హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా దారుణంగా డిజాస్టర్ అవుతోంది. గత వారం ఆమె నటించిన భారత భాగ్య విధాత విడుదలైన సంగతి తెలిసిందే. ముంబై నగరాన్ని వణికించిన 2008 టెర్రరిస్టుల దాడుల్లో ఒక ఆసుపత్రి సిబ్బంది చూపించిన ధైర్య సాహసాలు, సేవలను హైలైట్ చేసే ఉద్దేశంతో దర్శకుడు మనోజ్ తపాడియా దీన్ని తెరకెక్కించారు కానీ జనాలు పెద్దగా పట్టించుకోలేదు.
ఫలితంగా రెండో వారంలో అడుగు పెట్టే నాటికి భారత భాగ్య విధాత నెట్ వసూళ్లు కేవలం అయిదున్నర కోట్లే రావడం ట్రేడ్ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందుకంటే సినిమాకు అయిన బడ్జెట్ యాభై కోట్ల పైమాట. దాంట్లో కనీసం పది శాతం కూడా రికవరీ కాలేదంటే అంతకన్నా ట్రాజెడీ మరొకటి ఉండదు. ట్విస్ట్ ఏంటంటే కొన్ని రాష్ట్రాల్లో దీనికి పన్ను మినహాయింపు ఇచ్చారు. ఫలితంగా టికెట్ రేట్లు తగ్గాయి. అయినా సరే జనం టికెట్లు కొనడం లేదు.
కంగనా ఇంతకు ముందు సినిమా ఎమర్జెన్సీ కూడా ఇదే తరహాలో సూపర్ డూపర్ ఫ్లాప్ అందుకుంది. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే కంగనా పాపం కంటెంట్ ని నమ్ముకుని సినిమాలు చేస్తున్నా రిజల్ట్స్ మాత్రం తీవ్రంగా నిరాశ పరుస్తున్నాయి. ప్రమోషన్లు చేసి, ప్రీమియర్ షోలు వేసి ఎంత హడావిడి చేసినా సరే ఫలితం మారడం లేదు. నిజానికి భారత భాగ్య విధాత మరీ బ్యాడ్ మూవీ కాదు. కాకపోతే ఈ కాన్సెప్ట్ పట్ల ప్రేక్షకులకు అంతగా ఆసక్తి లేదంతే.
ఒక విషయం గమనిస్తే ఇలాంటి కాన్సెప్టులు వెబ్ సిరీస్ లకు బాగుంటాయి. ఆడియన్స్ కూడా వాటికే అలవాటు పడ్డారు. ఇదే 2008 దాడుల మీద ఎంతో వెబ్ కంటెంట్ ఎన్నో ఓటిటిల్లో వచ్చింది. అలాంటిది మళ్ళీ దాన్నే తీసుకుని సినిమాగా తీస్తే డబ్బులు ఇచ్చి ఎవరు చూస్తారు. కంగనా రౌనత్ పొరపడింది ఇక్కడే. పోనీ డిజిటల్ లో చూస్తున్నారా అంటే అదీ లేదు. ఓటిటిలో వచ్చినప్పుడు కూడా లైట్ తీసుకుంటున్నారు. దెబ్బకు క్వీన్ 2 కూడా వాయిదా పడేలా ఉంది.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…