భారత పోరుగు దేశం, దేవభూమి నేపాల్లో ఒక్కసారిగా సంభవించిన జల ప్రళయం.. ప్రజలను అతలాకుతలం చేసింది. ఒక్కసారిగా ఉప్పొంగిన కోశీ నది.. నేపాల్లోని మూడు జిల్లాలు.. రసువా, ధాదింగ్, నువాకోట్ లను ముంచెత్తింది. దీంతో వందలాది మంది ప్రజలు, భారత పర్యాటకులు గల్లంతయ్యారు. అయితే.. ఈ పరిణామాలపై నెమ్మది నెమ్మదిగా అనేక అనుమానాలు తెరమీదికి వస్తున్నాయి. ఈ ప్రాంతం చైనా ఆక్రమిత టిబెట్ కు పక్కనే ఉండడం.. టిబెటిన్లకు ఇటీవల కాలంలో నేపాల్ మద్దతుగా వ్యవహరించడం.. తెలిసిందే. దీంతో చైనా కుట్ర చేసిందా? అనే కోణంలో జాతీయ, అంతర్జాతీయ మీడియాలు కథనాలు వెలువరుస్తున్నాయి.
ఏం జరిగింది?
నేపాల్లో మంగళవారం రాత్రి వరకు పరిస్థితి బాగానే ఉంది. అకస్మాత్తుగా బుధవారం ఉదయం తెలతెల వారుతుండగానే.. కోశీనది నుంచి నీరు, రాళ్లు, బురద వంటివి దూసుకువచ్చాయి. నిజానికి ఈ నది నుంచి నీరు బయటకు రావాలంటే చైనా గేట్లు ఎత్తితేనే జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇదే ఇప్పుడు చర్చకు, అనుమానాలకు కూడా దారితీసింది. అయితే..తాము కూడా బాధితులమేనని చైనా చెబుతుండడం గమనార్హం. క్షణాల్లో వ్యవధిలోనే వరద నీరు ముంచెత్తింది. దీంతో వందలాది మంది నీటిలో కొట్టుకుపోయారు. వీరిలో మానస సరోవర యాత్రకు వెళ్లిన భారతీయ పర్యాటకులు కూడా వందమందికి పైగా ఉన్నారని అధికారులు తెలిపారు.
టిబెట్లోని గైరాంగ్ పోర్టు చైనా అధీనంలో ఉంది. దీని నుంచి వరద తన్నుకువచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఇది ఉద్దేశ పూర్వకమే అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదే కనుక నిజమైతే.. చైనాతో పెద్ద లడాయి తప్పదన్న సంకేతా లను నేపాల్ ఇస్తోంది.
ఇక, ప్రస్తుతం రసువా, ధాదింగ్, నువాకోట్ జిల్లాల్లో తీవ్ర విధ్వంసం చోటుచేసుకుంది. మరోవైపు.. భారత్ ఆపన్న హస్తం అందించింది. చైనాపై వస్తున్న ఆరోపణల విషయంలో భారత్ మౌనం వహిస్తోంది. ప్రకృతి విలయం కోణంలోనే చూడాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై మీడియా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర సమాచార శాఖ భారతీయ మీడియాను కోరింది.
ప్రధాని ఫోన్..
నేపాల్ లో నెలకొన్న జల ప్రళయం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తక్షణమే రియాక్ట్ అయ్యారు. నేపాల్కు భారతీయ సమాజం, ప్రజలు అండగా ఉంటారని.. అత్యవసర సహాయం అందించేందుకు రెండు ప్లటూన్ల సైన్యాన్ని, వైద్య సహాయాన్ని విపత్తు స్సందన దళాలను కూడా పంపిస్తామని తెలిపారు. నేపాల్ ప్రధాన మంత్రికి ఫోన్ చేసిన ఆయన.. విపత్తు సమయంలో ఆదుకునేందుకు భారత్ అన్ని విధాలా సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. అయితే.. ప్రధాని సైతం చైనా విషయాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం.
This post was last modified on August 26, 2026 10:51 pm
మూడు సంవత్సరాల క్రితం టాలీవుడ్ లో కొత్త రికార్డులు తిరగరాస్తూ హనుమాన్ ఎంత సంచలన విజయం సాధించిందో మూవీ లవర్స్…
వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరవుతున్న టైంలో రవితేజకు ఇరుముడి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. విజయం ఊహించిందే కానీ మరీ రికార్డులు బద్దలు…
తెలుగు దర్శకుల్లో కొందరు మాత్రమే ఒక జనరేషన్ ని ప్రభావితం చేసే స్థాయిలో సినిమాలు తీస్తారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో…
ఏ పార్టీ అయినా.. తీసుకునే నిర్ణయాలు.. చేసే ప్రకటనల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. సమయం వచ్చిందనో.. సందర్భం చిక్కిందనో…
త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలను పూర్తిస్థాయిలో బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఎన్నికల సంఘం కూడా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కుటుంబం సృష్టించిన దుమారం ఇంకా కొనసాగుతుంది. పరకాల సీటు విషయంలో…