బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఎప్పుడూ తన ఫిట్నెస్తో అభిమానులను ఎట్రాక్ట్ చేస్తుంటాడు. కానీ సడెన్గా ఆయన కాస్త నీరసంగా కనిపించేసరికి సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఒక సూపర్ స్టార్ వయసు పైబడటం, లేదా అలసిపోవడం అనేది సహజమే అయినా, అది క్షణాల్లో సెన్సేషన్ అవుతుంది. తన ఆరోగ్యం బాగాలేదంటూ వస్తున్న వదంతులకు కంగారు పడకుండా సల్మాన్ తనదైన స్టైల్లో అదిరిపోయే పంచ్ ఇచ్చాడు.
శుక్రవారం ముంబైలో జరిగిన స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ డేటా సెంటర్ ప్రారంభోత్సవంలో సల్మాన్ పాల్గొన్నాడు. క్యాప్ ధరించి, చాలా సన్నగా, ముఖంలో అలసటతో కనిపించాడు. ఆ ఫోటోలు చూసిన అభిమానులు భాయ్ కి ఏమైంది, అనారోగ్యంతో ఉన్నాడా అంటూ ఆందోళన చెందారు. కొందరైతే ధర్మేంద్రలా వయసు పైబడిన ఛాయలు కనిపిస్తున్నాయంటూ కామెంట్స్ చేశారు.
పీఆర్ టీమ్ తో అఫీషియల్ స్టేట్మెంట్ ఇప్పించడం కంటే, నేరుగా తానే రంగంలోకి దిగడం సల్మాన్ స్టైల్. ఆదివారం రాత్రి తన ఇన్స్టాగ్రామ్లో కొన్ని బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. అందులో కౌబాయ్ హ్యాట్, డెనిమ్ జాకెట్ వేసుకుని ఫుల్ యాక్టివ్గా ఫోజులిచ్చాడు. దానికి తోడు మీ అందరి ఆరోగ్యం ఎలా ఉంది అంటూ తనపై వస్తున్న పుకార్లకు సరదాగా కౌంటర్ వేశాడు.
సల్మాన్ వేసిన ఈ సెటైర్తో సోషల్ మీడియాలో నెగెటివ్ చర్చ మొత్తం ఒక్కసారిగా పాజిటివ్ గా మారిపోయింది. అప్పటిదాకా ఆందోళన చెందిన అభిమానులు ఆయన ఇచ్చిన ఈ రిప్లైకి ఫిదా అయిపోయారు. ఆరోగ్యపరమైన రూమర్స్ కి చెక్ పెట్టిన సల్మాన్ ఇప్పుడు తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ చేశాడు. అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న మాతృభూమి మే వార్ రెస్ట్ ఇన్ పీస్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సల్మా ఖాన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిత్రాంగద సింగ్ కూడా నటిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్లో రావాల్సిన ఈ సినిమా వాయిదా పడినా, ప్రాజెక్ట్ ఆగిపోలేదని మేకర్స్ స్పష్టం చేశారు.
This post was last modified on July 20, 2026 5:46 pm
రష్యా సాయుధ బలగాలు జరిపిన దాడిలో కేరళకు చెందిన అఖిల్ జోయన్ అనే 26 ఏళ్ల నావికుడు ప్రాణాలు కోల్పోయాడు.…
1997 వినీత్, సౌందర్య జంటగా ఆరో ప్రాణం అనే సినిమా వచ్చింది. మంచి హిట్. చక్కని పాటలతో పాటు క్లిష్టమైన…
ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ టీమిండియా బౌలింగ్ లోపాలపై ఒక పెద్ద డేంజర్ బెల్ మోగించింది. బ్యాటింగ్ బలంగా…
సినిమాకు హైప్ తీసుకురావడంలో ఒక్కో దర్శకుడిది ఒక్కో స్టైల్. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకులు తమ…
టీడీపీ ని నిలబెట్టింది కార్యకర్తలు.. వారి అండతోనే పార్టీ విజయం దక్కించుకుంటోంది- అని పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ…
దేశరాజధాని ఢిల్లీలో సోమవారం చోటు చేసుకున్న పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా అనేక వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. అందరి టార్గెట్ ఒక్కటే..…