ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామతీర్థంలోని చారిత్రక రామాలయంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసం ఘటన పెను ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. రామతీర్థం ఘటన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో ప్రభుత్వం, పోలీసుల తీరు వివాదాస్పమైంది. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్కల్యాణ్ విమర్శలు గుప్పించారు.
ధర్మం విచ్ఛిన్నానికే శ్రీరామచంద్ర మూర్తి విగ్రహాలను దుండగులు ధ్వంసం చేస్తున్నా జగన్ సర్కార్ నిమ్మకు నీరెత్తిన విధంగా వ్వవహరించడంపై మండిపడ్డారు. పాకిస్థాన్లో ఆలయాన్ని ధ్వంసం చేసిన నిందితులను అరెస్ట్ చేశారని, ఆ ఆలయాన్ని పునర్నిర్మించే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని చెప్పారు. జగన్ రెడ్డి ప్రభుత్వం ఆపాటి చర్యలు కూడా తీసుకోలేదా? అని పవన్ ప్రశ్నించారు. ఆలయ ఆస్తుల ధ్వంసానికి జగన్ సర్కార్ బాధ్యత వహించాలని పవన్ డిమాండ్ చేశారు.
జగన్ పాలనలో రాష్ట్రంలో హిందూ విశ్వాసాలకు విఘాతం కలిగించే కుట్ర జరుగుతున్నా ప్రభుత్వం కిమ్మనకుండా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోందని పవన్ ఆరోపించారు. కనుకనే మతోన్మాదులు మరింతగా తెగబడుతున్నారని చెప్పారు.
హిందూ ఆలయాలపై వరుస ఘటనలను ప్రతి ఒక్కరం ఖండించాలని పవన్ పిలుపునిచ్చారు. శక్తిపీఠం ఉన్న పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం ఘటన నుంచి తాజాగా రామతీర్థం, రాజమహేంద్రవరం వ్యవహారం వరకు ప్రభుత్వ స్పందన ఉదాసీనంగా ఉందని పవన్ మండిపడ్డారు. దేవుడిపై భారం వేసిన ప్రభుత్వ నిర్లిప్త ధోరణి ఈ దుర్మార్గపు చర్యలకు పాల్పడేవారిని మరింత ప్రోత్సహించేలా ఉందన్నారు.
హిందూ ధర్మంపై, దేవాలయా లపై సాగుతున్న దాడులను కట్టడి చేయాలంటే నిందితులను తక్షణమే అదుపులోకి తీసుకొని కఠిన వైఖరి అవలంబించాలని పవన్ డిమాండ్ చేశారు. ఈ ఘటనలకు రాజకీయ రంగు పులిమి పక్కదోవ పట్టించకుండా చిత్తశుద్ధితో వ్యవహరించాలని ప్రభుత్వానికి సూచించారు.
This post was last modified on January 2, 2021 10:59 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…