Political News

ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ దాకా…!

ట్రూ అప్ అంటే తెలుసు కదా. విద్యుత్ వినియోగంలో వినియోగదారులపై ఆయా ప్రభుత్వాలు ఎప్పుడో వాడిన విద్యుత్ కు… చాలా కాలం తర్వాత వసూలు చేసే అధిక చార్జీలు. ట్రూ అప్ అమలు చేస్తున్నారంటే… మనం గతంలో వాడిన విద్యుత్ పై పెంచిన బిల్లులను ప్రస్తుత వినియోగంతో కలిపి కట్టడమన్నమాట. ఏపీలో వైసీపీ హయాంలో ఐదేళ్ల వ్యవధిలోనే ఏకంగా 9 సార్లు ట్రూ అప్ చార్జీలను వసూలు చేశారు. మరి కూటమి రెండేళ్ల పాలనలో ఇది అమలు అయ్యిందా? అంటే… లేదనే చెప్పాలి. ట్రూ అప్ మాటెత్తని కూటమి.. ఏకంగా ట్రూ డౌన్ వరాలను ప్రజలకు అందించింది.

అయినా ట్రూ డౌన్ అంటే ఏమిటన్న విషయానికి వస్తే… ట్రూ అప్ అంటే చార్జీల పెరుగుదల కదా. అలాగే ట్రూ డౌన్ అంటే విద్యుత్ చార్జీల తగ్గుదల అన్నమాట. గతంలో మనం వినియోగించిన విద్యుత్ కు అప్పుడే బిల్లులు కట్టి ఉంటాం కదా. నాడు మనం కట్టిన బిల్లులు ఎక్కువని బావించిన కూటమి సర్కారు… ఆ బిల్లులను తగ్గిస్తూ ట్రూ డౌన్ ను అమలు చేస్తోంది. అంటే… అప్పుడు మనం కట్టిన అధిక బిల్లులను ఇప్పుడు మనం వాడిన విద్యుత్ బిల్లులో నుంచి తక్గిస్తారన్న మాట. ప్రస్తుతం యూనిట్ కు రూ.13 పైసల చొప్పున ట్రూ డౌన్ చార్జీలను అమలు చేస్తున్నట్లు ఏపీ ఇందన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు.

ట్రూ అప్ పేరిట ప్రజల నుంచి ఎప్పుడో వాడిన విద్యుత్ కు ఆ తర్వాత అధిక బిల్లులంటూ వసూలు చేసిన చరిత్ర వైసీపీది అయితే… ప్రజలు ఎప్పుడో వాడిన విద్యుత్ కు అదిక బిల్లులు చెల్లించారని భావించి ఇప్పుడు బిల్లులు తగ్గిస్తున్న చరిత్ర కూటమిదని గొట్టిపాటి చెబుతున్నారు. అంతేకాకుండా కూటమి రెండేళ్ల పాలనలో ఒక్కసారి కూడా విద్యుత్ బిల్లులు పెరగలేదన్న విషయాన్ని ప్రస్తావించిన మంత్రి…రానున్న మూడేళ్లలోనూ విద్యుత్ చార్జీలను పెంచబోమంటూ శుక్రవారం సంచలన ప్రకటన చేశారు.

ఒక్క విద్యుత్ బిల్లుల్లోనే ఈ మేర మార్పులను తీసుకువచ్చిన కూటమి… సంక్షేమ పాలన అందించిందని చెప్పక తప్పదు కదా అని కూడా గొట్టిపాటి లాజిక్ తీశారు. కూటమి పాలనకు రెండేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ఓ వైపు వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ వైసీపీ ఆందోళనలకు దిగిన శుక్రవారమే మంత్రి గొట్టిపాటి.. ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ అంటూ వివరాలు వెల్లడించి విపక్షానికి షాక్ ఇచ్చారని చెప్పాలి. ఐదేళ్లలో రేట్టు 9 సార్లు పెరిగితే… గడచిన రెండేళ్లలో చార్జీలను పెంచకపోవడంతో పాటుగా ఎప్పుడో వాడిన విద్యుత్ కు అధిక చార్జీలు వసూలు చేశారంటూ వినియోగదారులకు ట్రూ డౌన్ పేరిట చార్జీలను తగ్గించడం నిజంగానే కూటమి సంక్షేమ పాలనకు నిదర్శనమని చెప్పక తప్పదు.

This post was last modified on June 12, 2026 11:37 am

Share

Recent Posts

భీమవరం బ్యాగ్రౌండ్ ఉన్నా వాడుకోలేదా రవితేజ…

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి చాలా కష్టపడి పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు మాస్…

1 hour ago

అనుపమకు నరకం చూపించిన అపరిచితుడు

తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న మ‌ల‌యాళ భామ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప‌దేళ్ల కెరీర్లో పెద్ద‌గా ఎఫైర్ వార్త‌లేమీ వ‌చ్చింది లేదు.…

2 hours ago

షూట్ లేకున్నా ప్రభాస్ ఫౌజి సెట్లోనే

ప్ర‌భాస్ సినిమా అంటే చాలు.. హైప్‌కు ఏమీ లోటు ఉండ‌దు. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డేకొద్దీ అభిమానుల‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కుల్లోనూ…

2 hours ago

జెన్ జీ ఎఫెక్ట్… కేటీఆర్ ను సీఎం చెయ్యాలంటున్న కేసీఆర్?

ఇదేమీ ఊహాజ‌నిత వార్త‌కాదు. కొంద‌రు పుట్టించిన గ్యాసిప్ కూడా కాదు!. అక్షరాలా.. తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీలో గ‌త…

3 hours ago

అయ్య‌న్న‌ అలా.. జ‌గ‌న్ ఇలా… ఇద్ద‌రి ఆశ‌లూ తీరేనా?

ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు.. ఎప్ప‌టి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్ప‌డ‌మే కాదు.. అంత‌ర్జాతీయ వేదికల‌పైనా ఆయ‌న త‌న వాణిని…

5 hours ago

‘ఇరుముడి’ సరుకులు… అన్నీ సరిపోయాయి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ఆగస్ట్ 21 విడుదల కానుంది. వరస ఫ్లాపుల నుంచి బయటపడేసే సినిమాగా అభిమానులు దీని…

6 hours ago