కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. యువత భవిష్యత్తు కోసమే రాజీనామా చేశానని ఆయన చెప్పారు. దేశ భవిష్యత్తుకు, నవ భారతావనికి సరికొత్త వారసులు యువతేనని అన్నారు. 10 రోజులుగా జరుగుతున్న ఘటనలు తీవ్రంగా బాధించాయని, అందుకే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. కేంద్ర మంత్రిగా తనకు అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యువత సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు. తమకు రాజకీయాలు అవసరం లేదని ఆయన అన్నారు. శాంతియుతంగా చేసే ఆందోళనతో ఏ లక్ష్యమైనా తప్పక నెరవేరుతుందని మరోసారి నిరూపితమైందని, మహాత్మా గాంధీ స్ఫూర్తితో తాము శాంతియుత ఆందోళన చేశామని చెప్పారు. ఇది విద్యార్థుల విజయమని, విద్యార్థుల పోరాటం, నిరసనలు వృథా కాలేదని హర్షం వ్యక్తం చేశారు.
ఈ ఘటనతో విద్యార్థుల సత్తా ఏంటో తెలిసిందని, ప్రజాస్వామ్యం అంటే ఇదేనని అన్నారు. అయితే, తమకు రాజకీయాలు అక్కర్లేదని, తమ డిమాండ్లలో ఒకటి నెరవేరిందని, మరో రెండు కూడా నెరవేరేవరకు వేచి చూస్తామని అన్నారు. విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, వారిపై దాడి చేసిన పోలీసులపై, ఢిల్లీ ఏసీపీ అజిత్ శర్మపై చర్యలు తీసుకోవాలని దీప్కే డిమాండ్ చేశారు.
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు వచ్చేవరకు, సమగ్ర ప్రక్షాళన జరిగే వరకు ఈ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు కొవ్వొత్తులతో శాంతియుతంగా ర్యాలీ చేద్దామని యువతకు పిలుపునిచ్చారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on July 25, 2026 3:26 pm
ఒకప్పుడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక గూస్ బంప్స్ ఎమోషన్. కమర్షియల్ సినిమాలను తన నేపధ్య…
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, పరీక్షల నిర్వహణలో అక్రమాల వివాదం చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి…
‘బాహుబలి’ ప్రభంజనం తర్వాత ఇండియన్ సినిమాలో సీక్వెల్స్, ఫ్రాంఛైజీ సినిమాల జోరు ఎంతగా పెరిగిందో తెలిసిందే. అవసరం ఉన్నా లేకపోయినా పార్ట్-2లు…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరో వారంలో ఏపీకి రానున్నారు. ఆగస్టు 1వ తేదీన ఆయన విజయనగరం జిల్లా భోగాపురానికి…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమైన వేళ ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన అర్థరాత్రి సెల్ఫీ…
తాజాగా విడుదలైన చెన్నై లవ్ స్టోరీకి ఆశించిన ఓపెనింగ్ దక్కింది. టాక్ పరంగా సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ ఒకసారి…