ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సింగపూర్ ప్రధాని అధికారిక నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు జరిగిన భేటీలో అమరావతి రాజధాని నిర్మాణం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలపై చర్చ జరిగింది.
ఈ సందర్భంగా అమరావతి నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయో సింగపూర్ ప్రధాని ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజధానిలో విద్యాసంస్థలు, రహదారులు, మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో చేపడుతున్న నిర్మాణాలపై ఆయన ఆసక్తి చూపినట్లు తెలిపింది.
అమరావతి నిర్మాణ ప్రగతిని వివరించిన సీఎం చంద్రబాబు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో రాజధానిని అభివృద్ధి చేస్తున్నామని, భవిష్యత్తులో అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితాలో అమరావతి నిలుస్తుందని పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి సేద్యంతో పండిస్తున్న ఉద్యాన ఉత్పత్తులు, ఆక్వా ఉత్పత్తుల దిగుమతిపై పరిశీలించాలని సింగపూర్ ప్రధానిని కోరారు.
అనంతరం సీఎం చంద్రబాబు సింగపూర్ విదేశాంగ మంత్రి వివిన్బాలకృష్ణన్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో కూడా అమరావతి రాజధాని అభివృద్ధి అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఆంధ్రప్రదేశ్లో సమృద్ధిగా ఉన్నాయని సీఎం వివరించారు.
తయారీ రంగంతో పాటు సేవల రంగంలోనూ రాష్ట్రం వేగంగా ముందుకు సాగుతోందని, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో, సింగపూర్ తరహాలో అభివృద్ధి చేయడానికి ఇరు పక్షాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఈ సమావేశాల్లో చర్చించినట్లు సమాచారం.
This post was last modified on June 15, 2026 9:19 pm
వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్తరాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్యవహారంతో పాటు.. పార్టీలో మరింత మంది…
జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…