వినుకొండ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడుపై భూకబ్జా ఆరోపణలు వచ్చిన వైనం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివారు గండిపేటలో రూ.1500
కోట్లకుపైగా విలువైన ప్రభుత్వ భూములు కాజేసేందుకు బ్రహ్మనాయుడు నకిలీ జీవోలు సృష్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, ఆ భూమిని కొట్టేసేందుకు కొందరు ప్రభుత్వ అధికారుల సంతకాలను కూడా బ్రహ్మనాయుడు ఫోర్జరీ చేశారని ఆరోపణలు రావడం షాకింగ్ గా మారింది.
ఈ క్రమంలోనే బొల్లా బ్రహ్మనాయుడును అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అయితే, కోర్టులో ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురి కావడంతో బ్రహ్మనాయుడు పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు ఈరోజు బ్రహ్మనాయుడును తమిళనాడులో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని కాంచీపురంలో ఆయన ఉన్నట్లు సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు అక్కడకు వెళ్లి అరెస్టు చేశారు.
This post was last modified on June 5, 2026 3:13 pm
సంక్రాంతి, దసరా లాంటి పెద్ద పండుగలను పక్కన పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజవుతున్నపుడు చిన్న సినిమాలు పోటీలో ఉండడం…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…
ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…
సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…