వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని… చాలా రోజుల తర్వాత తన సొంతూరు గుడివాడకు శుక్రవారం వచ్చారు. 2024 ఎన్నికల్లో పరాజయం తర్వాత గుడివాడను వీడిన నాని… హైదరాబాద్ కేంద్రంగానే ఉంటున్నారు. అడపాదడపా కోర్టు కేసుల నిమిత్తం గుడివాడ వచ్చినా… ఆ తంతు ముగించుకుని వెంటనే తిరిగి వెళ్లిపోయేవారు. అయితే శుక్రవారం గుడివాడ వచ్చిన నాని… వెన్నుపోటుకు రెండేళ్లు పేరిట వైసీపీ చేపట్టిన నిరసన ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
రాజకీయ ప్రత్యర్థులపై పరుషమైన పదజాలం వాడే విషయంలో నానిని మించిన వారెవ్వరూ లేరని చెప్పాలి. టీడీపీతోనే రాజకీయాలు మొదలుపెట్టిన నాని.. ఆ తర్వాత ఆ పార్టీని వీడి వైసీపీలో చేరిపోయారు. ఆ తర్వాత ఆయన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడితో పాటు ఆయన కుమారుడు నారా లోకేశ్ లపై ఘాటు విమర్శలు చేయడం నానికి అలవాటుగా మారింది. వైసీపీ అధికారంలో ఉండగా… ఈ తరహా వైఖరికి మరింతగా పదును పెట్టిన నాని… తన పార్టీ విపక్షంలోకి చేరినా ఆ జోరును ఏమాత్రం తగ్గించలేదనే చెప్పాలి.
చాలా రోజుల తర్వాత గుడివాడ వచ్చిన నాని… నిరసన కార్యక్రమంలో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఎప్పటిలాగే చంద్రబాబు, లోకేశ్ లపై ఆయన తనదైన శైలి విమర్శలు గుప్పించారు. 2024 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలును పక్కనపెట్టేసిన బాబు, లోకేశ్ లు… ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. బాబు, లోకేశ్ లు వెన్నుపోటు విద్యలో ఆరితేరిపోయారని ఆయన వ్యాఖ్యానించారు.
ఇక వైసీపీకి గొడ్డలి పార్టీ అని పేరు పెట్టిన చంద్రబాబు, లోకేశ్ ల తీరుపై విరుచుకుపడిన నాని… టీడీపీనే పచ్చ గొడ్డలి అని ఆరోపించారు. ఇక టీడీపీ నేతలు నిత్యం పలుకుతున్న గొడ్డలి పార్టీకి నాని సరికొత్త అర్థం చెప్పారు. శివుడు, దుర్గా దేవి, వినాయకుడు… ఇలా దేవుళ్ల చేతిలో గొడ్డలి ఉంటుందని ఆయన అన్నారు.
ఈ గొడ్డలిని పాపాత్ములను శిక్షించేందుకు వాడతారన్న నాని… జగన్ చేతిలో ప్రజలే పరుశురాముడి గొడ్డలిని పెడతారని అన్నారు. 2029 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే ఆ గొడ్డలితో జగన్ టీడీపీని రాజకీయ సమాధి చేస్తారన్నారు. అవినీతిలో మునిగిపోయిన కారణంగానే జగన్ చేతిలోని గొడ్డలిని చూసి టీడీపీ భయపడుతోందని ఆయన తనదైన శైలి వ్యాఖ్య చేశారు.
This post was last modified on June 12, 2026 2:31 pm
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. "1967లో అన్నాదురై,…
ఎక్కడైనా దురద పెడితే చేతితో గోక్కుంటాం. లేదంటే పక్కన ఉన్నవాళ్లను కాస్త గోకమని అడుగుతాం. కానీ చైనాలో మాత్రం ఇదే…
తెలంగాణా అసెంబ్లీ ప్రారంభం కావడమే యుద్ధ వాతావరణం నెలకొంది. అసెంబ్లీ గేటు వద్ద ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో…
ఢిల్లీలో హాస్టల్ భవనం కూలిపోయిన ఘటనలో ఇప్పుడు మరో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఏడుగురు మరణించిన విషయం తెలిసిందే.…
తెలుగు సినిమాల్లోకి పరభాషా నటులను క్యారెక్టర్, విలన్ పాత్రల్లోకి తీసుకోవడం కొత్తేమీ కాదు. ఇది దశాబ్దాలుగా నడుస్తున్న సంప్రదాయమే. సొంత…
చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేస్తాడని నేచురల్ స్టార్ నానికి ఉన్న పేరును ‘ది ప్యారడైజ్’ బాగా దెబ్బ తీసింది.…