Political News

అయోధ్య విరాళాల చోరీపై రాజకీయం ఒద్దు: సుప్రీం

అయోధ్య రామ్ ఆలయ విరాళాల నిధుల దుర్వినియోగంపై వస్తున్న ఆరోపణల వ్యవహారం ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం ముందుకు చేరింది. ఈ వివాదానికి సంబంధించిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, దీనిపై రాజకీయాలు చేయవద్దంటూ తీవ్రస్థాయిలో మందలించింది. కేవలం ఒక నేరానికి సంబంధించిన సాధారణ కేసు మాత్రమేనని, ఇందులో సరైన దర్యాప్తు జరిగేలా చూడటమే కోర్టు బాధ్యత అని న్యాయస్థానం స్పష్టం చేసింది. కోర్టులు రాజకీయాలు చేసే వేదికలు కావని గట్టిగా గుర్తుచేసింది.

ఈ నిధుల గోల్‌మాల్ వ్యవహారంపై కోర్టు పర్యవేక్షణలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణతో పాటు, ఫొరెన్సిక్ ఆడిట్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తో తనిఖీలు చేయించాలని పిటిషనర్లు కోరారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అకౌంట్లను సమగ్రంగా పరిశీలించాలనేది వారి డిమాండ్. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందా అని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోర్టు ప్రశ్నించింది. కోర్టు ప్రశ్నకు సాలిసిటర్ జనరల్ స్పందిస్తూ, ఈ వ్యవహారంపై ఇప్పటికే సిట్ ఏర్పాటయిందని, ఉత్తరప్రదేశ్ పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారని కోర్టుకు తెలిపారు.

ఇప్పటివరకు సిట్ ఇచ్చిన మధ్యంతర నివేదిక ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, 8 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా దుర్వినియోగమైన విరాళాల నుంచి దాదాపు 80 లక్షల రూపాయల నగదును కూడా రికవరీ చేశారు. ఈ వివాదం తీవ్రమవడంతో ట్రస్ట్ మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, మాజీ ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామాలు చేయాల్సి వచ్చింది. ఆలయానికి సంబంధించిన ఆర్థిక రికార్డులు, పరిపాలనా పద్ధతులను ఇంకా లోతుగా పరిశీలించడానికి సిట్ మరికొంత సమయం కోరినట్లు తెలుస్తోంది.

విరాళాల సేకరణ, లెక్కింపు విధానాల్లో ఎలాంటి మార్పులు చేయాలో కూడా సిట్ తన తుది నివేదికలో సిఫార్సు చేయనుంది. ప్రస్తుతం జరుగుతున్న విచారణ పురోగతిని వచ్చే విచారణ సమయానికి కోర్టుకు వివరించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి విచారణను జూలై 27 కి వాయిదా వేసింది. మరోవైపు ఈ సిట్ ప్రాథమిక నివేదిక ఆధారంగా ఆలయ ట్రస్ట్ జూలై 22 న అయోధ్యలో అత్యవసర సమావేశం కానుంది. అక్కడ నిధుల రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు.

This post was last modified on July 20, 2026 8:11 pm

Share

Recent Posts

అనుపమకు నరకం చూపించిన అపరిచితుడు

తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న మ‌ల‌యాళ భామ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప‌దేళ్ల కెరీర్లో పెద్ద‌గా ఎఫైర్ వార్త‌లేమీ వ‌చ్చింది లేదు.…

1 minute ago

షూట్ లేకున్నా ప్రభాస్ ఫౌజి సెట్లోనే

ప్ర‌భాస్ సినిమా అంటే చాలు.. హైప్‌కు ఏమీ లోటు ఉండ‌దు. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డేకొద్దీ అభిమానుల‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కుల్లోనూ…

5 minutes ago

జెన్ జీ ఎఫెక్ట్… కేటీఆర్ ను సీఎం చెయ్యాలంటున్న కేసీఆర్?

ఇదేమీ ఊహాజ‌నిత వార్త‌కాదు. కొంద‌రు పుట్టించిన గ్యాసిప్ కూడా కాదు!. అక్షరాలా.. తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీలో గ‌త…

1 hour ago

అయ్య‌న్న‌ అలా.. జ‌గ‌న్ ఇలా… ఇద్ద‌రి ఆశ‌లూ తీరేనా?

ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు.. ఎప్ప‌టి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్ప‌డ‌మే కాదు.. అంత‌ర్జాతీయ వేదికల‌పైనా ఆయ‌న త‌న వాణిని…

3 hours ago

‘ఇరుముడి’ సరుకులు… అన్నీ సరిపోయాయి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ఆగస్ట్ 21 విడుదల కానుంది. వరస ఫ్లాపుల నుంచి బయటపడేసే సినిమాగా అభిమానులు దీని…

4 hours ago

కుబేర తర్వాత కమ్ముల ఏమయ్యారు

టాలీవుడ్ దర్శకుల్లో శేఖర్ కమ్ములకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కమర్షియల్ లెక్కలకు దూరంగా సెన్సిబుల్ కథలతో ఫ్యామిలీ ఆడియన్స్,…

5 hours ago