ట్రూ అప్ అంటే తెలుసు కదా. విద్యుత్ వినియోగంలో వినియోగదారులపై ఆయా ప్రభుత్వాలు ఎప్పుడో వాడిన విద్యుత్ కు… చాలా కాలం తర్వాత వసూలు చేసే అధిక చార్జీలు. ట్రూ అప్ అమలు చేస్తున్నారంటే… మనం గతంలో వాడిన విద్యుత్ పై పెంచిన బిల్లులను ప్రస్తుత వినియోగంతో కలిపి కట్టడమన్నమాట. ఏపీలో వైసీపీ హయాంలో ఐదేళ్ల వ్యవధిలోనే ఏకంగా 9 సార్లు ట్రూ అప్ చార్జీలను వసూలు చేశారు. మరి కూటమి రెండేళ్ల పాలనలో ఇది అమలు అయ్యిందా? అంటే… లేదనే చెప్పాలి. ట్రూ అప్ మాటెత్తని కూటమి.. ఏకంగా ట్రూ డౌన్ వరాలను ప్రజలకు అందించింది.
అయినా ట్రూ డౌన్ అంటే ఏమిటన్న విషయానికి వస్తే… ట్రూ అప్ అంటే చార్జీల పెరుగుదల కదా. అలాగే ట్రూ డౌన్ అంటే విద్యుత్ చార్జీల తగ్గుదల అన్నమాట. గతంలో మనం వినియోగించిన విద్యుత్ కు అప్పుడే బిల్లులు కట్టి ఉంటాం కదా. నాడు మనం కట్టిన బిల్లులు ఎక్కువని బావించిన కూటమి సర్కారు… ఆ బిల్లులను తగ్గిస్తూ ట్రూ డౌన్ ను అమలు చేస్తోంది. అంటే… అప్పుడు మనం కట్టిన అధిక బిల్లులను ఇప్పుడు మనం వాడిన విద్యుత్ బిల్లులో నుంచి తక్గిస్తారన్న మాట. ప్రస్తుతం యూనిట్ కు రూ.13 పైసల చొప్పున ట్రూ డౌన్ చార్జీలను అమలు చేస్తున్నట్లు ఏపీ ఇందన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు.
ట్రూ అప్ పేరిట ప్రజల నుంచి ఎప్పుడో వాడిన విద్యుత్ కు ఆ తర్వాత అధిక బిల్లులంటూ వసూలు చేసిన చరిత్ర వైసీపీది అయితే… ప్రజలు ఎప్పుడో వాడిన విద్యుత్ కు అదిక బిల్లులు చెల్లించారని భావించి ఇప్పుడు బిల్లులు తగ్గిస్తున్న చరిత్ర కూటమిదని గొట్టిపాటి చెబుతున్నారు. అంతేకాకుండా కూటమి రెండేళ్ల పాలనలో ఒక్కసారి కూడా విద్యుత్ బిల్లులు పెరగలేదన్న విషయాన్ని ప్రస్తావించిన మంత్రి…రానున్న మూడేళ్లలోనూ విద్యుత్ చార్జీలను పెంచబోమంటూ శుక్రవారం సంచలన ప్రకటన చేశారు.
ఒక్క విద్యుత్ బిల్లుల్లోనే ఈ మేర మార్పులను తీసుకువచ్చిన కూటమి… సంక్షేమ పాలన అందించిందని చెప్పక తప్పదు కదా అని కూడా గొట్టిపాటి లాజిక్ తీశారు. కూటమి పాలనకు రెండేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ఓ వైపు వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ వైసీపీ ఆందోళనలకు దిగిన శుక్రవారమే మంత్రి గొట్టిపాటి.. ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ అంటూ వివరాలు వెల్లడించి విపక్షానికి షాక్ ఇచ్చారని చెప్పాలి. ఐదేళ్లలో రేట్టు 9 సార్లు పెరిగితే… గడచిన రెండేళ్లలో చార్జీలను పెంచకపోవడంతో పాటుగా ఎప్పుడో వాడిన విద్యుత్ కు అధిక చార్జీలు వసూలు చేశారంటూ వినియోగదారులకు ట్రూ డౌన్ పేరిట చార్జీలను తగ్గించడం నిజంగానే కూటమి సంక్షేమ పాలనకు నిదర్శనమని చెప్పక తప్పదు.
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని… చాలా రోజుల తర్వాత తన సొంతూరు…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్నారని చెప్పాలి. ఇదివరకే…
తమిళంలోనే కాదు తెలుగులోనూ ఐకానిక్ మూవీగా నిలిచిపోయిన క్లాసిక్ బాషా. అండర్ డాగ్ ఫార్ములాని హీరోయిజంతో మిక్స్ చేసి ప్రేక్షకులకు…
తమిళనాడు రాజకీయాల్లో సినీ స్టార్ల హవా ఓ రేంజిలో కొనసాగుతోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాదించిన స్టార్…
అనంతపురం జిల్లా తాడిపత్రిలో శుక్రవారం పొలిటికల్ హీట్ రాజుకుంది. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా టీడీపీ శ్రేణులు…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులను థియేటర్ కు రాకుండా అడ్డుపడుతున్న వాటిలో ఓటిటి, ఇంటర్ నెట్ కన్నా ముందు చెప్పుకోవాల్సిన పాయింటు…