Political News

ఆ ఇద్దరూ కలిసి సాధించారు!

నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి అనుకున్న ఫలితాన్ని సాధించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు మార్గం సుగమం అయ్యింది. ఇదంతా జరగడానికి కేవలం రెండు రోజుల సమయం మాత్రమే పట్టింది. హైదరాబాద్ మెట్రోను స్వాధీనం చేసుకోవడంతో పాటుగా ఫేజ్ 2 పనుల కోసం తెలంగాణ సర్కారు ప్రతిపాదిస్తే.. రాజకీయ రచ్చ తర్వాత కేంద్రం కూడా తోడ్పాటు అందించింది. ఫలితమే ఫేజ్ 2కు రోడ్ మ్యాప్ సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది.

హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 కోసం తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు ఆది నుంచి పకడ్బందీగానే ముందుకు సాగింది. ఫేజ్ 1 ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడంతో పాటుగా ఫేజ్ 2 ను సొంతంగానే చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కదిలింది. లార్సెన్ అండ్ టోబ్రో (ఎల్ అండ్ టీ) నుంచి ఫేజ్ 1 ను స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన నిధులను ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ ఎఫ్ సీ) నుంచి రుణాన్ని కూడా సాదించింది. అయితే ఈ రుణం ఆలస్యం కావడంతో రేగిన రచ్చ.. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల మధ్య వాగ్యుద్ధానికి దారి తీసింది. ఈ యుద్ధం కూడా మంచి ఫలితాన్నే ఇచ్చిందని చెప్పాలి.

మెట్రోపై నెలకొన్న రచ్చకు ముగింపు పలికే దిశగా సాగిన రేవంత్, కిషన్ రెడ్డిలు… సోమవారం నుంచి కలిసి ఢిల్లీలో చక్రం తిప్పారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి కిషన్ రెడ్డితో కలిసి రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రోపై వారి మధ్య కీలక చర్చ జరిగింది. రేవంత్ కాంగ్రెస్ అయినా.. కిషన్ రెడ్డి బీజేపీ అయినా… పార్టీలను పక్కనపెట్టి తన వద్దకు వచ్చిన ఆ ఇద్దరిని చూసి వైష్ణవ్ కూడా వారికి చేయందించారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ సమావేశంలో చర్చించారు.

సోమవారం రాత్రి పొద్దుపోయేదాకా ఈ సమావేశం జరగగా… మంగళవారం ఉదయమే రేవంత్, కిషన్ రెడ్డిలు కలిసి అశ్వనీ వైష్ణవ్ తో మరోమారు భేటీ అయ్యారు. ఈ సారి ఆ ఇద్దరు కాస్తా ముగ్గురికి పెరిగింది. వారు ముగ్గురూ కలిసి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వద్దకు వెళ్లారు. హైదరాబాద్ మెట్రో విస్తరణపై ఆయనతో చర్చించిన ఆ ముగ్గురు… కేంద్ర పట్టణాభివృద్ధి శాఖనూ ఒప్పించేశారు. ఇంకేముంది… హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 విలువ నిర్ధారణ, ఫేజ్ 2 సమగ్ర నివేదిక రూపకల్పనకు ఆమోద ముద్ర పడిపోయింది.

నివేదిక రూపకల్పనను ఎస్భీఐ క్యాప్స్ కు అప్పగించేందుకు ఏకగ్రీవ నిర్మాణం తీసుకోగా… ఆ పనిని కూడా అక్కడికక్కడే ముగించేశారు. ఇక ఈ అధ్యయనంలో ఎస్బీఐ కార్ప్ కు సహకారం అందించేందుకు కేంద్రం ప్రభుత్వం నుంచి ఓ అధికారి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో అధికారిని ఎంపిక చేశారు. నివేదిక తయారీని వేగవంతం చేయడంతో పాటుగా ఎస్బీఐ క్యాప్స్ కు అవసరమైన సహకారాన్ని అందించడం వీరి బాధ్యతగా నిర్దేశించారు. వెరసి రాజకీయాలు పక్కనపెట్టేసిన రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలు హైదరాబాద్ మెట్రో మలిదశకు మార్గం సుగమం చేశారు.

Kumar

Recent Posts

ఒక్క ఫొటో… అన్ని అనుమానాల‌కూ స‌మాధానం

ప్ర‌తి సంవ‌త్స‌రం విజ‌య్‌కి స్పెష‌ల్ పిక్‌తో పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పే త్రిష‌.. ఈసారి చెప్ప‌లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఆయ‌న్ని…

43 minutes ago

ఒక నయనతార.. ఒక త్రిష.. ఒక నివేథా

కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…

3 hours ago

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

5 hours ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

6 hours ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

6 hours ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

6 hours ago