వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడుపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన వైనం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివారు గండిపేటలో రూ.1500
కోట్లకుపైగా విలువైన ప్రభుత్వ భూములు కాజేసేందుకు బ్రహ్మనాయుడు నకిలీ జీవోలు సృష్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, ఆ భూమిని కొట్టేసేందుకు కొందరు ప్రభుత్వ అధికారుల సంతకాలను కూడా బ్రహ్మనాయుడు ఫోర్జరీ చేశారని ఆరోపణలు రావడం షాకింగ్ గా మారింది.
ఈ క్రమంలోనే బొల్లా బ్రహ్మనాయుడును అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అయితే, కోర్టులో ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురి కావడంతో బ్రహ్మనాయుడు పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు ఈరోజు బ్రహ్మనాయుడును తమిళనాడులో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని కాంచీపురంలో ఆయన ఉన్నట్లు సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు అక్కడకు వెళ్లి అరెస్టు చేశారు.
హీరోలు నిర్మాతలు కావడం కొత్తేమి కాదు. చిరంజీవి పీక్స్ లో ఉన్నప్పుడే అంజనా ప్రొడక్షన్స్ స్థాపించారు. కార్డు నాగబాబు పేరు…
వైసీపీ అధినేత జగన్పై ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో…
అనుకున్నంతా అయ్యింది. గత కొంతకాలంగా బీజేపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై తాజాగా ఆ…
ఎవరో జ్వాలలు రగిలించారు వేరెవరో దానికి బలి అయ్యారు అనే పాట ఊరికే పుట్టలేదు. గత నెల విడుదలై తమిళంలో…
రాష్ట్రంలో ఎదగాలని, వచ్చే ఎన్నికల నాటికి పుంజుకోవాలని భావిస్తున్న జనసేన ఏపీలో పెద్ద వ్యూహాన్నే అనుసరిస్తోంది. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా…
తొలి రోజు పూర్తి చేసుకున్న పెద్ది మొత్తం ప్రీమియర్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా 135 కోట్ల గ్రాస్ దాటేసి బలమైన సెకండ్…