Political News

వైసీపీ చెప్పినట్లు సభ నడవదు

డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శాసన మండలి సమావేశాల సందర్భంగా మండలిలో ఈ వ్యవహారంపై వైసీపీ సభ్యులు, మంత్రుల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ఈ క్రమంలోనే నిన్న మండలిని వాయిదా వేశారు. అయితే, జగన్, వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రావాలని, అక్కడ ఏ విషయంపై అయినా చర్చకు సిద్ధమని విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అయినా సరే, వైసీపీ సభ్యుల తీరు మారలేదు.

ఈ రోజు మండలికి ర్యాలీగా వెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. డీఎస్సీపై సీబీఐ విచారణకు, మంత్రి నారా లోకేశ్ రాజీనామా కోసం నినాదాలు చేస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు మండలి వైపు ర్యాలీగా వెళ్లారు. ఈ క్రమంలోనే వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, మండలి గేటు ముందు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆ తర్వాత సభ మొదలైంది.

ఇక, మండలి మొదలైన తర్వాత కూడా సభలో డీఎస్సీ వ్యవహారంపై వాడీవేడి చర్చ జరిగింది. సభలో డీఎస్సీ అంశంపై చర్చించేందుకు సిద్ధమని శాసన సభ వ్యవహారాల, ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ చెబుతున్నప్పటికీ వైసీపీ సభ్యులు వినలేదు. దీంతో, వారిపై పయ్యావుల ఫైర్ అయ్యారు. రా..నువ్వు వచ్చి కూర్చొని చెప్పు…అంటూ వైసీపీ ఎమ్మెల్సీలనుద్దేశించి పయ్యావుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చకు రెడీ అని చెబుతున్నా వినడం లేదని, వైసీపీ సభ్యులు చెప్పినట్లు సభ నడవదని అన్నారు.

ప్రభుత్వాన్ని ఎవరు నడపాలన్నది ప్రజలు నిర్ణయించారని అన్నారు. ఏ సబ్జెక్ట్ పై చర్చించాలన్నది ప్రభుత్వం ఇష్టమని చెప్పారు. ఎల్ నినో వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని, వ్యవసాయం గురించి సభలో చర్చ జరగాల్సి ఉందని అన్నారు. కానీ, వైసీపీ సభ్యులు ప్రజల పట్ల ఏ మాత్రం బాధ్యత లేకుండా కేవలం రాజకీయాలు చేయడానికే సభకు వచ్చారని మండిపడ్డారు.

This post was last modified on August 18, 2026 4:17 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

2 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

3 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

3 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

3 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

5 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

5 hours ago