టీడీపీ వార్షిక వేడుక మహానాడు రెండో రోజైన గురువారం కొనసాగుతోంది. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పోలిట్ బ్యూరో సభ్యులతో జరుగుతున్న ఈ వేడుకలు హైబ్రిడ్ పద్ధతిన జరుగుతున్న సంగతి తెలిసిందే. పార్టీ అధిష్ఠానం నిర్దేశించిన పార్టీ నేతలు మాత్రమే పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో గురువారం మహానాడు వేదిక మీద ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ట్రాన్స్ జెండర్ వర్ణిణీ నేరుగా వేదిక ఎక్కి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పక్కన కూర్చుని కనిపించారు.
తన పక్కన కూర్చున్న ట్రాన్స్ జెండర్ వర్షిణితో చంద్రబాబు చాలాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆత్మీయ పలకరింపుతో వర్షిణి భావోద్వేగానికి గురయ్యారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాదవికి పీఏగా పనిచేస్తున్న వర్షిణి… విధి నిర్వహణలో సత్తా చాటుతున్నారు. టీడీపీ అంటే ఎనలేని అభిమానం కలిగిన వర్షిణి తాను చంద్రబాబును కలవాలనుకుంటున్నానని చెప్పగా… ఎమ్మెల్యే గల్లా మాధవి ఆ దిశగా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే… మహానాడు వేదిక మీద కూర్చున్న చంద్రబాబు…పార్టీకి చెందిన అతి సామాన్య కార్యకర్తలతో కూడా ముచ్చటిస్తూ సాగుతున్నారు. పార్టీ కార్యకర్తలే టీడీపీకి వెన్నెముక అన్న మాదిరిగా సాగుతున్న చంద్రబాబు… తనను కలిసేందుకు వస్తున్న కార్యకర్తలను ఎంతమాత్రం నిరాశకు గురి చేయకుండా సాగుతున్నారు. పార్టీ కోసం పాటుపడుతున్న కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ సాగుతున్న చంద్రబాబు…వారిలో మరింత ధైర్యాన్ని నింపుతున్నారు.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…