ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకు మరింత చేరువయ్యేలా వ్యవహరిస్తున్నారు. ఎవరో రావాలి.. ఏదో చెప్పాలి.. అని ఎదురు చూడకుండా.. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన ఆయన.. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తనసొంత నియోజకవర్గం కుప్పంలో ప్రజలను నేరుగా కలుసుకున్నారు. వారి నుంచి అర్జీలు తీసుకున్నారు.
మూడు రోజుల పర్యటన నిమిత్తం కుప్పం వచ్చిన చంద్రబాబు శనివారం నేరుగా ప్రజలతో మమేకమయ్యారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా సీఎంతో భేటీ అయ్యేందుకు వచ్చారు. అయితే.. వారిని హాల్లోనే కూర్చోబెట్టిన సీఎం.. అప్పటికే బయట వేచి ఉన్న ప్రజలను కలుసుకున్నారు. వారిని ఆప్యాయంగా పలకరించారు. సమస్యలు తెలుసుకున్నారు. అలానే.. స్వర్ణ కుప్పం ప్రాంత అభివృద్ధిని వారికి వివరించారు. ప్రతి ఇంటికీ సోలార్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను చెప్పారు. విద్యుత్ వినియోగంలో సౌర విద్యుత్కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.
ఇక, వ్యక్తిగత సమస్యలను కూడా తెలుసుకున్న చంద్రబాబు పలువురికి అక్కడికక్కడ ఆర్థిక సాయం ప్రకటించారు. కొందరికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు అందించారు. ఇక, కుప్పం నియోజకవర్గంలోని గ్రామాల పరిధిలో అవలంభిస్తున్న నెట్ జీరో(వ్యర్థాల రహిత) వ్యవస్థను అడిగి తెలుసుకున్నారు. పలు ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ వ్యవస్థ గురించి తెలుసుకున్నారు. అలానే విద్యుత్ వినియోగంతో నడిచే ఇండక్షన్ కుక్కర్లు, టెర్రస్ గార్డెనింగ్ వంటి వివరాలను పలువురు చంద్రబాబుకు చెప్పారు.
ఎందుకిలా?
మారుతున్న రాజకీయ వాతావరణం.. ప్రజల అభిరుచులకు అనుగుణంగా చంద్రబాబు తనను తాను మార్పు చేసు కుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా తన సొంత నియోజకవర్గంలో గతానికి భిన్నంగా ఆయన ఈ ఏడాది పలుమార్లు పర్యటించారు. ప్రతి ఒక్కరికీ చేరువ అవుతున్నారు. తద్వారా వైసీపీ వ్యూహాత్మక రాజకీయాలకు పరోక్షంగా చంద్రబాబు చెక్ పెడుతున్నారన్న వాదన వినిపిస్తోంది.
This post was last modified on July 4, 2026 5:09 pm
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…
ఇప్పుడు హీరోయిన్ గా కనిపించడం తగ్గించేసింది కానీ టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన బ్లాక్ బస్టర్స్ లో నటించిన ట్రాక్…
వచ్చే వారం జూలై 30 శ్రీనివాస మంగాపురం విడుదలవుతోంది. హీరో జయకృష్ణ, హీరోయిన్ రషా తదాని రెగ్యులర్ గా ప్రమోషన్లలో…
కాపు ఉద్యమ నేత, సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త ముద్రగడ పద్మనాభం విగ్రహం బెజవాడలో త్వరలోనే ఏర్పాటు కానుంది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం…
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర…