అనుకున్నంతా అయ్యింది. గత కొంతకాలంగా బీజేపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై తాజాగా ఆ పార్టీని వీడారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. బీజేపీని తాను వీడుతున్నట్లుగా అన్నామలై ప్రకటించారు. అంతేకాకుండా తమిళనాడు అసెంబ్లీకి జరగనున్న తదుపరి ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, ఆ ఎన్నికల్లో ఓ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీతో బరిలోకి దిగుతానని ఆయన ప్రకటించారు.
తమిళనాడులో బీజేపీ బలోపేతం దిశగా బీజేపీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన అన్నామలైకి ఆ బాధ్యతలు అప్పగించింది. బీజేపీ కోరినట్టుగానే తమిళనాట బీజేపీ బలోపేతానికి అన్నామలై తన శాయశక్తులా కృషి చేశారు. అయితే ఆ మధ్య ఏం జరిగిందో, ఏమో తెలియదు గానీ… అన్నామలై ఉన్నపళంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తాజాగా పార్టీని వీడే దిశగా ఆయన అడుగులు వేయగా… అధిష్ఠానం ఆయనను అనునయించే దిశగా సాగింది.
ఈ క్రమంలో ఇటీవలే ఢిల్లీ వెళ్లిన అన్నామలై… కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తోనూ భేటీ అయ్యారు. ఈ భేటీల్లో పార్టీని వీడొద్దంటూ వారిద్దరూ అన్నామలైని కోరారు. చర్చల్లో పెద్దగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయని అన్నామలై… తమిళనాడు తిరిగి రాగానే… తాను ముందుగానే అనుకున్నట్లుగా పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధిష్ఠానంతో తనకు విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని, ఆ విభేదాల కారణంగానే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.
సమాజంలో మార్పును తీసుకువచ్చేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని… అందుకోసమే తాను బీజేపీలో చేరానని అన్నామలై అన్నారు. అయితే బీజేపీలో ఉంటూ తాను అనుకున్న పనిని చేయలేనని తెలిసిందని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే తాను బీజేపీకి రాజీనామా చేశానన్న అన్నామలై.. ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తున్నానని పేర్కొన్నారు. మరి ఆ ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఎలా ఉంటుందన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.
ఇండియాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. యూపీ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ సిరీస్.. తొలి…
ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకునే కథానాయికలు చాలా కొద్ది మందే ఉంటారు. అందుకు వారి గ్లామర్, యాక్టింగ్ టాలెంట్తో…
తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు కనిపించడం అరుదు. కాస్త పేరున్న నిర్మాణ సంస్థల్లో తెరకెక్కే చిత్రాల్లో ఎక్కువగా పర భాషా…
నవీన్ పొలిశెట్టి నటించిన గత కొన్ని చిత్రాల్లో తన పేరు వెనుక ‘స్టార్ ఎంటర్టైనర్’ అనే ట్యాగ్ పడుతున్న సంగతి…
విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాయికృష్ణది లాకప్…
దక్షిణ భారత దేశంలో గురువారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి కనిపించారు. అంతేకాదండోయ్…తాము…