Political News

మాజీ మంత్రుల సెల్ఫ్ గోల్‌.. వైసీపీకి ఇర‌కాటం.. !

నెల్లూరు జిల్లా వైసీపీలో మాజీ మంత్రుల సెల్ఫ్ గోల్ రాజకీయాలు పార్టీని, వారి కార్యకర్తలను తీవ్ర స్థాయిలో ఇబ్బందికి గురిచేస్తున్నాయి. గతంలో జ‌గ‌న్ హ‌యాంలో ఈ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు పనిచేశారు. అయితే గత ఎన్నికల్లో ఇద్దరు ఓడిపోయారు. తాజాగా జిల్లా రాజకీయాలను గమనిస్తే ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలన్న విధంగా వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఒకరు జిల్లా మొత్తం తన క‌నుస‌న్న‌ల్లోనే ఉందని చెప్పుకోగా మరొకరు రెడ్డి సామాజిక వర్గం అంతా తాను చెప్పినట్టే నడుస్తుందని బాహాటంగానే వ్యాఖ్యలు చేశారు.

అయితే.. వీరిలో ఒకరు సైలెంట్ అయిపోగా మరొకరు అప్పుడప్పుడు మీడియా ముందుకు రావడం ప్రభుత్వం మీద విమర్శలు చేయడం కనిపిస్తోంది. తాజాగా డీఎస్సీ విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ వైసిపి నాయకులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నెల్లూరు జిల్లాలో ఈ ఇద్దరు మాజీ మంత్రులు ఈ కార్యక్రమాన్ని తామే విజయవంతం చేశామని చెప్పుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని వైసిపి పిలుపు ఇచ్చింది.

అయినప్పటికీ కొంతమంది నాయకులు మాత్రమే పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రులు ఇద్దరు ఈ కార్యక్రమాలు నిర్వహించారు. కానీ, ఇద్దరూ తమవల్లే జిల్లాల్లో వైసిపి నిరసన విజయవంతం అయిందని చెప్పుకోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. వాస్తవానికి అందరూ కలిసి ఉమ్మడిగా నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేశామని చెప్పుకుంటే ఒక రకంగా ఉండేది. కానీ, దీనికి భిన్నంగా తమ వల్లే ఈ కార్యక్రమం సక్సెస్ అయిందని ఒకరికొకరు సెల్ఫ్ గోల్ చేసుకోవటం గమ‌నార్హం.

అంతేకాదు.. తమ వల్లే పార్టీ నిలబడుతుందని చెప్పుకోవడం వంటివి ఆసక్తిగాను, ఆశ్చర్యంగాను కూడా ఉంది. మరి ఇది పార్టీ కార్యకర్తల్లో వివాదాలకు, విభేదాలకు కూడా దారి తీసే పరిణామంగా చెబుతున్నారు. ఇట్లాంటి విషయాల్లో నాయకులు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. మాజీ మంత్రులుగానే కాకుండా బాధ్యతాయుతమైన సామాజిక వర్గాలకు చెందిన నాయకులుగా వ్యవహరించాలి. అంతేతప్ప చిన్న పాటి కార్యక్రమాలకే సెల్ఫ్ గోల్ రాజకీయాలు చేసుకుంటే భవిష్యత్తులో కార్యకర్తలు దూరం అయ్యే ప్రమాదం ఉంటుందన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.

This post was last modified on June 10, 2026 11:31 am

Share

Recent Posts

జనసేన ఎమ్మెల్యేపై చంద్రబాబు అసంతృప్తి

కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…

53 minutes ago

ఏపీలో పెరిగిపోతున్న బీపీ… ఆ జిల్లాలో మరీ ఎక్కువ!

ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…

2 hours ago

సినిమా షూటింగ్… ఐదుసార్లు చావుకు దగ్గరగా

సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…

7 hours ago

తెలంగాణా కాంగ్రెస్లో టిక్.. టిక్.. టిక్

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…

10 hours ago

రంభ ఊర్వశి సరే… మరి అప్పట్లో ఎలా

సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…

10 hours ago

అభిమానుల విన్నపం నాగ్ పట్టించుకోలేదా

వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…

10 hours ago