వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కొడాలి నానీపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు తాజాగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తమ తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయనను అరెస్టు చేయడం కానీ.. ఇతర చర్యలు తీసుకోవడం కానీ, చేయొద్దని పోలీసులను ఆదేశించింది. తాజా కేసులో పొలిటికల్ అప్పియరెన్స్ ఉన్నట్టు కనిపిస్తోందన్న న్యాయవాది వాదనలతో ఏకీ భవించిన కోర్టు పోలీసుల చర్యలను తప్పుబట్టింది. ఇలాంటి కేసులపై ఉన్న శ్రద్ధ.. సాధారణ పౌరుల భద్రతపై చూపించాలని సూచించింది. తమ ఆదేశాలు లేకుండా కొడాలి నానిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని న్యాయమూర్తి తేల్చి చెప్పారు.
ఏంటి వివాదం..?
2021లో అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. అయితే.. అనూహ్యంగా కరోనా రెండో దశ వ్యాప్తి చెందడంతో ఈ ఎన్నికలను అప్పటి ఎన్నికల ఏపీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ వాయిదా వేశారు. అయితే.. ఇది ఉద్దేశ పూర్వకంగా వాయిదా వేయడమేనని వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. అప్పటి సీఎం జగన్ సైతం నేరుగా మీడియా ముందుకు నిమ్మగడ్డ రమేష్కుమార్కు కులం అంటగట్టి వ్యాఖ్యలు చేశారు. ఇది పెను దుమారంగా మారింది. ఇక, అప్పటి ప్రతిపక్షం టీడీపీకి మేలు చేసేందుకే నిమ్మగడ్డ ఇలా వ్యవహరించారని కూడా అన్నారు.
ఈ క్రమంలో కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. నిమ్మగడ్డ రమేష్కుమార్, మాజీ సీఎం చంద్రబాబులను ఉద్దేశించి ఆయన దూషించారు. అదేసమయంలో స్థానిక సంస్థల ఎన్నికలపైనా ఆయన విమర్శలు చేశారు. దీంతో ఎన్నికల సంఘం అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ, అప్పటికే కొడాలి నానీ మంత్రి కావడంతో అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఇక, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా.. ఈ కేసుపై నాన్చుడు ధోరణిని అవలంభించారు. ఇటీవల సీఎం చంద్రబాబు చెంతకు ఈ కేసు వ్యవహారం చేరడంతో ఆయన విచారణకు ఆదేశించారు.
ఫలితంగా వారం కిందట పోలీసులు.. 41ఏ నోటీసులు ఇచ్చేందుకు కొడాలి నాని ఇంటికి వెళ్లగా ఎవరూ లేరని సమాధానం వచ్చింది. అయితే.. ఇంతలోనే కొడాలి తరఫున న్యాయవాది కోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు. ఇది రాజకీయ దురుద్దేశ పూరిత కేసు అని.. స్థానిక సంస్థల ఎన్నికలకు కొడాలి వ్యాఖ్యలకు సంబంధం లేదని.. రాజకీయంగా నానీని లక్ష్యంగా చేసుకుని పెట్టిన కేసు అని పిటిషన్లో పేర్కొన్నారు. ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండడంతోపాటు కేసును కొట్టివేసేలా ఆదేశించాలన్నారు. దీంతో హైకోర్టు కొడాలినానిపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని ఆదేశిస్తూ.. ఉత్తర్వులు ఇచ్చింది.
This post was last modified on July 1, 2026 6:40 am
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…
వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…