ఎవరో జ్వాలలు రగిలించారు వేరెవరో దానికి బలి అయ్యారు అనే పాట ఊరికే పుట్టలేదు. గత నెల విడుదలై తమిళంలో మూడు వందల కోట్ల వైపు పరుగులు పెడుతున్న కరుప్పు అలియాస్ వీరభద్రుడు ఇప్పుడో కొత్త నిప్పు రాజేశాడు. ఇటీవలే దర్శకుడు ఆర్జె బాలాజీ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ని కలుసుకున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మొదట కరుప్పు విజయ్ కే వెళ్లిందని, ఆయన చివరి మూవీ ఇదైతే బాగుంటుందనే ఉద్దేశంతో కథ చెప్పానని అన్నాడు.
ఇక్కడిదాకా బాగానే ఉంది ఎడిటర్ కలైవనన్ మరో సందర్భంలో మాట్లాడుతూ ఒకవేళ కరుప్పు విజయ్ కనక చేసి ఉంటే మరో స్థాయిలో ఉండేదని, బ్లాస్ట్ అయ్యేదన్న రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారు. ఇది కాస్తా సూర్య అభిమానులకు ఆగ్రహం కలిగించింది. కేవలం విజయ్ వద్దు అన్నందుకు వేరే ఆప్షన్ లేక సూర్యతో తీశారని, లేదంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేదని అర్థం వచ్చేలా పైన రెండు స్టేట్ మెంట్లు ఉండటంతో సోషల్ మీడియా వేదికగా ఇదో కాంట్రావర్సీకి దారి తీసింది.
ఇదంతా గమనించిన సూర్య నేరుగా కాకపోయినా ఇన్ డైరెక్ట్ గా ప్రేమతో ఉండండి అంటూ ఒక సాధారణ ట్వీట్ వేయడం ఇంకో చర్చకు దారి తీసింది. ఇది ఎక్కడికో వెళ్తుందని గుర్తించిన కలైవనన్ తన తప్పును సరిదిద్దుకుంటూ నేను అన్నది ఇంకో అర్థంలో వెళ్లిపోయిందని, మరోసారి ఇలా నోరు జారకుండా చూసుకుంటానని వివరణ ఇవ్వడం ఫైనల్ ట్విస్టు. ఆర్జె బాలాజీ సైతం సూర్య తనకు జీవితాన్ని ఇచ్చిన దేవుడిగా పలు సందర్భాల్లో వర్ణిస్తూ ఉంటారు.
అయినా సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయినప్పుడు హీరోని పొగుడుకోవాలే కానీ ఫలానా వాళ్ళు చేస్తే ఇంకా బాగుండేదని చెప్పడం ముమ్మాటికీ తప్పే. పైగా సూర్య కరుప్పుకి పూర్తి న్యాయం చేశాడు. క్లైమాక్స్ లో దేవుడిగా పూనకంతో చేసిన డాన్స్ అందరికీ నప్పేది కాదు. పైగా ఎంత విజయ్ అయినా ఆ స్థాయిలో చేయగలడా అంటే సమాధానం వెంటనే చెప్పలేం. తెలుగు రాష్ట్రాల్లో ముప్పై కోట్ల దాకా వసూలు చేసిన వీరభద్రుడు తాజాగా రిలీజైన పెద్ది వల్ల ఫైనల్ రన్ కు వచ్చేసింది.
This post was last modified on June 5, 2026 1:02 pm
బీసీసీఐలో ఇప్పుడు కీలక మార్పులు జరగబోతున్నాయా? అవుననే అంటున్నాయి క్రీడా వర్గాలు. టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవికి…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న పవన్…
న్యాచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 విడుదలకు రెడీ…
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు, ఒక్క ఉపాధ్యాయ నియామకాన్ని…
ఇంకా ప్రారంభం కాలేదు కానీ క్యాస్టింగ్ ముందే ఫైనల్ చేసుకోవాలి కాబట్టి ఆర్సి 17కి సంబంధించిన పనుల్లో సుకుమార్ టీమ్…
అక్కినేని నాగార్జున వందో సినిమా హడవిడి లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది. మాములుగా ఏదో ఒక అప్డేట్ లీకుల రూపంలో కానీ…