Political News

చెడ్డపేరు చేతులారా కొని తెచ్చుకుంటున్నారు

అధికారంలో ఉండగా తమదైన బెదిరింపులకు పాల్పడిన వైపీపీ… అదికారం కోల్పోయాక మరింత దిగజారుడు తనాన్ని బయటపెట్టుకుంటోంది. మహిళలపై నిత్యం అకృత్యాలకు పాల్పడుతున్న వైసీపీ శ్రేణులు… తాజాగా ఓ మహిళా పోలీసు అధికారిపై వికృత చేష్టలకు పాల్పడి తమ నిజ నైజాన్ని బయటపెట్టుకున్నాయి. మహిళా పోలీసు అధికారిపై వైసీపీ శ్రేణులు సాగించిన అకృత్యాలకు సంబంధించిన వీడియో వైరల్ కాగా… దానిని చూసిన టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేస్తున్న ఈ తరహా దారుణాలకు తప్పనిసరిగా కఠిన దండన తప్పదని ఆయన సంచలన ప్రకటన చేశారు.

మహిళలపై తమకంటే గౌరవం చూపే వారు లేరని చెప్పే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… ఆస్తుల విషయంలో తల్లి, చెల్లిలతో గొడవ పడి వారిని బయటకు గెంటేశారన్న అపప్రదను మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. తోడబుట్టిన చెల్లికి ఆపరేషన్ జరిగినా స్పందించని జగన్…మహిళల పట్ల తనకు ఏ పాటి ఆత్మీయత ఉందన్న విషయాన్ని నిరూపించుకున్నారని చెప్పక తప్పదు. తమ అధినేత అడుగు జాడల్లోనే సాగుతున్న వైసీపీ శ్రేణులు… తాము కూడా తమ అధినేతకు ఏమాత్రం తీసిపోయేది లేదని నిరూపించుకుంటున్నారు. ఇందుకు నిదర్శనంగానే శ్రీకాకుళంలో జరిగిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఇటీవలే వైసీపీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా శ్రీకాకుళంలో ఆ పార్టీ శ్రేణులు పరిధి దాటి వ్యవహరించాయి. నిరసనలో బాగంగా గుంపుగా గూడిన వైసీపీ శ్రేణులను కట్టడి చేసేందుకు విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా ఎస్సై ఆ గుంపు మధ్యలోకి వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసు అధికారి… అందులోనూ మహిళా పోలీసు అధికారి అని కూడా చూడకుండా ఆమెపై వైసీపీ శ్రేణులు దారుణంగా వ్యవహరించాయి. మహిళా ఎస్సైని చుట్టుముట్టిన వైసీపీ మూకలు… ఆమెను అసభ్యకరంగా తాకుతూ శునకానందం పొందాయి. మృగాళ్లుగా మారిన వైసీపీ నేతల నుంచి తప్పించుకునేందుకు కూడా ఆమెకు అవకాశం లేకపోయింది.

వైసీపీ శ్రేణులు తన ఒంటిపై చేతులు వేస్తూ వికృతానందం పొందుతూ సాగితే.. వారి బారి నుంచి తప్పించుకునేందుకు ఆ మహిళా ఎస్సై… తన శరీరానికి చేతులు అడ్డం పెట్టుకుని… ముఖాన్ని చేతుల్లో దాచుకుని… ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో కొంతసేపు సతమతం అయ్యారు. ఈ దృశ్యాన్ని చూస్తే.. నిజంగానే వైసీపీ శ్రేణులపై ఎక్కడ లేని కోపం రాక మానదు. ఈ వీడియోను చూసిన వెంటనే లోకేశ్ ఘాటుగా స్పందించారు. మహాిళలన్ని అవమానించడం, రాక్షసానందం పొందం వైసీపీ డీఎన్ఏలోనే ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లి, చెల్లిని గెంటేసిన చరిత్ర జగన్ ది అయితే… కనిపించిన ప్రతి మహిళను వేధించడం వైసీపీ నాయకుల సంస్కృతిగా మారిందని ఆయన ఆక్షేపించారు. శ్రీకాకుళం ఘటనకు బాధ్యులైన వైసీపీ నేతలను గూండాలుగా అభివర్ణించిన లోకేశ్… వారికి కఠిన దండన తప్పదని తేల్చి చెప్పారు. 

This post was last modified on July 31, 2026 5:18 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

41 minutes ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

1 hour ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

2 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

2 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

3 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

4 hours ago