కాపు ఉద్యమ మాజీ నాయకుడు, ప్రస్తుత వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంతో ప్రముఖ నాయకుడు, దివంగత వంగవీటి రంగా కుమార్తె.. ఆశా కిరణ్ భేటీ అయ్యారన్న వార్త ఉభయ గోదావరి జిల్లాల్లో చక్కర్లు కొడుతోంది. గత ఏడాది మధ్యలో తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు.. ఆశా కిరణ్ మీడియా ముందు ప్రకటించారు. అయితే.. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల ద్వారా ముందు ప్రజా క్షేత్రంలోకి అడుగు పెడతానని.. తర్వాత రాజకీయాలవైపు వస్తానని ఆమె అప్పట్లో చెప్పారు.
ఆ తర్వాత.. రంగా వర్థంతిని పురస్కరించుకుని విజయవాడ నుంచి ర్యాలీగా విశాఖకు వెళ్లారు. అక్కడ కార్యక్రమం నిర్వహించారు. కానీ, ఆ తర్వాత.. ఇప్పటి వరకు వంగవీటి ఆశా కిరణ్ వార్తలు కానీ.. ఆమె రాజకీ యాగాలు లేదా సేవా రంగం గురించి కానీ.. ఎక్కడా పన్నెత్తు మాట వినిపించలేదు. దీంతో ఇక, ఆశా కిరణ్.. తెరమరుగు అయ్యారన్న చర్చ కొన్నాళ్లుగా సాగుతోంది. అయితే.. హఠాత్తుగా మళ్లీ ఆశా కిరణ్ గురించిన వార్తలు.. గోదావరి జిల్లాల్లో హల్చల్ చేస్తుండడం గమనార్హం.
ముద్రగడ సలహాలా?
అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు.. గత వారం ఆశా కిరణ్.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కిర్లంపూడిలో ఉన్న ముద్రగడ పద్మనాభం నివాసానికి వచ్చినట్టు తెలిసింది. ఆయనతో సుమారు గంట సేపు ఆమె చర్చించారని.. తన రాజకీయ రంగ ప్రవేశంపైనే ఆమె ఇంత దూరం వచ్చి.. పద్మనాభంతో భేటీ అయి ఉంటారని.. పలువురు కాపునాయకుల మధ్య చర్చ సాగుతుండడం కూడా ఈ వాదనకు బలాన్ని చేకూర్చింది. అయితే.. అటు ముద్రగడ కానీ.. ఇటు ఆశా కిరణ్కానీ.. ఎక్కడా ఈ విషయంపై మాట్లాడలేదు.
గతంలోనూ పలువురు కాపు నాయకులు ముద్రగడను కలుసుకుని, చర్చించిన తర్వాత.. వైసీపీ పంచన చేరారు. ఇలానే.. ఏదో వ్యూహాత్మక కారణంతోనే ముద్రగడ పద్మనాభాన్ని ఆశా కలిసి ఉంటారని తెలుస్తోంది. రాజకీయాల్లోకి రావాలని అనుకున్న దరిమిలా.. ఆమెను తమ పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ ప్రయత్నించింది. కానీ.. అప్పటికి ఆశా కిరణ్.. స్వచ్ఛంద కార్యక్రమాలకే పరిమితమయ్యారు. ఇప్పుడు వైసీపీ వైపు ఆమె అడుగులు వేసేందుకు.. తొలి గేట్ వేగా ముద్రగడను ఎంచుకున్నారా? అనేది ప్రశ్న. ఏదేమైనా.. ఈ విషయం ప్రస్తుతం గోదావరి పొలిటికల్ సర్కిళ్లలో చర్చనీయాంశంగా మారడం గమనార్హం.
This post was last modified on June 13, 2026 3:17 pm
నిన్న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వచ్చిన నేషనల్ హాలిడే బాక్సాఫీస్ కు సూపర్ గా కలిసి వచ్చింది. మాములుగానే వీకెండ్…
నాగచైతన్య నటిస్తున్న మిథికల్ అడ్వెంచర్ 'వృషకర్మ' రిలీజ్ డేట్ మీద గత కొద్ది రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ…
'ఫౌజీ' సినిమా నుంచి ఇప్పటిదాకా వచ్చిన పోస్టర్లు చూస్తుంటే మేకర్స్ ఇంటెన్షన్ క్లియర్ గా అర్థమవుతోంది. ప్రభాస్ ను సాఫ్ట్…
ఎన్నికల్లో నోట్లు పంపిణీ చేస్తేనే ఓట్లు వేయడం మామూలైపోయింది. గత కొన్నేళ్లుగా ఈ దుస్సాంప్రదాయం పెరిగిపోయింది. దీంతో నిజంగా ప్రజలకు…
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది.…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే ఇటీవల ప్రకటించిన `పాఠశాలల అభివృద్ధి` కార్యక్రమానికి 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలే…