ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సింగపూర్ ప్రధాని అధికారిక నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు జరిగిన భేటీలో అమరావతి రాజధాని నిర్మాణం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలపై చర్చ జరిగింది.
ఈ సందర్భంగా అమరావతి నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయో సింగపూర్ ప్రధాని ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజధానిలో విద్యాసంస్థలు, రహదారులు, మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో చేపడుతున్న నిర్మాణాలపై ఆయన ఆసక్తి చూపినట్లు తెలిపింది.
అమరావతి నిర్మాణ ప్రగతిని వివరించిన సీఎం చంద్రబాబు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో రాజధానిని అభివృద్ధి చేస్తున్నామని, భవిష్యత్తులో అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితాలో అమరావతి నిలుస్తుందని పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి సేద్యంతో పండిస్తున్న ఉద్యాన ఉత్పత్తులు, ఆక్వా ఉత్పత్తుల దిగుమతిపై పరిశీలించాలని సింగపూర్ ప్రధానిని కోరారు.
అనంతరం సీఎం చంద్రబాబు సింగపూర్ విదేశాంగ మంత్రి వివిన్బాలకృష్ణన్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో కూడా అమరావతి రాజధాని అభివృద్ధి అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఆంధ్రప్రదేశ్లో సమృద్ధిగా ఉన్నాయని సీఎం వివరించారు.
తయారీ రంగంతో పాటు సేవల రంగంలోనూ రాష్ట్రం వేగంగా ముందుకు సాగుతోందని, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో, సింగపూర్ తరహాలో అభివృద్ధి చేయడానికి ఇరు పక్షాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఈ సమావేశాల్లో చర్చించినట్లు సమాచారం.
This post was last modified on June 15, 2026 9:19 pm
గ్రాండ్ ఓల్డ్ ట్రంక్ పార్టీ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. వరుసగా హ్యాట్రిక్ కొట్టి అధికారంలో ఉన్న…
‘ఇరుముడి’ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘మల్లెపూల పల్లకి’ పాట వచ్చేసింది. అయ్యప్ప భక్తులకు ఈ పాట కొత్తది కాదు.…
ఈ రోజు నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యారు. ఈ నెల 17 నుంచి 20 వరకు ఈ…
‘పెద్ది’ తర్వాత బుచ్చిబాబు సానా నెక్స్ట్ సినిమా ఎవరితో అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ ఆయన దగ్గర ఉన్న…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబుకు ఏపీ కేబినెట్ లో మంత్రి పదవి…
అదేదో తుఫాను తరిమినట్టు ఫ్యామిలీ ప్రేక్షకులను విశ్వనాథ్ అండ్ సన్స్ బలంగా థియేటర్ల వైపుకు లాగింది. ఆశ్చర్యకరంగా తమిళనాడు కంటే…