ప్రస్తుత జెన్ జీ, జెన్ ఆల్ఫా వర్గానికి చెందిన యువతలానే నేనూ జెన్ జీని అంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. టెక్నాలజీ వినియోగంలో నేను జెన్ జీ వర్గమే అని చెప్పుకొచ్చారు. పరిపాలనకు టెక్నాలజీలు అనుసంధానం చేసే అతికొద్ది నేతలలో చంద్రబాబు నాయుడు పేరు మొదటిగా వినిపిస్తుంది.
రాజకీయాల్లో కూడా ప్రస్తుతం జెన్ జీ ట్రెండ్ నడుస్తోంది. భవిష్యత్తుని ముందుగానే ఊహించి దానికి అనుగుణంగా టెక్నాలజీని ప్రోత్సహించడంలో ఆయనకు ఆయనే సాటి. హైదరాబాదుకు ఐటీ ని తీసుకురావడంలో ఎంత కృషి చేశారో పలు సందర్భాల్లో ఆయనే వివరించారు. అదేవిధంగా అమరావతికి క్వాంటం కంప్యూటర్స్ తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. వాట్సప్ గవర్నెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి వాటిని పరిపాలనలో భాగస్వామ్యం చేశారు.
జెన్ జీ ఆలోచనలకు కంటే ఆయన ఆలోచనలు వేగంగా ఉంటాయని ఈరోజు స్వయంగా చెప్పారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కిష్టంశెట్టి పల్లెలో సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రస్తుత జెన్ జీ, జెన్ ఆల్ఫా వర్గానికి చెందిన యువతలానే నేనూ జెన్ జీని. భవిష్యత్తును ముందే ఊహించి దానికి అనుగుణంగా టెక్నాలజీని ప్రోత్సహిస్తున్నాను. ఏఐ, క్వాంటం టెక్నాలజీల్లో మన యువత నిష్ణాతులు కావాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
సంజీవని కార్యక్రమంలో కూడా టెక్నాలజీకి ప్రాధాన్యం ఇచ్చారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా ఆస్పత్రి, సూపర్ స్పెషాలిటీ కేర్ వరకూ వైద్య సేవలు అందేలా ఈ సంజీవని డిజిటల్ హెల్త్ రికార్డుల ద్వారా వ్యక్తిగత ఆరోగ్య పర్యవేక్షణ ఉంటుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి సూపర్ స్పెషాలిటీ వరకూ మొత్తం ఆరోగ్య వ్యవస్థను ఒకే డిజిటల్ వేదికపై అనుసంధానిస్తారు. సంజీవని ద్వారా డాక్టర్ అపాయింట్మెంట్ బుకింగ్, ఆరోగ్యంపై ఫాలోఅప్, వర్చువల్ కనెక్ట్ ద్వారా వైద్యసేవలు అందుతాయి. వైద్య రంగంలో టెక్నాలజీని అనుసంధానిస్తూ చంద్రబాబు నాయుడు ఆలోచనలు చేస్తున్నారు.
This post was last modified on June 27, 2026 9:05 pm
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…