ఎవరో జ్వాలలు రగిలించారు వేరెవరో దానికి బలి అయ్యారు అనే పాట ఊరికే పుట్టలేదు. గత నెల విడుదలై తమిళంలో మూడు వందల కోట్ల వైపు పరుగులు పెడుతున్న కరుప్పు అలియాస్ వీరభద్రుడు ఇప్పుడో కొత్త నిప్పు రాజేశాడు. ఇటీవలే దర్శకుడు ఆర్జె బాలాజీ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ని కలుసుకున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మొదట కరుప్పు విజయ్ కే వెళ్లిందని, ఆయన చివరి మూవీ ఇదైతే బాగుంటుందనే ఉద్దేశంతో కథ చెప్పానని అన్నాడు.
ఇక్కడిదాకా బాగానే ఉంది ఎడిటర్ కలైవనన్ మరో సందర్భంలో మాట్లాడుతూ ఒకవేళ కరుప్పు విజయ్ కనక చేసి ఉంటే మరో స్థాయిలో ఉండేదని, బ్లాస్ట్ అయ్యేదన్న రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారు. ఇది కాస్తా సూర్య అభిమానులకు ఆగ్రహం కలిగించింది. కేవలం విజయ్ వద్దు అన్నందుకు వేరే ఆప్షన్ లేక సూర్యతో తీశారని, లేదంటే ఇంకా పెద్ద హిట్ అయ్యేదని అర్థం వచ్చేలా పైన రెండు స్టేట్ మెంట్లు ఉండటంతో సోషల్ మీడియా వేదికగా ఇదో కాంట్రావర్సీకి దారి తీసింది.
ఇదంతా గమనించిన సూర్య నేరుగా కాకపోయినా ఇన్ డైరెక్ట్ గా ప్రేమతో ఉండండి అంటూ ఒక సాధారణ ట్వీట్ వేయడం ఇంకో చర్చకు దారి తీసింది. ఇది ఎక్కడికో వెళ్తుందని గుర్తించిన కలైవనన్ తన తప్పును సరిదిద్దుకుంటూ నేను అన్నది ఇంకో అర్థంలో వెళ్లిపోయిందని, మరోసారి ఇలా నోరు జారకుండా చూసుకుంటానని వివరణ ఇవ్వడం ఫైనల్ ట్విస్టు. ఆర్జె బాలాజీ సైతం సూర్య తనకు జీవితాన్ని ఇచ్చిన దేవుడిగా పలు సందర్భాల్లో వర్ణిస్తూ ఉంటారు.
అయినా సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయినప్పుడు హీరోని పొగుడుకోవాలే కానీ ఫలానా వాళ్ళు చేస్తే ఇంకా బాగుండేదని చెప్పడం ముమ్మాటికీ తప్పే. పైగా సూర్య కరుప్పుకి పూర్తి న్యాయం చేశాడు. క్లైమాక్స్ లో దేవుడిగా పూనకంతో చేసిన డాన్స్ అందరికీ నప్పేది కాదు. పైగా ఎంత విజయ్ అయినా ఆ స్థాయిలో చేయగలడా అంటే సమాధానం వెంటనే చెప్పలేం. తెలుగు రాష్ట్రాల్లో ముప్పై కోట్ల దాకా వసూలు చేసిన వీరభద్రుడు తాజాగా రిలీజైన పెద్ది వల్ల ఫైనల్ రన్ కు వచ్చేసింది.
తొలి రోజు పూర్తి చేసుకున్న పెద్ది మొత్తం ప్రీమియర్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా 135 కోట్ల గ్రాస్ దాటేసి బలమైన సెకండ్…
అతిలోకసుందరిగా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న శ్రీదేవి అంటే ఎప్పటికీ చెక్కుచెదరని పేరు. అలాంటి గొప్ప నటికి…
తెలంగాణకు రావొచ్చు.. పోవచ్చు.. ఇక్కడ నివసించొచ్చు కానీ, మా రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెడితే ఊరు కునేది లేదంటూ.. పెద్ద…
గ్రాండ్ ఓల్ద్ పార్టీ కాంగ్రెస్ వైఎస్ షర్మిలకు ఝలక్ ఇచ్చింది. షర్మిలను రాజ్యసభకు పంపనున్నట్లు బలమైన వార్తలు వచ్చాక కూడా…
ఏపీలో సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉంది. గుజరాత్ సహా కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన తీర ప్రాంతం(బీచ్) ఏపీలో…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్..తన పార్టీని తెలంగాణలోనూ విస్తరించేందుకు రెడీ అయ్యారు. ఈ విషయాన్ని…