తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్న రీతిలో జరుగుతున్న మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ కు మద్దతిచ్చిన కడియం శ్రీహరి తన ఇలాకాలో వేలు పెడుతున్నారంటూ కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కడియం శ్రీహరిపై తాజాగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే కడియం శ్రీహరి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని, ఆ తర్వాత మంత్రి పదవి తెచ్చుకోవాలని సవాల్ విసిరారు.
ముందు నుంచి కడియం శ్రీహరి బుద్ధి ఇంతేనని, మాజీ మంత్రి అయిన శ్రీహరి ఎమ్మెల్యేగా ఇమడలేకపోతున్నారని సురేఖ విమర్శించారు. అటువంటి సందర్భంలో రాజీనామా చేసి నోర్మూసుకుని ఇంట్లో కూర్చోవాలని లేదంటే మంత్రి పదవి తెచ్చుకునేందుకు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా, తనను బ్లేమ్ చేయాలని చూసినా, జిల్లాను డిస్టర్బ్ చేయాలని చూసిన ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు.
దేవాదయ శాఖకు సంబంధించిన అంశాలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏకపక్షంగా సమీక్షా సమావేశం నిర్వహించడంపై కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే శ్రీహరిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు ఆమె ఫిర్యాదు చేశారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 15 ఏళ్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న కడియం శ్రీహరికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిస్తే ఆయన చేసింది తప్పు అని ఒప్పుకుంటారని సురేఖ అన్నారు. అలా కాకుండా, ఆయన తనపై ఎదురు దాడికి దిగడం కరెక్ట్ కాదని హితవు పలికారు.
కడియంతో తాడోపేడో తేల్చుకుంటానని చెప్పారు. పార్టీ ప్రతిష్టను ఇటువంటి అంశాలు దెబ్బతీస్తాయని, అందువల్లే మొదట్లోనే ఈ తరహా అంశాలను అడ్డుకునేందుకు తాను మీడియా ముందుకు వచ్చి మాట్లాడానని వివరణనిచ్చారు.
This post was last modified on July 9, 2026 8:27 pm
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…
ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…