పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా హైదరాబాద్లో పర్యటించిన సమయంలోనే వెల్లడించారు. నేరుగా ఆయన విదేశీ మారక ద్రవ్యంలోటు గురించి చెప్పకపోయినా.. అందరూ పొదుపు చేయాలని.. తద్వారా విదేశీ మారకద్రవ్యం పెరుగుతుందని అన్నారు.
ఈ క్రమంలోనే పెట్రోలు, డీజిల్ పొదుపుతోపాటు ఏడాది పాటు బంగారాన్ని కూడా కొనుగోలు చేయొద్దని ప్రధాని మోడీ ప్రజలకు సూచించారు. ఇక ఆ తర్వాత.. కేంద్రంతోపాటు రాష్ట్రాలు కూడా పొదుపు మంత్రం పాటిస్తున్నాయి. బంగారం కొనుగోళ్లు కూడా 70 శాతం మేరకు తగ్గాయని నివేదికలు చెబుతున్నాయి. అయితే.. ఇప్పుడు విదేశీ పత్రిక, పరిశోధనాత్మక జర్నలిజానికి పెట్టింది పేరైన బ్లూంబర్గ్ తాజాగా సంచలన విషయాన్ని వెల్లడించింది.
ప్రధాని మోడీ పొదుపు మంత్రం ప్రకటించే సరికే.. భారత దేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు అడుగంటాయని బ్లూంబర్గ్ తెలిపింది. అంతేకాదు.. విదేశీ మారకద్రవ్యం కోసం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తన వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించేసిందని.. బ్లూంబర్గ్ బాంబు పేల్చింది. కేవలం ఫారెక్స్ నిల్వలను కాపాడుకునేందుకే ఈ చర్చ చేశారని కూడా పేర్కొంది. అమెరికా డాలరుతో పోలిస్తే.. రూపాయి విలువ భారీగా పతనమవుతోందని.. అందుకే.. బంగారాన్ని విక్రయించారని తెలిపింది.
ఖండించిన భారత్..
అయితే.. బ్లూంబర్గ్ కథనాన్ని కేంద్రం సహా ఆర్బీఐలు ఖండించాయి. ఇది తప్పుడు కథనమని పేర్కొన్నాయి. బంగారం విక్రయంపై వచ్చిన వార్తలు పూర్తి అవాస్తవమని పేర్కొన్నాయి. ఆర్బీఐ వద్ద ఉన్న ఫారెక్స్ నిల్వల్లో బంగారం వాటా ఏటి కేడు పెరుగుతోందని తెలిపాయి. బ్లూంబర్గ్ కథనంలో వాస్తవం లేదని పేర్కొన్నాయి.
గతంలో చెప్పినవి నిజాలే..
అయితే.. గతంలో భారత్కు సంబంధించి బ్లూమ్బర్గ్ వెలువరించిన పలు కథనాలు వాస్తవమయ్యాయి. చైనా విషయంలో మోడీ వ్యవహరించిన తీరు.. పార్లమెంటులో తీవ్ర వివాదానికి దారి తీసింది. అలానే అదానీ పెట్టుబడుల కోసం.. ఎల్ ఐసీని విక్రయిస్తున్నారన్న కథనం కూడా దాదాపు నిజమైంది. దీంతో ఇప్పుడు బ్లూంబర్గ్ వెలువరించిన కథనం సంచలనంగా మారింది.
This post was last modified on June 3, 2026 10:33 pm
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…
టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…
‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…
అందం అభినయం రెండూ ఉన్న కియారా అద్వానీతో అదృష్టం దోబూచులాడుతోంది. ఒకదశలో కరీనా కపూర్ ఎంజాయ్ చేసిన స్టార్ డం…