Political News

గులాబీ బాస్ బిగ్ స్కెచ్

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని క్షేత్రస్థాయి నుంచి పునర్నిర్మించాలని భావిస్తున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఈసారి ఊహించని వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. కేవలం కమిటీల మార్పుతోనే సరిపెట్టకుండా, పార్టీ అగ్ర నాయకత్వంలోనే ఒక భారీ మార్పుకు గులాబీ బాస్ శ్రీకారం చుట్టబోతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. ప్రస్తుతం కేటీఆర్ మాత్రమే నిర్వహిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాను, ఇప్పుడు మరో కీలక నేతకు కూడా కట్టబెట్టే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం.

సాధారణంగా బీఆర్‌ఎస్‌లో నిర్ణయాలన్నీ కేసీఆర్, కేటీఆర్ చుట్టూనే తిరుగుతుంటాయి. దీనివల్ల ప్రతిపక్షాల నుంచి వచ్చే కుటుంబ పార్టీ అనే విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో పాటు, రాష్ట్రంలో మారుతున్న సామాజిక సమీకరణాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే కేటీఆర్‌కు సమాంతరంగా, ఆయనతో సమానమైన అధికారాలు ఉండేలా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించబోతున్నట్లు తెలుస్తోంది. రాబోయే సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరిగే సమయంలోనే ఈ కొత్త నియామకంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఈ కొత్త పవర్‌ సెంటర్‌ను ఒక బలమైన బీసీ సామాజికవర్గ నేతతో భర్తీ చేయాలనేది గులాబీ అధిష్టానం అసలు ప్లాన్. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ ఓటు బ్యాంక్ చుట్టూనే రాజకీయం నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీసీల విషయంలో ఒత్తిడి పెంచడంతో పాటు, తాము వెనుకబడిన వర్గాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నామని నిరూపించుకోవడానికి కేసీఆర్ ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. కేటీఆర్ లాంటి హైప్రొఫైల్ నేత పక్కన ఒక బీసీ లీడర్‌ను కూర్చోబెట్టడం ద్వారా అటు సామాజిక సమీకరణాలు, ఇటు రాజకీయ అవసరాలు రెండింటినీ ఒకే దెబ్బకు సాధించవచ్చనేది బీఆర్‌ఎస్ అంతర్గత వ్యూహం.

త్వరలోనే హైదరాబాద్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో పట్టున్న నేతకే ఈ లక్కీ ఛాన్స్ దక్కుతుందనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం రేస్‌లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గ్రేటర్ సమన్వయకర్తగా ఎన్నికల బాధ్యతలను భుజాన వేసుకున్న ఆయనకు ఈ పదవి ఇస్తే మైలేజ్ వస్తుందని ఒక వర్గం భావిస్తోంది.

ఆయనతో పాటు ఉత్తర తెలంగాణ నుంచి గంగుల కమలాకర్, ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి శ్రీనివాస్ గౌడ్, అలాగే సీనియర్ నేతలు మధుసూదనా చారి, దాసోజు శ్రవణ్ పేర్లు కూడా అధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు టాక్. మరి ఈ సంచలన పదవిని దక్కించుకుని, గులాబీ పార్టీలో సెకండ్ పవర్ సెంటర్‌గా నిలిచే ఆ లక్కీ లీడర్ ఎవరో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే!

Kumar

Recent Posts

తెలుగు కుర్రాడికి రజినీ సినిమాలో ఛాన్స్

తెలుగు సినిమాలకు ఎక్కడెక్కడి నుంచో ఆర్టిస్టులు, టెక్నీషియన్లను తీసుకురావడం మామూలే. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ల విషయంలో ఎక్కువగా వేరే ఇండస్ట్రీల మీద…

7 hours ago

ఓజీ-2: పవన్ మారాలి… సుజీతూ మారాలి

అవసరమున్నా లేకపోయినా.. సీక్వెల్స్‌కు లీడ్ ఇవ్వడం అన్నది ఈ రోజుల్లో మామూలైపోయింది. అలా హింట్ ఇచ్చిన సినిమాల్లో సెకండ్ పార్ట్…

8 hours ago

రెహమాన్ కంబ్యాక్ జరిగిందా లేదా

పెద్ది థియేటర్ రన్ ముగింపు దిశగా వెళ్తోంది. ఈ వీకెండ్ కాస్త పికపయ్యే అవకాశాలున్నాయి. పాత రీ రిలీజులు తప్ప…

10 hours ago

నా చేతులు నా ఇష్టం అంటే చేతులు విరుగుతాయి

ఇటీవలే సింగర్ సునీత మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్త్రీలు 'నా శరీరం నా ఇష్టం' అన్నప్పుడు అవతలి…

10 hours ago

ఆప‌రేష‌న్ సిందూర్‌లో ఆరుగురు వీర‌మ‌ర‌ణం

గ‌త ఏడాది మేలో జ‌రిగిన ఆప‌రేష‌న్ సిందూర్‌లో ఆరుగురు సైనికులు వీర‌మ‌ర‌ణం చెందిన‌ట్టు కేంద్రం తాజాగా వెల్ల‌డించింది. దాదాపు 13…

10 hours ago

వారణాసి మాట మార్చే ఛాన్స్ లేనట్టే

రాజమౌళి సినిమాలకు ఎప్పుడూ వచ్చే సమస్య ఒకటుంది. అదే చెప్పిన రిలీజ్ డేట్ కి కట్టుబడకపోవడం. బాహుబలి రెండు భాగాలు,…

11 hours ago