తెలంగాణలో విజయమే లక్ష్యంగా పనిచేయాలని.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ దిశానిర్దేశం చేశారు. దీనికిగాను ఈ ఏడాది జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అక్కడ ప్రజా పోరాటాల ద్వారానే అధికారం దక్కించుకున్నామని నాయకులకు చెప్పారు. ఇదే తరహాలో తెలంగాణలో కూడా విజయం దక్కించుకోవాలన్నారు.
అయితే.. తెలంగాణలో బెంగాల్ ఫార్ములా పనిచేస్తుందా? అనేది కీలక ప్రశ్న. రాష్ట్ర విభజన అనంతరం.. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పలు ప్రాజెక్టులు, నిధులు ఇప్పటి వరకు ఇవ్వలేదు. రాష్ట్ర విభజన జరిగింది యూపీఏ(కాంగ్రెస్) హయాంలోనే అయినా.. ఆతర్వాత..వరుసగా ఇప్పటివరకు 12సంవత్సరాలుగా బీజేపీనే అధికారంలో ఉంది. అలాంటప్పుడు.. రాష్ట్రాన్ని ఇచ్చామన్న క్రెడిట్లో తమకు భాగం ఉందని చెబుతున్నా.. విభజన చట్టంలో పేర్కొన్న మేరకు తెలంగాణకు ఏమేరకు సాయం అందించారన్నది ప్రశ్న.
ముఖ్యంగా బెంగాల్కు, తెలంగాణకు మధ్య పోలిక లేదు. అక్కడ క్షేత్రస్థాయిలో కమ్యూనిస్టులు పట్టుకోల్పోవడం, నిన్నటి వరకు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీపై అవినీతి, అక్రమాల ముద్ర పడడం.. మమతా బెనర్జీ తర్వాత.. ఎవరు? అనే ప్రశ్నకు కుటుంబ పరంగా నాయకులు ముందుకు వచ్చిన దరిమిలా.. ప్రజలు వారిని తిరస్కరించడం అనేది బీజేపీకి కలిసి వచ్చింది. అదేసమయంలో బీజేపీకి.. సువేందు అధికారం ఐకాన్ నాయకుడిగా ఉన్నారు. ఇవన్నీ కలిసి వచ్చి.. బీజేపీ పాగా వేసిందనే అభిప్రాయం ఉంది.
కానీ, తెలంగాణ విషయానికి వస్తే.. ప్రస్తుత అధికార పార్టీపై అవినీతి, అక్రమాల ముద్ర పడలేదు. క్షేత్రస్థాయిలో అధికారులపై మాత్రమే ఆరోపణలు వస్తున్నాయి. వీటిని సరిచేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇక, బీజేపీలో బెంగాల్ తరహా ఐకాన్ నాయకుడు తెలంగాణలో లేకపోవడంతోపాటు.. పార్టీలో ఆధిపత్య, అంతర్గత కుమ్ములాటలు ఎక్కువగా జరుగుతున్నాయి. మరోవైపు.. ఓడిపోయినప్పటికీ.. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో పట్టు సడలలేదు.
మరోవైపు.. కవిత వంటి నాయకురాళ్లు దండిగా ఉన్న నేపథ్యంలో బెంగాల్ తరహా రాజకీయాలు తెలంగాణలో చేయడం సాధ్యం కాదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇక, కీలకమైన మరో విషయం.. సీఎం రేవంత్ రెడ్డిపై బలమైన యువ నేతగా, మంచి గళం ఉన్న నాయకుడిగా కూడా గుర్తింపు ఉంది. సో.. ఇవన్నీ.. ఉండగా బెంగాల్ ఫార్ములాను నమ్ముకోవడం అన్నది తెలంగాణ బీజేపీకి సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు.
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా నెట్ ఫ్లిక్స్ చేసుకునే ఓటిటి విండో 28 రోజులు ఉంటుంది. గుంటూరు కారం,…
సుకుమార్ అంటే ఇప్పుడు కేవలం ఒక దర్శకుడు కాదు.. ఒక వ్యవస్థ. కేవలం దర్శకత్వానికి పరిమితం కాకుండా ఆయన నిర్మాతగానూ…
ఇండియాలో క్రికెట్ పిచ్చి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇంతకుముందున్నంత ఇంటెన్స్ ఫ్యాన్స్ ఇప్పుడు లేకపోవచ్చు. ఒక ఓటమితో…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ ప్రక్షాళన తన జీవిత లక్ష్యమని ఆయన…
కెజిఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ లో హీరోయిన్ కావడంతోనే శ్రీనిధి శెట్టి దశ తిరిగిందని అందరూ అనుకున్నారు. కానీ జరిగింది…
బెల్లంకొండ శ్రీనివాస్ మన దగ్గర ఒక మిడ్ రేంజ్ హీరో. కొన్నేళ్లుగా అతను పెద్దగా సినిమాలు చేయక రేసులో బాగా…