అప్పటిదాకా తమిళ సినీ రంగంలో స్టార్ హీరోగా కొనసాగిన దళపతి విజయ్… తమిళ వెట్రిగ కజగం (టీవీకే) పేరిట రాజకీయ పార్టీ పెట్టి… అనతి కాలంలోనే రికార్డులు బద్దలు కొడుతూ ముఖ్యమంత్రి పదవిని అందుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో బుధవారం దేశ రాజధాని ఢిల్లీకి చేరిన విజయ్…ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయ్ ఆసక్తికర ప్రస్థానంపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. వాటిలో ప్రధానమైనది ఒకటి ఉంది. రెండు నెలల క్రితం ఓ కేసు విచారణ కోసం ఢిల్లీకి వచ్చిన విజయ్… నేడు సీఎం హోదాలో అదే ఢిల్లీలో అడుగుపెట్టారన్న ఆసక్తికర విశ్లేషణ సాగుతోంది.
రెండేళ్ల క్రితంమే రాజకీయ పార్టీని స్థాపించిన విజయ్…తమిళనాడులోని పలు ప్రాంతాల్లో పార్టీ సభలు పెట్టారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన రాష్ట్రవ్యాప్తంగా రోడ్ షోలు నిర్వహించేందుకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో లో తొక్కిసలాట జరగగా… 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేయగా… కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. ఈ కేసు విచారణ కోసం రెండు నెలల క్రితం విజయ్ ఢిల్లీ వెళ్లారు. సీబీఐ అదికారుల ముందు విచారణకు హాజరయ్యారు.
కట్ చేస్తే… బుధవారం విజయ్ మరోమారు ఢిల్లీలో అడుగుపెట్టారు. మునుపటి సారి నిందితుడిగా విచారణకు వెళ్లిన విజయ్… తాజా పర్యటనలో మాత్రం తమిళనాడు సీఎం హోదాలో ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా తమిళనాడు హౌస్ లో విజయ్ కి పౌలీసుల గౌరవ వందనం దక్కింది. తమిళనాడు సీఎం హోదాలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యేందుకే విజయ్ ఢిల్లీ వచ్చారు.
అనంతరం ఆయన ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. విజయ్ ఢిల్లీ పర్యటనను వీక్షిస్తున్న జనం.. రెండు నెలల క్రితం ఇదే విజయ్ ఓ నిందితుడిగా సీబీఐ విచారణకు వచ్చారని వారు విశ్లేషిస్తున్నారు. రెండంటే రెండు నెలల్లో విజయ్ విషయంలో ఎంత మార్పు వచ్చిందో కదా అన్న చర్చ సాగుతోంది.
This post was last modified on May 27, 2026 10:27 pm
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…
కార్తీ కెరీర్ బెస్ట్ హిట్స్ గా చెప్పుకునే సినిమాల్లో ఖైదీ, నా పేరు శివ తర్వాత సర్దార్ ఉంటుంది. తెలుగులోనూ…
ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య టాలీవుడ్ స్టార్లు ఒకరి తర్వాత ఒకరు గాయపడడం ఆందోళనకరంగా మారిన సంగతి తెలిసిందే.…
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ తర్వాత…