Political News

ప‌వ‌న్‌కు మాయ‌ని మ‌చ్చ‌గా ఆ ఒక్క వ్య‌వ‌హారం!

అవును! ఇప్పుడు జ‌న‌సేన విష‌యంలో తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో ఇదే మాట వినిపిస్తోంది. పార్టీ అధినేత ప‌వ‌న్ ప‌రువు పోతోంద‌ని, ఆయ‌న ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోవాల‌ని కాపు సామాజిక వ‌ర్గానికిచెందిన నాయ‌కుల‌తోపాటు జ‌న‌సేన పార్టీ సానుభూతి ప‌రులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రి ఎందుకు ఇలా వ్యాఖ్యానిస్తున్నారు? ఏం జ‌రిగింది? అనే విష‌యాలు ఆస‌క్తిగా ఉన్నాయి. విష‌యంలోకి వెళ్తే.. గ‌త ఎన్నిక‌ల్లో తొలిసారి పోటీ చేసిన జ‌న‌సేన త‌ర‌ఫున ఒకే ఒక్క అభ్య‌ర్థి తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలు నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు. ఆయ‌నే ఎస్సీ నాయ‌కుడు రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌.

జ‌న‌సేన త‌ర‌ఫున గెలిచిన వ‌ర‌ప్ర‌సాద్‌పై ప‌వ‌న్ చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు. గంగిగోవు పాలు.. అన్న‌ట్టుగా త‌మ‌కు ఒక్క స‌భ్యుడు ఉన్నా.. అసెంబ్లీలో ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌డ‌తామంటూ ప‌వ‌న్ వ్యాఖ్యా నించారు. ఇక‌, రాపాక కూడా తాను పార్టీలోనే ఉంటాన‌ని.. వైసీపీలోకి వెళ్ల‌బోన‌ని అప్ప‌ట్లో గ‌ట్టిగానే చెప్పుకొచ్చారు. కానీ, అనూహ్యంగా ఆయ‌న వైసీపీకి మ‌ద్ద‌తుదారుగా మారిపోయారు. స‌రే! రాజ‌కీయాల్లో ఇవ‌న్నీ మామూలే అనుకున్నారు అంద‌రూ. ఇక ప‌వ‌న్ కూడా చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించారు. కేసులు కావొచ్చు, రాజ‌కీయ అవ‌స‌రాలు కావొచ్చు.. అని స‌రిపెట్టుకున్నారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. రాపాక వ్య‌వ‌హార శైలి మాత్రం ప‌వ‌న్‌ను, పార్టీ నేత‌ల‌ను రెచ్చ‌గొట్టేలా ఉండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

రాపాక మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వైసీపీ కార్యకర్తనేనంటూ పవన్ కు షాకిచ్చారు. “సీఎం జగన్‌ నన్ను వైసీపీలో కొనసాగమని చెబుతుంటే మీకు అభ్యంతరం ఏంటి?” అని ప్రశ్నించారు. అయితే.. ఈ వ్యాఖ్య‌లు ప‌వ‌న్ అభిమానులను, జ‌న‌సేన సానుభూతి ప‌రులనే కాకుండా.. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోని రాజ‌కీయ నేత‌ల‌ను కూడా క‌ల‌వ‌రపెడుతోంది. ఒక్క అభ్య‌ర్థిని గెలిపించుకుని కూడా ఆయ‌న‌ను దారిలో న‌డిపించ‌లేక పోతున్నారు. ఇక‌, పార్టీని ఏవిధంగా న‌డిపిస్తారు? అంటూ.. కొంద‌రు చూచాయ‌గా ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు సంధిస్తున్నారు. వాస్త‌వానికి చూస్తే.. ఇది నిజ‌మ‌నే అనిపిస్తోంది.

త‌న పార్టీ టికెట్‌పై గెలిచిన అభ్య‌ర్థి.. అధికార పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న క్ర‌మంలో ప‌వ‌న్ ఎందుకు ఉపేక్షిస్తున్నారు? అనే ప్ర‌శ్న త‌ర‌చుగా వినిపిస్తూనే ఉంది. ఇక‌, రాపాక వ్య‌వ‌హార శైలితో ఏకంగా పార్టీ ఉనికికే ప్ర‌మాద‌క‌రంగా మారింది. రేపు ఓ న‌లుగురిని గెలిపించినా.. ఇదే ప‌రిస్థితి క‌దా! అని ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లోని కాపు నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు. కాబ‌ట్టి.. త‌క్ష‌ణ‌మే ఈ విష‌యంలో ప‌వ‌న్ ఏదో ఒక నిర్ణ‌యం తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on January 8, 2021 10:41 am

Share

Recent Posts

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

1 minute ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

53 minutes ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

1 hour ago

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్

ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…

2 hours ago

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి కుటుంబాల్లో సమస్యలు లేవా…?

పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…

2 hours ago

ఫార్చునర్‌లో వచ్చి… చీపురు పట్టి రోడ్లు ఊడ్చేసి వెళ్తాడు!

ఫార్చునర్‌ కారు.. చేతిలో చీపురు! కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్‌లో కనిపిస్తున్న ఈ దృశ్యం ఇప్పుడు అందరి దృష్టినీ…

2 hours ago