వైసీపీ అధినేత జగన్ ప్రతిపాదించిన మావిగన్(మచిలీపట్నం-విజయవాడ-గుంటూరుతో కూడిన రాజధాని) ప్రాంతం ప్రస్తుతం ఉన్న సీఆర్ డీఏ(క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) పరిధిలోనే ఉందని… దీనిని తాము వ్యతిరేకించడం లేదని వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే జగన్ కూడా మావిగన్ ప్రతిపాదన చేశారని చెబుతున్నారు. అంతేకాదు.. వాస్తవానికి గతంలోనే.. అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే.. ఈ మావిగన్ ప్రతిపాదన వచ్చిందని కూడా వైవీ చెప్పుకొచ్చారు. దీంతో అమరావతిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? సీఆర్ డీఏను ఎందుకు సమర్థిస్తు న్నారన్న ప్రశ్న తెరమీదికి వచ్చింది.
రాజధానిపై దోబూచులు..
అమరావతిని నేరుగా కాదని చెప్పడంతో గత ఎన్నికల్లో వైసీపీకి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఫలితంగానే 151 స్థానాల నుంచి ఆపార్టీ 11 సీట్లకు పరిమితం అయింది. అలాగని అమరావతిని సమర్థించలేని పరిస్థితి వైసీపీలో కనిపిస్తోంది. ఇతర నాయకులు దీనిని సమర్థించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. జగన్ మాత్రం సమర్థించలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో అటు అమరావతి కాకుండా ఇటు.. `మావిగన్` అనే ప్రతిపాదనను తెరమీదికి తెచ్చారు. నిజానికి మావిగన్ కూడా అమరావతి రాజధాని పరిధిలోనే ఉందని చంద్రబాబు సైతం పదే పదే చెబుతున్నారు.
అయినప్పటికీ.. మావిగన్ మాటనే జగన్ పఠిస్తున్నారు. ఇక, ఇప్పుడు మావిగన్ కూడా సీఆర్డీఏ పరిధిలోనే ఉంటుందని వైవీ వ్యాఖ్యానించారు. పనిలో పనిగా ఆయన సీఆర్ డీఏను తాము వ్యతిరేకించడం లేదని అన్నారు. అంటే.. పూర్తిస్థాయిలో సీఆర్ డీఏను సమర్థిస్తూనే.. మరోవైపు అమరావతికి వ్యతిరేకంగా మావిగన్ మాటను వినిపిస్తున్నారు. ఈ రెండు నాల్కల ధోరణి రాజకీయంగా వైసీపీని మరింత డైల్యూట్ చేస్తోందన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. అయినప్పటికీ.. తమ పంతం తమదే అన్నట్టుగా వైసీపీ ముందుకు సాగుతోంది. అమరావతిని నేరుగా సమర్థిస్తే.. అది చంద్రబాబును ప్రత్యక్షంగా, పరోక్షంగా సమర్థించినట్టే అవుతుందన్న భావన జగన్లో ఉంది. అందుకే ఆయన అమరావతిని వ్యతిరేకిస్తున్నారని చెబుతున్నారు.
ఎన్నికల నాటికి ఈ మాట కూడా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలే కాదు.. దేశం మొత్తం అమరావతిని అంగీకరించిందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఈ వాదనను కాదని జగన్ ముందుకు సాగితే.. అది ఆయనకు డ్యామేజీ ని మరింత పెద్దది చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే నెమ్మదిగా మావిగన్.. సీఆర్డీఏ పరిధిలోనే ఉందన్న వాదనను తన వారితో చెప్పించే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. ఎన్నికల నాటికి ఈ విషయంలో జగన్ యూటర్న్ తీసుకున్నా.. ఆశ్చర్యం ఉండక పోవచ్చన్నది విశ్లేషకుల మాట. అయితే.. తమ మేనిఫెస్టోలో సైతం మావిగన్ చేరుస్తామని జగన్ చెప్పిన దరిమిలా.. ఏం జరుగుతుందన్నది చూడాలి. ఏదేమైనా వైసీపీ రాజకీయకోణంలో రాజధానిని చూడడం.. దీనిని ప్రజలపై రుద్దే ప్రయత్నం చేయడం వంటివి వాటిపై చర్చ జరుగుతూనే ఉండడం గమనార్హం.
This post was last modified on July 20, 2026 8:50 am
ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో వస్తున్న 'ఫౌజీ' సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనకర్లేదు. 1940ల…
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. ఇద్దరు అగ్ర హీరోలు ఒకే స్క్రీన్ పై కనిపిస్తే…
లెనిన్ మరో సక్సెస్ మీట్ ఇవాళ జరిగింది. అఖిల్, నాగార్జున రావడంలో ఆశ్చర్యం లేదు కానీ ఈసారి నాగచైతన్య తోడవ్వడంతో…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ మీద కిరణ్ అబ్బవరం భారీ నమ్మకం పెట్టుకున్నాడు. క,…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో తరం వారసుడు వెండితెరకు పరిచయమవుతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్నయ్య…
అయోధ్య రామ్ ఆలయ విరాళాల నిధుల దుర్వినియోగంపై వస్తున్న ఆరోపణల వ్యవహారం ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం ముందుకు చేరింది.…