Political News

అయోధ్య విరాళాల చోరీపై రాజకీయం ఒద్దు: సుప్రీం

అయోధ్య రామ్ ఆలయ విరాళాల నిధుల దుర్వినియోగంపై వస్తున్న ఆరోపణల వ్యవహారం ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం ముందుకు చేరింది. ఈ వివాదానికి సంబంధించిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, దీనిపై రాజకీయాలు చేయవద్దంటూ తీవ్రస్థాయిలో మందలించింది. కేవలం ఒక నేరానికి సంబంధించిన సాధారణ కేసు మాత్రమేనని, ఇందులో సరైన దర్యాప్తు జరిగేలా చూడటమే కోర్టు బాధ్యత అని న్యాయస్థానం స్పష్టం చేసింది. కోర్టులు రాజకీయాలు చేసే వేదికలు కావని గట్టిగా గుర్తుచేసింది.

ఈ నిధుల గోల్‌మాల్ వ్యవహారంపై కోర్టు పర్యవేక్షణలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణతో పాటు, ఫొరెన్సిక్ ఆడిట్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తో తనిఖీలు చేయించాలని పిటిషనర్లు కోరారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అకౌంట్లను సమగ్రంగా పరిశీలించాలనేది వారి డిమాండ్. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందా అని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోర్టు ప్రశ్నించింది. కోర్టు ప్రశ్నకు సాలిసిటర్ జనరల్ స్పందిస్తూ, ఈ వ్యవహారంపై ఇప్పటికే సిట్ ఏర్పాటయిందని, ఉత్తరప్రదేశ్ పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారని కోర్టుకు తెలిపారు.

ఇప్పటివరకు సిట్ ఇచ్చిన మధ్యంతర నివేదిక ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, 8 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా దుర్వినియోగమైన విరాళాల నుంచి దాదాపు 80 లక్షల రూపాయల నగదును కూడా రికవరీ చేశారు. ఈ వివాదం తీవ్రమవడంతో ట్రస్ట్ మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, మాజీ ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామాలు చేయాల్సి వచ్చింది. ఆలయానికి సంబంధించిన ఆర్థిక రికార్డులు, పరిపాలనా పద్ధతులను ఇంకా లోతుగా పరిశీలించడానికి సిట్ మరికొంత సమయం కోరినట్లు తెలుస్తోంది.

విరాళాల సేకరణ, లెక్కింపు విధానాల్లో ఎలాంటి మార్పులు చేయాలో కూడా సిట్ తన తుది నివేదికలో సిఫార్సు చేయనుంది. ప్రస్తుతం జరుగుతున్న విచారణ పురోగతిని వచ్చే విచారణ సమయానికి కోర్టుకు వివరించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి విచారణను జూలై 27 కి వాయిదా వేసింది. మరోవైపు ఈ సిట్ ప్రాథమిక నివేదిక ఆధారంగా ఆలయ ట్రస్ట్ జూలై 22 న అయోధ్యలో అత్యవసర సమావేశం కానుంది. అక్కడ నిధుల రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు.

This post was last modified on July 20, 2026 8:11 pm

Share

Recent Posts

మామిత పేరు మార్మోగ‌బోతోంది

ప్రేమ‌లు సినిమాతో మామిత బైజు అనే అమ్మాయి ఎంత పాపుల‌ర్ అయిందో తెలిసిందే. అప్ప‌టికే మ‌ల‌యాళంలో కొన్ని సినిమాల్లో న‌టించినా..…

2 hours ago

ఫౌజీ లో నేతాజీ పాత్ర కనిపిస్తుందా?

ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో వస్తున్న 'ఫౌజీ' సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనకర్లేదు. 1940ల…

7 hours ago

స్టార్ల కోసం కథలా… కథ కోసం స్టార్లా?

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఇద్దరు అగ్ర హీరోలు ఒకే స్క్రీన్ పై కనిపిస్తే…

10 hours ago

నాగార్జున ఒడిస్సీ లెక్కలు వింటారా

లెనిన్ మరో సక్సెస్ మీట్ ఇవాళ జరిగింది. అఖిల్, నాగార్జున రావడంలో ఆశ్చర్యం లేదు కానీ ఈసారి నాగచైతన్య తోడవ్వడంతో…

10 hours ago

కిరణ్ అబ్బవరం అడుగులు ఎటువైపు

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ మీద కిరణ్ అబ్బవరం భారీ నమ్మకం పెట్టుకున్నాడు. క,…

12 hours ago

మహేష్ బాబు అన్న కొడుకు హిట్ కొట్టాలి!

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో తరం వారసుడు వెండితెరకు పరిచయమవుతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్నయ్య…

12 hours ago