అధికారంలో ఉండగా తమదైన బెదిరింపులకు పాల్పడిన వైపీపీ… అదికారం కోల్పోయాక మరింత దిగజారుడు తనాన్ని బయటపెట్టుకుంటోంది. మహిళలపై నిత్యం అకృత్యాలకు పాల్పడుతున్న వైసీపీ శ్రేణులు… తాజాగా ఓ మహిళా పోలీసు అధికారిపై వికృత చేష్టలకు పాల్పడి తమ నిజ నైజాన్ని బయటపెట్టుకున్నాయి. మహిళా పోలీసు అధికారిపై వైసీపీ శ్రేణులు సాగించిన అకృత్యాలకు సంబంధించిన వీడియో వైరల్ కాగా… దానిని చూసిన టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేస్తున్న ఈ తరహా దారుణాలకు తప్పనిసరిగా కఠిన దండన తప్పదని ఆయన సంచలన ప్రకటన చేశారు.
మహిళలపై తమకంటే గౌరవం చూపే వారు లేరని చెప్పే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఆస్తుల విషయంలో తల్లి, చెల్లిలతో గొడవ పడి వారిని బయటకు గెంటేశారన్న అపప్రదను మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. తోడబుట్టిన చెల్లికి ఆపరేషన్ జరిగినా స్పందించని జగన్…మహిళల పట్ల తనకు ఏ పాటి ఆత్మీయత ఉందన్న విషయాన్ని నిరూపించుకున్నారని చెప్పక తప్పదు. తమ అధినేత అడుగు జాడల్లోనే సాగుతున్న వైసీపీ శ్రేణులు… తాము కూడా తమ అధినేతకు ఏమాత్రం తీసిపోయేది లేదని నిరూపించుకుంటున్నారు. ఇందుకు నిదర్శనంగానే శ్రీకాకుళంలో జరిగిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇటీవలే వైసీపీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా శ్రీకాకుళంలో ఆ పార్టీ శ్రేణులు పరిధి దాటి వ్యవహరించాయి. నిరసనలో బాగంగా గుంపుగా గూడిన వైసీపీ శ్రేణులను కట్టడి చేసేందుకు విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా ఎస్సై ఆ గుంపు మధ్యలోకి వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసు అధికారి… అందులోనూ మహిళా పోలీసు అధికారి అని కూడా చూడకుండా ఆమెపై వైసీపీ శ్రేణులు దారుణంగా వ్యవహరించాయి. మహిళా ఎస్సైని చుట్టుముట్టిన వైసీపీ మూకలు… ఆమెను అసభ్యకరంగా తాకుతూ శునకానందం పొందాయి. మృగాళ్లుగా మారిన వైసీపీ నేతల నుంచి తప్పించుకునేందుకు కూడా ఆమెకు అవకాశం లేకపోయింది.
వైసీపీ శ్రేణులు తన ఒంటిపై చేతులు వేస్తూ వికృతానందం పొందుతూ సాగితే.. వారి బారి నుంచి తప్పించుకునేందుకు ఆ మహిళా ఎస్సై… తన శరీరానికి చేతులు అడ్డం పెట్టుకుని… ముఖాన్ని చేతుల్లో దాచుకుని… ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో కొంతసేపు సతమతం అయ్యారు. ఈ దృశ్యాన్ని చూస్తే.. నిజంగానే వైసీపీ శ్రేణులపై ఎక్కడ లేని కోపం రాక మానదు. ఈ వీడియోను చూసిన వెంటనే లోకేశ్ ఘాటుగా స్పందించారు. మహాిళలన్ని అవమానించడం, రాక్షసానందం పొందం వైసీపీ డీఎన్ఏలోనే ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి, చెల్లిని గెంటేసిన చరిత్ర జగన్ ది అయితే… కనిపించిన ప్రతి మహిళను వేధించడం వైసీపీ నాయకుల సంస్కృతిగా మారిందని ఆయన ఆక్షేపించారు. శ్రీకాకుళం ఘటనకు బాధ్యులైన వైసీపీ నేతలను గూండాలుగా అభివర్ణించిన లోకేశ్… వారికి కఠిన దండన తప్పదని తేల్చి చెప్పారు.
This post was last modified on July 31, 2026 5:18 pm
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు మైకు పట్టడం బాగా తెలుసు. ఆయన మైకు అందుకుంటే.. వినేవారికైనా బోర్ కొడు…
మన తెలుగు ప్రేక్షకులు నిండు మనసుతో భాష భేదం లేకుండా కంటెంట్ బాగుంటే చాలు వసూళ్లు ఇచ్చి మరీ బ్లాక్…
మన దేశంలో రాజకీయ వారసత్వం సర్వ సాధారణం. సినిమాల్లో నెపోటిజం మాదిరిగానే పొలిటికల్ నెపోటిజం వల్ల వచ్చిన పొలిటిషియన్లు చాలామంది…
స్థానిక ఎన్నికల్లో గెలుపోటములను ప్రత్యర్థులు ఎలా మేనేజ్ చేసినా.. యుద్ధం మాత్రం జరగాలట..! తన పార్టీ కార్యకర్తలకు జగన్ ఇస్తున్న…
సినిమాల్లో సక్సెస్ కోసం కిందా మీద పడుతున్నాడు కానీ సిద్దార్థ్ కు డిజిటల్ స్పేస్ లో మంచి కంటెంట్ దొరుకుతోంది.…
నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించనప్పటికీ టాక్సిక్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కి టికెట్ రేట్ల పెంపు తీసుకుంటారనే టాక్ బయటికి…