Political News

మేమూ కాక్రోచ్ లమే అన్నావుగా జగన్.. ఇప్పుడేమైంది?

ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తే కాక్రోచ్‌లు లేస్తాయని, ఆంధ్రప్రదేశ్‌లో తాము కూడా కాక్రోచ్‌లమేనని అని స్వయాన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఈ మాట అందరికీ గుర్తుండే ఉంటుంది. డీఎస్సీ అభ్యర్థుల సమస్యలు మరియు రాష్ట్రంలో ప్రభుత్వ తీరును ఎత్తిచూపుతూ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తప్పులు చేసి వాటిని ఒప్పుకోకుండా ప్రజలను ఇబ్బంది పెడితే భవిష్యత్తులో తీవ్ర వ్యతిరేకత వస్తుందని హెచ్చరించారు.ఇప్పుడు దేశ రాజధానిలో ఆ కాక్రోచ్ లే గొంతెత్తి అరుస్తున్నాయి.. కానీ ఎందుకో జగన్ మౌనంగా ఉండిపోయారు.

డీఎస్సీలో అవకతవకలు జరిగాయి అంటూ వైసీపీ ఆరోపిస్తోంది. దీనిపై కోర్టు మెట్లు కూడా ఎక్కుతోంది. డీఎస్సీకి దరఖాస్తు చేసిన వారు సుమారు 3.35 లక్షల మంది. నీట్‌కు దరఖాస్తు చేసిన వారు 22 లక్షల మందికిపైగా. డీఎస్సీ ప్రభావం ఒక రాష్ట్రానికే పరిమితం. నీట్ ప్రభావం దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలపై ఉంటుంది. మరి అలాంటి పరీక్షలో అవకతవకల ఆరోపణలు వచ్చి, కేంద్ర ప్రభుత్వం స్వయంగా రీ-ఎగ్జామ్ నిర్వహించే స్థితి వచ్చినప్పుడు అదే స్థాయిలో వైసీపీలో ఆందోళన ఎందుకు కనిపించలేదు?

ఢిల్లీలో గత 25 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పలు రాష్ట్రాలలో ఆయా పార్టీల నేతలు కూడా స్పందిస్తున్నారు. కానీ ఏపీలో నేతలు మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు. తమకు లాభం చేకూర్చే అంశాలపై ఒక రకమైన స్పందన, రాజకీయ ప్రయోజనం కనిపించని అంశాలపై మరో రకమైన స్పందన. ఈ ధోరణే ప్రజల్లో వైసీపీ రాజకీయాలపై అనుమానాలను పెంచుతోంది.

This post was last modified on July 23, 2026 5:25 pm

Share

Recent Posts

నాని మీద ఒత్తిడి పెరుగుతోంది

ఆగస్ట్ నుంచి తప్పుకున్నాక ది ప్యారడైజ్ కొత్త విడుదల తేదీ ఇప్పటిదాకా ప్రకటించలేదు. సెప్టెంబర్ 24 అని బలంగా ప్రచారం…

2 minutes ago

మంగాపురంకు చిక్కు వచ్చేలా ఉందే

ఈ నెల 30 విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురంకు ప్రమోషన్లు జోరుగా జరుగుతున్నాయి. అయితే గ్రౌండ్ లెవెల్ లో మాత్రం…

14 minutes ago

జనం ఏమనుకుంటున్నారు నాయకా

రాజకీయ రంగప్రవేశానికి ముందు ఇదే తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించుకున్న జన నాయకుడు థియేటర్లలో అడుగు పెట్టేసింది. తమిళనాడులో…

3 hours ago

హృతిక్‌తో పరశురామ్ బుస్సేనా?

యువత, సోలో లాంటి చిత్రాలతో మెప్పించి.. ‘గీత గోవిందం’ చిత్రంతో తెలుగులో మంచి డిమాండ్ తెచ్చుకున్న దర్శకుడు పరశురామ్. ఆ…

3 hours ago

ఏది జాతి స‌మ‌స్య‌.. ఏది జాతీయ స‌మ‌స్య‌.. మోడీ స‌ర్‌!

వైద్య విద్య చ‌ద‌వాల‌ని అనుకునే విద్యార్థులకు దేశ‌వ్యాప్తంగా ఏక కాలంలో నిర్వ‌హించే 'నీట్' ప‌రీక్ష‌కు సంబ‌ధించిన ప్ర‌శ్న‌ప‌త్రం లీకై.. స‌రిగ్గా…

3 hours ago

విజయ్ అసెంబ్లీ మూమెంట్.. టైటిల్ కార్డయింది

ఒక ఇండస్ట్రీలో నంబర్ వన్ స్థానంలో ఉన్న ఒక హీరో.. ఇంకా ఎంతో వయసు, కెరీర్ ఉండగానే సినిమాలు వదిలేసి…

4 hours ago