హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా దారుణంగా డిజాస్టర్ అవుతోంది. గత వారం ఆమె నటించిన భారత భాగ్య విధాత విడుదలైన సంగతి తెలిసిందే. ముంబై నగరాన్ని వణికించిన 2008 టెర్రరిస్టుల దాడుల్లో ఒక ఆసుపత్రి సిబ్బంది చూపించిన ధైర్య సాహసాలు, సేవలను హైలైట్ చేసే ఉద్దేశంతో దర్శకుడు మనోజ్ తపాడియా దీన్ని తెరకెక్కించారు కానీ జనాలు పెద్దగా పట్టించుకోలేదు.
ఫలితంగా రెండో వారంలో అడుగు పెట్టే నాటికి భారత భాగ్య విధాత నెట్ వసూళ్లు కేవలం అయిదున్నర కోట్లే రావడం ట్రేడ్ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందుకంటే సినిమాకు అయిన బడ్జెట్ యాభై కోట్ల పైమాట. దాంట్లో కనీసం పది శాతం కూడా రికవరీ కాలేదంటే అంతకన్నా ట్రాజెడీ మరొకటి ఉండదు. ట్విస్ట్ ఏంటంటే కొన్ని రాష్ట్రాల్లో దీనికి పన్ను మినహాయింపు ఇచ్చారు. ఫలితంగా టికెట్ రేట్లు తగ్గాయి. అయినా సరే జనం టికెట్లు కొనడం లేదు.
కంగనా ఇంతకు ముందు సినిమా ఎమర్జెన్సీ కూడా ఇదే తరహాలో సూపర్ డూపర్ ఫ్లాప్ అందుకుంది. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే కంగనా పాపం కంటెంట్ ని నమ్ముకుని సినిమాలు చేస్తున్నా రిజల్ట్స్ మాత్రం తీవ్రంగా నిరాశ పరుస్తున్నాయి. ప్రమోషన్లు చేసి, ప్రీమియర్ షోలు వేసి ఎంత హడావిడి చేసినా సరే ఫలితం మారడం లేదు. నిజానికి భారత భాగ్య విధాత మరీ బ్యాడ్ మూవీ కాదు. కాకపోతే ఈ కాన్సెప్ట్ పట్ల ప్రేక్షకులకు అంతగా ఆసక్తి లేదంతే.
ఒక విషయం గమనిస్తే ఇలాంటి కాన్సెప్టులు వెబ్ సిరీస్ లకు బాగుంటాయి. ఆడియన్స్ కూడా వాటికే అలవాటు పడ్డారు. ఇదే 2008 దాడుల మీద ఎంతో వెబ్ కంటెంట్ ఎన్నో ఓటిటిల్లో వచ్చింది. అలాంటిది మళ్ళీ దాన్నే తీసుకుని సినిమాగా తీస్తే డబ్బులు ఇచ్చి ఎవరు చూస్తారు. కంగనా రౌనత్ పొరపడింది ఇక్కడే. పోనీ డిజిటల్ లో చూస్తున్నారా అంటే అదీ లేదు. ఓటిటిలో వచ్చినప్పుడు కూడా లైట్ తీసుకుంటున్నారు. దెబ్బకు క్వీన్ 2 కూడా వాయిదా పడేలా ఉంది.
This post was last modified on June 19, 2026 9:34 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…