వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, టీడీపీ నేతలు.. బూతు మంత్రిగా పిలుచుకునే గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని.. తన పొలిటికల్ వారసుడిని ప్రకటించారు. తన సోదరుడి కుమారుడు.. కొడాలి అర్జున రావును ఆయన తన వారసుడిగా పరిచయం చేశారు. తాజాగా వైసీపీ నేతలు నియోజకవర్గాల స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 16 నుంచి చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో గుడివాడలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాజీ మంత్రి, మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని.. కొడాలి రాజకీయ వారసుడిపై కీలక ప్రకటన చేశారు. కొడాలి అర్జున రావు.. నానీ స్థానంలో వైసీపీ తరఫున రాజకీయాలు చేస్తారని ప్రకటించారు. ఈ సందర్భంగా అర్జునరావును పార్టీ కేడర్ కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. అర్జున రావు.. ఉన్నత విద్యావంతుడని.. తన తమ్ముడి కుమారుడని పేర్కొన్నారు.
2034 ఎన్నికల్లో అర్జునరావు గుడివాడ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తారని కొడాలి నాని ప్రకటించారు. దీనిని బట్టి.. గుడివాడ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో మరోసారి కొడాలి నానీనే పోటీ చేయనున్నారన్నది సుస్పష్టం అయింది. వాస్తవానికి గత 2024 ఎన్నికల ప్రచారంలో నానీ సంచలన ప్రకటన చేశారు. తను.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని.. ఈసారికి గెలిపించాలని ఆయన కోరారు. అయితే.. గుడివాడ ప్రజలు ఆయన విన్నపాన్ని తోసిపుచ్చారు.
ఈ క్రమంలోనే టీడీపీ నాయకుడు, ఎన్నారైనేత వెనిగండ్ల రామును ప్రజలు గెలిపించారు. కాగా.. కొడాలి నానికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన సోదరుడి కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారు. వాస్తవానికి ఈ విషయాన్ని గత ఎన్నికల సమయంలోనే ప్రకటించారని అంటున్నా.. ఇప్పుడు నేరుగా అర్జున రావును స్థానిక ప్రజలకు పరిచయం చేశారు.
బేబీ సినిమాతో పెద్ద సంచలనమే రేపాడు దర్శక నిర్మాత సాయిరాజేష్. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణవి చైతన్య, ఆనంద్…
హైదరాబాద్ను డ్రగ్స్ మహమ్మారి వెంటాడుతోంది. ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు అనుక్షణం డ్రగ్స్ కట్టడికి ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఏదో ఒక…
ఏపీలో కూటమిగా ఏర్పడి.. అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ.. గత రెండేళ్ల కాలంలో ఎప్పుడూ.. పెదవి విప్పి.. కూటమి ప్రభుత్వం సాధించిన…
ఇప్పుడు వరల్డ్ నంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అంటే మరో మాట లేకుండా క్రిస్టోఫర్ నోలన్ పేరు చెప్పేస్తారు ఆడియన్స్.…
అనుకున్నట్టే ఫౌజీ విడుదల తేదీ డిసెంబర్ 3 లాకైపోయింది. ఇది రెండు వారాల క్రితమే లీకైన న్యూస్ అయినప్పటికీ ఫైనల్…
ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ కున్న క్రేజ్ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో లేదన్న మాటే కానీ పదిహేను సంవత్సరాల క్రితం ప్రసాద్ మల్టీప్లెక్స్…