Political News

పార్ల‌మెంటు వారీగా జ‌న‌సేన వ్యూహం!

రాష్ట్రంలో ఎద‌గాల‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పుంజుకోవాల‌ని భావిస్తున్న జ‌న‌సేన ఏపీలో పెద్ద వ్యూహాన్నే అనుస‌రిస్తోంది. పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా పార్టీని బ‌లోపేతం చేసేందుకు క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తోంది. వాస్త‌వానికి ఏపీలో జ‌న‌సేన అధికారంలో ఉన్నా.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌క‌త్వ స‌హ‌కారం.. స‌మన్వ‌యం వంటివి కొర‌వ‌డ్డాయి. గెలిచిన అసెంబ్లీ స్థానాల్లోనూ నాయ‌కుల మ‌ధ్య క‌లివిడి లోపించింది.

ఈ నేప‌థ్యంలో త‌ర‌చుగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బ‌లోపేతం చేసేందుకు జ‌న‌సేనాని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా క‌మిటీల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. త‌ద్వారా పార్టీని క్షేత్ర‌స్థాయిలో పుంజుకునేలా చేయాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌య‌త్నిస్తున్నారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 25 పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి.

ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గానికి 28 మంది స‌భ్యుల‌తో కూడిన క‌మిటీల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. అంటే.. 25 నియోజ‌క‌వ‌ర్గాల్లో 700 మంది స‌భ్యులు పార్టీకి అందుబాటులోకి వ‌స్తారు. ఈ క‌మిటీల‌కు.. జ‌న‌సేన నిర్మాణ స‌మాచార సేక‌ర‌ణ క‌మిటీలుగా పేరు పెట్టారు. వీటిలో ఒక పరిశీలకుడు, ముగ్గురు సీనియర్‌ నాయకులు, ప్రతి సంవత్సరం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో క్రమం తప్పకుండా పాల్గొన్న ముగ్గురు సాధకులతో మొత్తం ఏడుగురు ప్రధాన సభ్యులు ఉంటారన్నారు.

అదేస‌మ‌యంలో వీరిని స‌మ‌న్వ‌యం చేసేందుకు.. 21 మంది సాధ‌కులు ఉండ‌నున్నారు. వీరిలో కొంద‌రు మ‌హిళ‌ల‌కు కూడా అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. వీరు క్షేత్ర‌స్థాయిలో పార్టీ త‌ర‌ఫున ప్ర‌జ‌ల‌ను క‌లిసి పార్టీ సిద్ధాంతాల‌ను వివ‌రిస్తారు. అదేవిధంగా ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న జ‌న‌సేన చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌ను కూడా ప్ర‌జ‌ల‌కు చేర వేస్తారు. త‌ద్వారా ప్ర‌జ‌ల నుంచి అభిప్రాయాలు తీసుకుని పార్టీకి నివేదిక‌ల రూపంలో అందిస్తారు. దీనిని అనుస‌రించి.. పార్టీ మార్పులు, చేర్పుల దిశ‌గా అడ‌గులు వేయ‌నుంది. తద్వారా పార్టీ పుంజుకుంటుంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యూహం ర‌చించారు.

This post was last modified on June 5, 2026 2:48 pm

Share

Recent Posts

టీమిండియా కొత్త చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?

బీసీసీఐలో ఇప్పుడు కీలక మార్పులు జరగబోతున్నాయా? అవుననే అంటున్నాయి క్రీడా వర్గాలు. టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవికి…

2 minutes ago

పిఠాపురం ఇకపై పవన్ కంచు కోట

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న పవన్…

43 minutes ago

రక్తంతో రాసుకున్న ‘ప్యారడైజ్’ శాసనం

న్యాచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 విడుదలకు రెడీ…

2 hours ago

డీఎస్సీపైనే వైసీపీకి ఎందుకంత మంకుపట్టు?

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు, ఒక్క ఉపాధ్యాయ నియామకాన్ని…

2 hours ago

కొత్త మార్పుల వైపు చరణ్ & సుకుమార్ ?

ఇంకా ప్రారంభం కాలేదు కానీ క్యాస్టింగ్ ముందే ఫైనల్ చేసుకోవాలి కాబట్టి ఆర్సి 17కి సంబంధించిన పనుల్లో సుకుమార్ టీమ్…

3 hours ago

నాగార్జున 100 గురించి ఎప్పుడు చెబుతారు

అక్కినేని నాగార్జున వందో సినిమా హడవిడి లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది. మాములుగా ఏదో ఒక అప్డేట్ లీకుల రూపంలో కానీ…

4 hours ago