Political News

జగన్ వాయిస్ లో బేస్ తగ్గింది

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక బహిరంగ సభల్లో అయితే ఆయన వాయిస్ నిజంగానే సింహనాదంలా వినిపిస్తుంది. తన రాజకీయ ప్రత్యర్థులను తూలనాడే సమయంలో జగన్ వాయిస్ ఓ రేంజిలో పేలుతుంది. ఇవే మనమంతా ఇప్పటిదాకా జగన్ లో చూసిన ప్రత్యేక అంశాలు. అదేంటో గానీ… బుధవారం విశాఖ పర్యటనలో జగన్ లో ఆ ఫైర్ అంతగా కనిపించలేదని చెప్పాలి. జగన్ గొంతు జీరబోయింది. వాయిస్ లో బేస్ కనిపించలేదు. వెరసి జగన్ స్పీచ్ అంతగా ఆకట్టుకోలేదనే చెప్పక తప్పదు.

విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంబింవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోగా… బాదిత కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ బుధవారం విశాఖకు వెళ్లారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలను పరామర్శించిన జగన్.. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ వాయిస్ అంత గట్టిగా కనిపించలేదు. ఒకానొక సమయంలో ఆయన నోట నుంచి పదాలు చాలా లో వాయిస్ లో వినిపించాయి.

వైసీపీ హయంలో ఎల్జీ పాలిమర్స్ నుంచి విష వాయువులు వెలువడి 14 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏమిచ్చిందన్న విషయాన్ని ప్రస్తావించిన సందర్భంగా జగన్ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఎల్జీ పాలిమర్స్ అన్న పేరే గుర్తుకు రానట్టుంది. దీంతో తన వెనుకే ఉన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను అడిగి మరీ ఆ కంపెనీ పేరును గుర్తు చేసిన జగన్… నాడు చనిపోయిన వారి కుటుంబాలకు తాము రూ.1 కోటి పరిహారాన్ని ఇచ్చామని గుర్తు చేశారు.

జగన్ ఎల్జీ పాలిమర్స్ పేరు ప్రస్తావిస్తున్నప్పుడే ఆయన గొంతు జీరబోయింది. ఉన్నట్లుండి జగన్ వాయిస్ జీరో బేస్ చేరడంతో అక్కడున్న వారంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడం కనిపించింది. అయితే వాయిస్ బేస్ లెస్ గా మారినా కూడా జగన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అయితే కాసేపటికి ఆయన గొంతు కాస్తంత గట్టిగా వినిపించినా…మరింత సేపు మాట్లాడేందుకు ఇబ్బంది పడ్డ జగన్… తన ప్రసంగాన్ని అనుకున్న సమయానికంటే ముందుగానే ముగించారు.

Kumar

Recent Posts

ఈసారి పాదయాత్ర ఈజీ కాదేమో జగన్

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క‌.. ఇక నుంచి మరో లెక్క‌.. అన్న‌ట్టుగా వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ప‌రిస్థితి…

38 minutes ago

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

1 hour ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

6 hours ago

కేంద్ర మంత్రుల ‘కార్ పూలింగ్’ షురూ!

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇందన పొదుపు దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశాక… మన…

7 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

8 hours ago

ఆమెకు జీతం రూ.1.4 లక్షలు… భరణం రూ.1.35

ఒక విడాకుల కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై…

9 hours ago