జూన్ 21.. ప్రపంచ యోగా దినోత్సవం. భారత్ లో రూపుదిద్దుకున్న ఈ ప్రాచీన యోగా విద్యను యావత్తు ప్రపంచం ఆనుసరించడం మొదలుపెట్టి ఇది 12వ ఏడాది. 12 ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం విశ్వవ్యాప్తంగా ఎక్కడికక్కడ యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఏపీలోని విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రముఖ యోగా గుచువు రాందేవ్ బాబా ఆధ్వర్యంలో జరగగా… ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్ లు స్వయంగా పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా రాందేవ్ బాబా పక్కనే యోగాసనాలు వేసిన చంద్రబాబు… రాందేవ్ కు ఏమాత్రం తగ్గని రీతిలో యోగాసనాలు వేసి అందరినీ అబ్బురపరిచారు.
చంద్రబాబు వయస్సు 76 ఏళ్లు. ఈ వయసులో ఇంకొకరైతే.. మంచానికి పరిమితం కాకున్నా యాక్టివ్ గా అయితే కనిపించరు. వయసురీత్యా దండెత్తే రోగాలు, శారీరక రుగ్మతలతో సతమతమవ్వడం ఖాయం. అయితే ఈ వయసులోనూ చంద్రబాబు యువతకు ఏమాత్రం తీసిపోని రీతిలో… ఇంకా చెప్పాలంటే ఈ కాలం యువకులను మించి చంద్రబాబు యమా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. 4 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కొనసాగుతున్న చంద్రబాబు…ఏనాడూ విశ్రాంతి తీసుకుని ఎరగరనే చెప్పాలి. తనదైన శైలి దినచర్యతో నిత్యం చురుకుగా కనిపించే చంద్రబాబు… నేటి తరం యువతకు నిజంగానే ఆదర్శమని చెప్పక తప్పదు.
ఇక ఆదివారం నాటి యోగాసనాల విషయానికి వస్తే… ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న యోగా దినోత్సవాల్లో చంద్రబాబు స్వయంగా పాలుపంచుకున్నారు. వేలాది మంది హాజరైన ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన వేదిక మీద.. రాందేవ్ బాబా పక్కనే వేదిక మీదే చంద్రబాబు ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా ఇన్ స్ట్రక్టర్ చెబుతున్న విషయాలను ఆసక్తిగా గమనిస్తూ.. ఆ మేరకే ఆసనాలు వేసిన చంద్రబాబు.. యోగా గురువు రాందేవ్ బాబాకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆసనాలు వేశారు. ఒకటి రెండు ఆసనాల్లో బాబా కంటే బాబే మెరుగ్గా ఆసనాలు వేశారని చెప్పాలి.
మరకట ఆసనం, సేతు బంధాసనం, ఉత్తర పాదాసనం, పవన ముక్తాసనం ఇలా ఆసనాల పేర్లు వినిపిస్తుంటే..వాటికి తగ్గట్టుగా ఏమాత్రం ఆలస్యం లేకుండానే చంద్రబాబు ఆసనాలు వేశారు. కొన్ని ఆసనాల సమయంలో ఆయా ఆసనాలు వేసేందుకు చాలా మంది ఇబ్బంది పడ్డా.. చంద్రబాబు మాత్రం యోగాలో సమగ్ర పట్టు కలిగిన వారిలా ఆసనాలను పక్కాగా వేశారు. కాళ్లను గాల్లోకి పైకి లేపడంలో చంద్రబాబు ఈజీనెస్ చూసి అంతా ఆశ్చర్యానికి లోనయ్యారని చెప్పక తప్పదు. 76 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు ఇంత చక్కగా ఆసనాలు వేసిన తీరు నిజంగానే ఆసక్తి రేకెత్తించింది. ఇక లోకేశ్ కూడా తన తండ్రి చంద్రబాబు మాదిరే యోగాసనాల్లో లీనమైపోయిన తీరు ఆకట్టుకుంది.
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…