అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తెలంగాణ అనే భావన, తమిళనాడులో ప్రాంతీయ భావన ఉంటుందని అన్నారు. కానీ, ఆంధ్రాలో ఆంధ్రా అన్న భావన ఉండదని, ఏ భావన ఉందో ఎవరికీ తెలీదని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రాలో కుల భావన ఉందని అన్నారు. జై అమరావతి అంటే ఒక ప్రాంతానికే పరిమితం అవుతుందని, అందుకే జై ఆంధ్రా అని తాను అన్నానని అన్నారు. జై ఆంధ్రా అంటూ ఉన్మాద స్థాయికి వెళ్లమని తాను చెప్పడం లేదని, కానీ, ఒక గుర్తింపు ఉండాలని, అది రాష్ట్రానికి మంచిదని అన్నారు. భారతీయతను ఎక్కడా కోల్పోమని తాను చెప్పడం లేదని తెలిపారు.
ఈ కుల దూషణలకు చరమ గీతం పాడాలి అనుకుంటున్నామని, అందుకు సంబంధించి జనసేన తరఫున సేనాగళం అనే కమిటీ ఏర్పాటు చేశామని అన్నారు. ఏ కులం వారిని దూషించినా ఈ సేనాగళం స్పందిస్తుందని చెప్పారు. కులాలవారీగా పార్టీలోని నేతలను విభజించాలని కుట్ర పన్నే వారికి సేనాగళం కమిటీ దీటైన సమాధానమిస్తుందన్నారు.
ఇక, రాజకీయాల్లో కుల దూషణలు ఎక్కువయ్యాయని, వైసీపీ పాలనలో అవి పరాకాష్టకు చేరాయని పవన్ అన్నారు. వైసీపీ హయాంలో ఆఖరికి జర్నలిస్టులకు కూడా కులాలు ఆపాదించి కులాలవారీగా దూషణలకు దిగారని పవన్ ఆరోపించారు. ఈ కుల దూషణలు ఇలాగే కొనసాగితే పాలన సాగించడం కూడా కష్టమవుతుందని అన్నారు.
దళిత యువకుడిని వైసీపీ ఎమ్మెల్సీ హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఆ ఎమ్మెల్సీని వెనకేసుకు వచ్చారని, ఆ సమయంలో దళిత సంఘాలు మాట్లాడలేదని విమర్శించారు. డాక్టర్ సుధాకర్ ను మాససికగంగా వేధించారని, ఆ సమయంలో దళిత సంఘాలు రాలేదని గుర్తు చేశారు.
అనుకున్నట్టే ఫౌజీ విడుదల తేదీ డిసెంబర్ 3 లాకైపోయింది. ఇది రెండు వారాల క్రితమే లీకైన న్యూస్ అయినప్పటికీ ఫైనల్…
ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ కున్న క్రేజ్ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో లేదన్న మాటే కానీ పదిహేను సంవత్సరాల క్రితం ప్రసాద్ మల్టీప్లెక్స్…
భారతదేశానికి గర్వకారణమైన ఇస్రో లో ఇప్పుడు ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు వరుసగా తమ ఉద్యోగాలకు…
క్రికెట్ ప్రపంచంలో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉండే క్రేజ్ అందరికీ తెలిసిందే. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఐసీసీ 2027…
మన దేశం నుంచి ఎంతోమంది టాలెంటెడ్ యువత సరైన రూల్స్ పాటిస్తూ చదువు, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్తున్నారు. కానీ…
తెలుగులో మరే హీరోకూ లేని విచిత్రమైన ‘అయ్యగారు’ అనే బిరుదును అఖిల్ అక్కినేని సొంతం చేసుకున్నాడంటే.. ఆంధ్ర ప్రాంతానికి చెందిన…