అప్పటిదాకా తమిళ సినీ రంగంలో స్టార్ హీరోగా కొనసాగిన దళపతి విజయ్… తమిళ వెట్రిగ కజగం (టీవీకే) పేరిట రాజకీయ పార్టీ పెట్టి… అనతి కాలంలోనే రికార్డులు బద్దలు కొడుతూ ముఖ్యమంత్రి పదవిని అందుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో బుధవారం దేశ రాజధాని ఢిల్లీకి చేరిన విజయ్…ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయ్ ఆసక్తికర ప్రస్థానంపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. వాటిలో ప్రధానమైనది ఒకటి ఉంది. రెండు నెలల క్రితం ఓ కేసు విచారణ కోసం ఢిల్లీకి వచ్చిన విజయ్… నేడు సీఎం హోదాలో అదే ఢిల్లీలో అడుగుపెట్టారన్న ఆసక్తికర విశ్లేషణ సాగుతోంది.
రెండేళ్ల క్రితంమే రాజకీయ పార్టీని స్థాపించిన విజయ్…తమిళనాడులోని పలు ప్రాంతాల్లో పార్టీ సభలు పెట్టారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన రాష్ట్రవ్యాప్తంగా రోడ్ షోలు నిర్వహించేందుకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో లో తొక్కిసలాట జరగగా… 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేయగా… కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. ఈ కేసు విచారణ కోసం రెండు నెలల క్రితం విజయ్ ఢిల్లీ వెళ్లారు. సీబీఐ అదికారుల ముందు విచారణకు హాజరయ్యారు.
కట్ చేస్తే… బుధవారం విజయ్ మరోమారు ఢిల్లీలో అడుగుపెట్టారు. మునుపటి సారి నిందితుడిగా విచారణకు వెళ్లిన విజయ్… తాజా పర్యటనలో మాత్రం తమిళనాడు సీఎం హోదాలో ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా తమిళనాడు హౌస్ లో విజయ్ కి పౌలీసుల గౌరవ వందనం దక్కింది. తమిళనాడు సీఎం హోదాలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యేందుకే విజయ్ ఢిల్లీ వచ్చారు.
అనంతరం ఆయన ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. విజయ్ ఢిల్లీ పర్యటనను వీక్షిస్తున్న జనం.. రెండు నెలల క్రితం ఇదే విజయ్ ఓ నిందితుడిగా సీబీఐ విచారణకు వచ్చారని వారు విశ్లేషిస్తున్నారు. రెండంటే రెండు నెలల్లో విజయ్ విషయంలో ఎంత మార్పు వచ్చిందో కదా అన్న చర్చ సాగుతోంది.
This post was last modified on May 27, 2026 10:27 pm
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…