సుకుమార్ అంటే ఇప్పుడు కేవలం ఒక దర్శకుడు కాదు.. ఒక వ్యవస్థ. కేవలం దర్శకత్వానికి పరిమితం కాకుండా ఆయన నిర్మాతగానూ వరుసగా సినిమాలు తీస్తున్నారు. ఎక్కువగా తన శిష్యులు తీసే సినిమాల్లో ఆయన నిర్మాణ భాగస్వామిగా ఉంటున్నారు. ఇటీవల రిలీజైన పెద్ది సినిమా పోస్టర్ మీదా సుకుమార్ రైటింగ్స్ బేనర్ పడింది.
తాజాగా ఇడుపు కాయితం అనే సినిమాలోనూ ఆయన నిర్మాణ భాగస్వామిగా మారారు. ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. త్వరలో మరి కొన్ని చిత్రాల్లో సుకుమార్ భాగస్వామి కాబోతున్నారు. ఐతే ఈ చిత్రాలన్నింట్లో సుకుమార్ డబ్బులు పెడతాడా.. ఆయన దగ్గర అంత డబ్బులున్నాయా.. సినీ నిర్మాణం ఎంతో రిస్కీగా మారిపోయిన ఈ రోజుల్లో ఈ లెక్కల మాస్టారు ఎందుకింత సాహసం చేస్తారు అని అనుమానాలు కలగడం సహజం.
ఐతే నిర్మాతగా సుకుమార్ లెక్కలు వేరు. ఆయన ఏ సినిమాల్లోనూ డబ్బులు పెట్టరు. తన బ్రాండును ఆయా సినిమాలకు వాడుతున్నందుకు, తన క్రియేటివ్ ఇన్ పుట్స్ తీసుకున్నందుకు ఆయన వాటా తీసుకుంటారు. అదే ఆయన పెట్టుబడి. సినిమా స్థాయిని బట్టి వచ్చే లాభాల్లో ఆయన షేర్ ఉంటుంది. చిన్న సినిమాలకు ఆయన 30 శాతం దాకా లాభాల్లో వాటా అందుకుంటారని సమాచారం.
అంటే వచ్చిన ఆదాయంలో ప్రొడక్షన్ కాస్ట్ మైనస్ చేసి వచ్చేదాంతో సుక్కుకు వాటా ఇస్తారు నిర్మాతలు. ఒకవేళ సినిమా హిట్ కాకపోతే సుక్కుకు ఏమీ రాదు. హిట్టయితే మాత్రం లాభాల్లో వాటా వస్తుంది. తాను దర్శకత్వం వహించే చిత్రాలకు కూడా సుకుమార్ వాటానే తీసుకుంటున్నారు. పుష్ప, పుష్ప-2 చిత్రాలకు ఇదే జరిగింది. ఆ చిత్రాల ద్వారా ఆయన భారీగా ఆదాయం అందుకున్నారు.
సుకుమార్ నిర్మాణ భాగస్వామిగా ఉండే చిన్న సినిమాల విషయంలో ఆయనకు ప్రతిసారీ బాగానే వర్కవుట్ అవుతోంది. సుకుమార్ రైటింగ్స్ పేరు పడడంతోనే చిన్న సినిమాలకు ఈజీగా ఓటీటీ అవుతుంది. ప్రేక్షకులు కూడా నమ్మకంతో థియేటర్లకు వస్తారు. తద్వారా వాటికి లాభాలు ఖాయంగా వస్తాయి. బుచ్చిబాబు సానా తొలి చిత్రం ఉప్పెనకు తన బ్రాండుతో పాటు క్రియేటివ్ ఇన్ పుట్స్ ఇచ్చినందుకు ఆయన భారీ లాభం అందుకున్నారు. పెద్ది సినిమాకు కూడా ఇలాంటి సహకారమే అందించగా.. ఆ చిత్రం సుక్కుకు అనుకున్నంతాగా వర్కవుట్ కాలేదని సమాచారం.
This post was last modified on June 29, 2026 6:05 am
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…
భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…