తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్న రీతిలో జరుగుతున్న మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ కు మద్దతిచ్చిన కడియం శ్రీహరి తన ఇలాకాలో వేలు పెడుతున్నారంటూ కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కడియం శ్రీహరిపై తాజాగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే కడియం శ్రీహరి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని, ఆ తర్వాత మంత్రి పదవి తెచ్చుకోవాలని సవాల్ విసిరారు.
ముందు నుంచి కడియం శ్రీహరి బుద్ధి ఇంతేనని, మాజీ మంత్రి అయిన శ్రీహరి ఎమ్మెల్యేగా ఇమడలేకపోతున్నారని సురేఖ విమర్శించారు. అటువంటి సందర్భంలో రాజీనామా చేసి నోర్మూసుకుని ఇంట్లో కూర్చోవాలని లేదంటే మంత్రి పదవి తెచ్చుకునేందుకు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా, తనను బ్లేమ్ చేయాలని చూసినా, జిల్లాను డిస్టర్బ్ చేయాలని చూసిన ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు.
దేవాదయ శాఖకు సంబంధించిన అంశాలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏకపక్షంగా సమీక్షా సమావేశం నిర్వహించడంపై కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే శ్రీహరిపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు ఆమె ఫిర్యాదు చేశారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, 15 ఏళ్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న కడియం శ్రీహరికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిస్తే ఆయన చేసింది తప్పు అని ఒప్పుకుంటారని సురేఖ అన్నారు. అలా కాకుండా, ఆయన తనపై ఎదురు దాడికి దిగడం కరెక్ట్ కాదని హితవు పలికారు.
కడియంతో తాడోపేడో తేల్చుకుంటానని చెప్పారు. పార్టీ ప్రతిష్టను ఇటువంటి అంశాలు దెబ్బతీస్తాయని, అందువల్లే మొదట్లోనే ఈ తరహా అంశాలను అడ్డుకునేందుకు తాను మీడియా ముందుకు వచ్చి మాట్లాడానని వివరణనిచ్చారు.
This post was last modified on July 9, 2026 8:27 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…