ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి మండలం జన్వాడలో ఉన్న చెరువును పవన్ కబ్జా చేశారని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ ఆరోపణలపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారి స్పందించారు.
ఒకవేళ తాను ఆ చెరువును, భూమిని కబ్జా చేశానని నిరూపిస్తే దానిని తెలంగాణ ప్రభుత్వానికి రాసిచ్చేస్తానంటూ పవన్ సంచలన ప్రకటన చేశారు. ఒకవేళ నిజంగా తాను చెరువు కబ్జా చేస్తే తన ఇల్లు తగలబెట్టేశేవారని పవన్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటే తనకు ఇష్టమని, గౌరవమని, ఆయనకు చెబుతున్నానని…ప్రభుత్వానికి చెబుతున్నానని..ఆ చెరువు తాను కబ్జా చేశానని నిరూపిస్తే ఆ చెరువును సంతోషంగా తెలంగాణ ప్రభుత్వానికి రాసిచ్చేస్తానని పవన్ చెప్పారు.
తాను చెరువును కబ్జా చేశానని కొందరు అంటున్నారని, తనకేం పనిలేదా అని పవన్ ప్రశ్నించారు. ఆ చెరువు దగ్గర తనకున్న స్థలంలో తనకు గోశాల ఉందని, 60 నుంచి 70 గోవులుంటాయని, వాటి గడ్డి కోసం ఆ స్థలం ఉందని పవన్ క్లారిటీనిచ్చారు.
ప్రైవేటు స్థలాల్లోకి రావడం చట్టప్రకారం నేరమని, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టవద్దని అన్నారు. తమను భయపెట్టాలని చూడొద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని పవన్ హెచ్చరించారు. అవన్నీ ఆలోచించుకోవాలని, తనను భయపెట్టాలని చూస్తే భయపడేవాడిని కాదని అన్నారు. తనపై ఆంధ్రా ముద్ర వేసి ప్రాంతీయ వాదం తెరపైకి తెస్తే ఊరుకోబోనని, తెలంగాణలో అన్ని కులాలు, మతాలు, జాతులు, ప్రాంతాలకు చెందిన వారు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారని గుర్తు చేశారు.
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…
విడుదలై రెండేళ్లు దాటినా కల్కి 2898 ఏడి మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ప్రస్తావన వస్తూనే ఉంటుంది.…
ఇటీవలే విడుదలైన లెనిన్ పైరసీ మూడు రోజల వరకు రాకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరచడమే కాదు ఇండస్ట్రీ వర్గాలను…