ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసు ఏపీ రాజకీయాల్లో వేడి పుట్టించగా… తాజాగా ఈ కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్కిల్ ఇన్ స్పెక్టర్ నాగరాజు అరెస్టయ్యారు. ఈ కేసుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం సీఐ నాగరాజును అదుపులోకి తీసుకుని అరెస్టు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ప్రస్తుతం తమ అదుపులోనే ఉన్న నాగరాజును విచారించిన తర్వాత ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
కాపు సామాజిక వర్గానికి చెందిన సాయికృష్ణపై 20కి పైగా కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసుల విచారణ పేరిట అతడిని కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు పిలిపించిన సీఐ నాగరాజు… ఆ తర్వాత అతడిపై థర్గ్ డిగ్రీ ప్రయోగించారని, ఆ క్రమంలోనే అతడు మరణించాడని, అటుపై సాయి మృతదేహాన్ని పోలీసులే కాల్చి వేశారన్న ఆరోపణలు రావడంతో ఈ కేసు సంచలనంగా మారింది. రాజకీయంగానే వేడి రాజుకోవడంతో ఈ వ్యవహారంలో వాస్తవాలేమిటన్న విషయాన్ని తేల్చేందుకు కూటమి సర్కారు సిట్ ను ఏర్పాటు చేసింది.
అంతేకాకుండా సిట్ ఏర్పాటు కాకముందే.. కృఫ్ణలంక పోలీస్ స్టేషన్ లో సీఐగా పనిచేస్తున్న నాగరాజును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఆయనపై కేసు కూడా నమోదు చేసింది. గడచిన నాలుగైదు రోజులుగా విజయవాడ కేంద్రంగానే కీలక ఆధారాలను సేకరిస్తూ సాగిన సిట్.. కృష్ణలంక పీఎస్ లో సీసీటీవీ ఫుటేజీ కూడా మాయం అయ్యిందన్న విషయాన్ని గ్రహించింది. ఈ సీసీటీవీ ఫుటేజీని ఎవరు మాయం చేశారన్న దిశగా దర్యాప్తు సాగించిన సిట్..మంగళవారం నేరుగా నాగరాజు ఇంటికి చేరుకుని ఆయనను అరెస్టు చేసింది.
ఇదిలా ఉంటే… నిజాయతీగా పనిచేస్తున్న నాగరాజుపై సస్పెన్షన్ ఎత్తివేయాలని, ఆయనపై ఎలాంటి చర్యలూ తీసుకోరాదని పెద్ద సంఖ్యలో మహిళలు సోమవారం నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాగరాజును మంగళవారం సిట్ అధికారులు అరెస్టు చేస్తున్న సమయంలో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాగరాజు అరెస్టును ఖండిస్తూ కొందరు నినాదాలు చేశారు. అయినా వారిని పక్కకు తప్పించి నాగరాజును తమ అదుపులోకి తీసుకున్న సిట్.. ఆయనను అక్కడి నుంచి తరలించింది.
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…