో…

4 hours ago

టీడీపీకి ఓట్ల `ప్రాజెక్టులు`… త‌మ్ముళ్లు హ్యాపీ.. !

కీల‌క‌మైన రెండు సాగు, తాగునీటి ప్రాజెక్టుల‌కు సీఎం చంద్ర‌బాబు శ్రీకారం చుట్టారు. నిజానికి ఇవి ఏళ్ల త‌ర‌బ‌డి సాగుతున్న ప్రాజెక్టుల‌నే…

9 hours ago

దేశ‌వ్యాప్తంగా 288 మంది.. ఏపీలో ఐదుగురు.. ఏమ‌య్యారు?

దేశ‌వ్యాప్తంగా 288 మంది నేపాల్ వ‌ర‌ద‌ల్లో గ‌ల్లంత‌య్యార‌ని కేంద్ర ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించింది. మొత్తం 532 మంది ఆచూకీ క‌నిపించ‌కుండా…

10 hours ago

మృతదేహాల నుంచి నగల అపహరణ… నేపాల్‌లో అమానవీయం

నేపాల్ ప్రకృతి విపత్తుతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయి, మరెందరో గల్లంతైన విషాద సమయంలోనూ కొందరి దుర్మార్గం వెలుగుచూసింది. వరదల్లో…

10 hours ago