టీడీపీ వార్షిక వేడుక మహానాడు రెండో రోజైన గురువారం కొనసాగుతోంది. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పోలిట్ బ్యూరో సభ్యులతో జరుగుతున్న ఈ వేడుకలు హైబ్రిడ్ పద్ధతిన జరుగుతున్న సంగతి తెలిసిందే. పార్టీ అధిష్ఠానం నిర్దేశించిన పార్టీ నేతలు మాత్రమే పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో గురువారం మహానాడు వేదిక మీద ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ట్రాన్స్ జెండర్ వర్ణిణీ నేరుగా వేదిక ఎక్కి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పక్కన కూర్చుని కనిపించారు.
తన పక్కన కూర్చున్న ట్రాన్స్ జెండర్ వర్షిణితో చంద్రబాబు చాలాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆత్మీయ పలకరింపుతో వర్షిణి భావోద్వేగానికి గురయ్యారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాదవికి పీఏగా పనిచేస్తున్న వర్షిణి… విధి నిర్వహణలో సత్తా చాటుతున్నారు. టీడీపీ అంటే ఎనలేని అభిమానం కలిగిన వర్షిణి తాను చంద్రబాబును కలవాలనుకుంటున్నానని చెప్పగా… ఎమ్మెల్యే గల్లా మాధవి ఆ దిశగా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే… మహానాడు వేదిక మీద కూర్చున్న చంద్రబాబు…పార్టీకి చెందిన అతి సామాన్య కార్యకర్తలతో కూడా ముచ్చటిస్తూ సాగుతున్నారు. పార్టీ కార్యకర్తలే టీడీపీకి వెన్నెముక అన్న మాదిరిగా సాగుతున్న చంద్రబాబు… తనను కలిసేందుకు వస్తున్న కార్యకర్తలను ఎంతమాత్రం నిరాశకు గురి చేయకుండా సాగుతున్నారు. పార్టీ కోసం పాటుపడుతున్న కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ సాగుతున్న చంద్రబాబు…వారిలో మరింత ధైర్యాన్ని నింపుతున్నారు.
This post was last modified on May 28, 2026 12:28 pm
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…
కార్తీ కెరీర్ బెస్ట్ హిట్స్ గా చెప్పుకునే సినిమాల్లో ఖైదీ, నా పేరు శివ తర్వాత సర్దార్ ఉంటుంది. తెలుగులోనూ…