Political News

నాని మాటలకు యాక్షన్ తోడైంది!

కొడాలి శ్రీవేంకటేశ్వర రావు అలియాస్ కొడాలి నాని.. నోరు తెరిస్తే వైరి వర్గాలపై ఘాటు వ్యాఖ్యలు పడిపోతాయి. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్ లపై తనకేదో వ్యక్తిగత శత్రుత్వం ఉన్నట్లుగా సాగే నాని… ఆ ఇద్దరు నేతలపై ఓ రేంజిలో ఫైరవుతూ ఉంటారు.

వైసీపీ ఓటమి పాలయ్యాక పెద్దగా కనిపించని నాని.. టీడీపీ వార్షిక వేడుక మహానాడు జరుగుతున్న బుధవారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. వైసీపీ అదినేత నిర్వహించిన కీలక సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆయన… పనిలో పనిగా చంద్రబాబు, లోకేశ్ లపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇప్పటిదాకా మాటలతోనే విమర్శలు సంధించిన నాని… తాజాగా తన మాటలకు తన యాక్షన్ ను కూడా జత చేసి ఆకట్టుకున్నారు.

టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అవుతుందన్న నాని… ఈ రెండేళ్లలో చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ ను సూపర్ సున్నాను చేశారని ఆయన సెటైరిక్ విమర్శలు సంధించారు. ఈ రెండేళ్లలో చంద్రబాబు, లోకేశ్ లు చేసింది రెండే రెండు పనులని చెప్పిన నాని… వాటిలో ఒకటి మోదీ కనిపిస్తే వంగివంగి దండాలు పెట్టడం, రెండోది పవన్ కల్యాణ్ కనిపిస్తే కూర్చోవడమేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా మోదీ కనిపిస్తే చంద్రబాబు, లోకేశ్ లు ఇలా వంగి దండాలు పెడతారని చెప్పిన నాని… వారెలా వంగుతారన్న అంశాన్ని చెప్పేందుకు తానూ వంగి మరీ చూపించారు. ఇక పవన్ కల్యాణ్ కనిపిస్తే చంద్రబాబు, లోకేశ్ లు కూర్చుంటున్నారని చెప్పిన నాని… వారెలా కూర్చుంటారన్న దానిని యాక్షన్ లో తాను కూర్చుని మరీ చూపించారు. ఈ దృశ్యాలు చూసిన వారంతా… నాని ఇప్పటిదాకా తన నోటికి మాత్రమే పని చెప్పారని, కాస్తంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఆ మాటలకు యాక్షన్ ను కూడా జత చేసి చూపిస్తున్నారని విశ్లేషిస్తున్నారు.

మోదీ కంటే వయసులో చంద్రబాబే పెద్దవారని చెప్పిన నాని… తనకంటే చిన్నవారైన మోదీ ముందు చంద్రబాబు ఎందుకు మోకరిల్లాలని ప్రశ్నించారు. ఇతర పార్టీల మద్దతు లేకుండా ముందుకు కదలలేని స్థాయికి టీడీపీని దిగజార్చారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా దివంగత ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే… చంద్రబాబు ఆ పార్టీని తన మనుగడ కోసం ఇతర పార్టీల వద్ద తాకట్టు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. హైబ్రిడ్ పద్ధతిలో టీడీపీ మహానాడు జరుగుతున్న తీరుపైనా నాని తనదైన శైలి సెటైర్లు సందించారు. విపక్షంలో ఉన్న వైసీపీ 175 మంది ఇంచార్జీలతో సమావేశం ఏర్పాటు చేస్తే… టీడీపీ మహానాడును కూడా గాలికి వదిలేసిందని ఆయన అన్నారు. మొత్తంగా నాని చేసిన యాక్షన్ సన్నివేశాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

This post was last modified on May 27, 2026 10:30 pm

Share

Recent Posts

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

23 minutes ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

2 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

2 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

2 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

3 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

5 hours ago