Political News

అన్నామలై బీజేపీని ఎందుకు వీడినట్టు?

అనుకున్నంతా అయ్యింది. గత కొంతకాలంగా బీజేపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై తాజాగా ఆ పార్టీని వీడారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. బీజేపీని తాను వీడుతున్నట్లుగా అన్నామలై ప్రకటించారు. అంతేకాకుండా తమిళనాడు అసెంబ్లీకి జరగనున్న తదుపరి ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, ఆ ఎన్నికల్లో ఓ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీతో బరిలోకి దిగుతానని ఆయన ప్రకటించారు.

తమిళనాడులో బీజేపీ బలోపేతం దిశగా బీజేపీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన అన్నామలైకి ఆ బాధ్యతలు అప్పగించింది. బీజేపీ కోరినట్టుగానే తమిళనాట బీజేపీ బలోపేతానికి అన్నామలై తన శాయశక్తులా కృషి చేశారు. అయితే ఆ మధ్య ఏం జరిగిందో, ఏమో తెలియదు గానీ… అన్నామలై ఉన్నపళంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తాజాగా పార్టీని వీడే దిశగా ఆయన అడుగులు వేయగా… అధిష్ఠానం ఆయనను అనునయించే దిశగా సాగింది.

ఈ క్రమంలో ఇటీవలే ఢిల్లీ వెళ్లిన అన్నామలై… కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తోనూ భేటీ అయ్యారు. ఈ భేటీల్లో పార్టీని వీడొద్దంటూ వారిద్దరూ అన్నామలైని కోరారు. చర్చల్లో పెద్దగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయని అన్నామలై… తమిళనాడు తిరిగి రాగానే… తాను ముందుగానే అనుకున్నట్లుగా పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధిష్ఠానంతో తనకు విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని, ఆ విభేదాల కారణంగానే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.

సమాజంలో మార్పును తీసుకువచ్చేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని… అందుకోసమే తాను బీజేపీలో చేరానని అన్నామలై అన్నారు. అయితే బీజేపీలో ఉంటూ తాను అనుకున్న పనిని చేయలేనని తెలిసిందని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే తాను బీజేపీకి రాజీనామా చేశానన్న అన్నామలై.. ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తున్నానని పేర్కొన్నారు. మరి ఆ ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఎలా ఉంటుందన్న దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.

This post was last modified on June 5, 2026 2:46 pm

Share

Recent Posts

దర్శన్ కేసులో కీలక మలుపు

కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…

16 minutes ago

ఆగస్ట్ 7… ఓటిటిలో కంటెంట్ వర్షం

థియేటర్లలో రేపు నాలుగైదు సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేకంగా ఓటిటిలో వచ్చే కొత్త కంటెంట్ కోసం ఎదురు…

48 minutes ago

టీమిండియా కొత్త చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?

బీసీసీఐలో ఇప్పుడు కీలక మార్పులు జరగబోతున్నాయా? అవుననే అంటున్నాయి క్రీడా వర్గాలు. టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవికి…

1 hour ago

పిఠాపురం ఇకపై పవన్ కంచు కోట

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న పవన్…

2 hours ago

రక్తంతో రాసుకున్న ‘ప్యారడైజ్’ శాసనం

న్యాచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 విడుదలకు రెడీ…

3 hours ago

డీఎస్సీపైనే వైసీపీకి ఎందుకంత మంకుపట్టు?

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు, ఒక్క ఉపాధ్యాయ నియామకాన్ని…

4 hours ago