ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని అన్ ఫాలో అయింది. కాబట్టి ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్లే. ఇద్దరూ విడిపోయినట్లే అని.. నిన్నట్నుంచి సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఐతే తన గురించి ఇంత రచ్చ జరుగుతుంటే ఒక రోజంతా సైలెంటుగా ఎంజాయ్ చేస్తూ ఉందో ఏమో కానీ.. మంగళవారం ఆమె అన్ని అనుమానాలకూ తెరదించేసింది.
దగ్గరుండి విజయ్తో కేక్ కట్ చేయించి తన పుట్టిన రోజు వేడుకను నిర్వహించడమే కాక.. దానికి సంబంధించి ఒక అందమైన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది త్రిష. అన్నిటికీ అర్హుడైన వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్ కూడా జోడించింది త్రిష. ఇది సోమవారం విజయ్ బర్త్ డే సందర్భంగా తీసిన ఫొటోలాగే ఉంది.
సీఎంగా సూటు బూటులో కనిపిస్తున్న విజయ్ చాన్నాళ్ల తర్వాత క్యాజువల్ లుక్లో కనిపించిన ఫొటో కావడం.. పైగా సోషల్ మీడియా రూమర్లకు చెక్ పెడుతూ షేర్ చేసిన ఫొటో కావడంతో ఇది వెంటనే వైరల్ అయిపోయింది.
తన భార్య సంగీత నుంచి విడాకులు తీసుకునే విషయంలో విజయ్ వెనక్కి తగ్గాడని ఇటీవల వార్తలు రాగా.. మరోవైపు తాను ఖాళీ చేసిన తిరుచిరాపల్లి నుంచి ఇంతకుముందు వార్తలు వచ్చినట్లు త్రిషను కాకుండా వేరొకరిని నిలబెట్టాలని విజయ్ భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి టైంలో త్రిష విజయ్కి బర్త్ డే విషెస్ చెప్పకపోవడం, ఇన్స్టాలో అన్ ఫాలో అయిందనే ప్రచారం వాళ్లిద్దరూ విడిపోయారనే అనుమానాలకు బలం చేకూర్చింది. కానీ ఒక పోస్టుతో అన్నింటికీ చెక్ పెట్టేసింది త్రిష.
This post was last modified on June 23, 2026 8:49 pm
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…