Political News

ఆలయ ఆస్తుల ధ్వంసానికి జగన్ బాధ్యత వహించాలి: పవన్

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామతీర్థంలోని చారిత్రక రామాలయంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసం ఘటన పెను ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. రామతీర్థం ఘటన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో ప్రభుత్వం, పోలీసుల తీరు వివాదాస్పమైంది. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ విమర్శలు గుప్పించారు.

ధర్మం విచ్ఛిన్నానికే శ్రీరామచంద్ర మూర్తి విగ్రహాలను దుండగులు ధ్వంసం చేస్తున్నా జగన్ సర్కార్ నిమ్మకు నీరెత్తిన విధంగా వ్వవహరించడంపై మండిపడ్డారు. పాకిస్థాన్‌లో ఆలయాన్ని ధ్వంసం చేసిన నిందితులను అరెస్ట్ చేశారని, ఆ ఆలయాన్ని పునర్నిర్మించే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని చెప్పారు. జగన్ రెడ్డి ప్రభుత్వం ఆపాటి చర్యలు కూడా తీసుకోలేదా? అని పవన్ ప్రశ్నించారు. ఆలయ ఆస్తుల ధ్వంసానికి జగన్ సర్కార్ బాధ్యత వహించాలని పవన్ డిమాండ్ చేశారు.

జగన్ పాలనలో రాష్ట్రంలో హిందూ విశ్వాసాలకు విఘాతం కలిగించే కుట్ర జరుగుతున్నా ప్రభుత్వం కిమ్మనకుండా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోందని పవన్ ఆరోపించారు. కనుకనే మతోన్మాదులు మరింతగా తెగబడుతున్నారని చెప్పారు.

హిందూ ఆలయాలపై వరుస ఘటనలను ప్రతి ఒక్కరం ఖండించాలని పవన్ పిలుపునిచ్చారు. శక్తిపీఠం ఉన్న పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం ఘటన నుంచి తాజాగా రామతీర్థం, రాజమహేంద్రవరం వ్యవహారం వరకు ప్రభుత్వ స్పందన ఉదాసీనంగా ఉందని పవన్ మండిపడ్డారు. దేవుడిపై భారం వేసిన ప్రభుత్వ నిర్లిప్త ధోరణి ఈ దుర్మార్గపు చర్యలకు పాల్పడేవారిని మరింత ప్రోత్సహించేలా ఉందన్నారు.

హిందూ ధర్మంపై, దేవాలయా లపై సాగుతున్న దాడులను కట్టడి చేయాలంటే నిందితులను తక్షణమే అదుపులోకి తీసుకొని కఠిన వైఖరి అవలంబించాలని పవన్ డిమాండ్ చేశారు. ఈ ఘటనలకు రాజకీయ రంగు పులిమి పక్కదోవ పట్టించకుండా చిత్తశుద్ధితో వ్యవహరించాలని ప్రభుత్వానికి సూచించారు.

Satya

Recent Posts

పెద్దికి రెచ్చిపోయి ఇప్పుడు దొరికిపోయారు

సినిమా ఇండస్ట్రీలో నార్త్ వర్సెస్ సౌత్ గొడవ ఎప్పటినుంచో నడుస్తున్నదే. ముఖ్యంగా బాలీవుడ్ మీడియా, అక్కడి జనాలు సౌత్ సినిమాలపై…

50 minutes ago

నీట్ పరీక్ష రాయాలంటే అబుదాబీకి వెళ్లాలా?

నీట్ పరీక్ష పెద్ద ప్రహసనంగా మారింది. పరీక్ష నిర్వహణలో రోజుకో వివాదం తలెత్తుతోంది. రీ నీట్ పరీక్షకు సంబంధించి హాల్…

1 hour ago

బండి భగీరథ్ కు బెయిల్

పోక్సో కేసులో అరెస్టైన బండి భగరీథ్‌కు మల్కాజిగిరి కోర్టు తాత్కాలిక బెయిల్‌ మంజూరు చేసింది. భగీరథ్‌ను పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు…

2 hours ago

ఎవరయ్యా ఈ సమంత ఫ్రెండు…

నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మా ఇంటి బంగారం ట్రేడ్ పండిట్ల అంచనాలను మించి బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ఈ…

3 hours ago

స్వయంకృతాపరాధం చెయ్యొద్దు స్వయంభు

కొత్త ఏడాదిలో ఆరు నెలలు గడిచిపోయాయి. జూన్ లో ఇంకొక్క పది రోజులు మాత్రమే మిగిలున్నాయి. 2027 సంక్రాంతికి ఏమేం…

3 hours ago

ప్యారడైజ్ విలన్ గురించి ఏమంటున్నారు

నిన్న ది ప్యారడైజ్ నుంచి రాఘవ్ జుయెల్ పోషించిన విక్రమ్ మాలిక్ ఫస్ట్ లుక్ ని టీజర్ రూపంలో టీమ్…

4 hours ago