జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ శనివారం భేటీ అయ్యారు. మంగళగిరిలోని పవన్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏపీ అసెంబ్లీలో అరవ శ్రీధర్… జనసేన తరఫున విప్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పదవికి రాజీనామా చేసిన శ్రీధర్.. రాజీనామా పత్రాన్ని పవన్ చేతిలో పెట్టారు. ఇందుకోసమే ఆయన పవన్ ను కలిసినట్టుగా సమాచారం.
పనిలో పనిగా… తనపై వచ్చిన ఆరోపణలకు సంబందించి శ్రీధర్… పార్టీ అధినేతగా ఉన్న పవన్ కు వివరణ ఇచ్చినట్టు సమాచారం. శ్రీదర్ ఇచ్చిన వివరణను పవన్ అంగీకరించారా? లేదా? అన్న విషయాన్ని పక్కనపెడితే… విప్ పదవికి శ్రీధర్ చేసిన రాజీనామాను మాత్రం పవన్ ఆమోదించారు. ఫలితంగా శ్రీధర్ కు పార్టీ అందించిన విప్ పదవి ఊడిపోయిందని చెప్పాలి. అంతేకాకుండా జనసేనకు చెందిన మరో నేతకు కొత్తగా అవకాశం దక్కినట్టైందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మహిళతో వివాహేతర సంబంధం ఆరోపణలు ఎదుర్కున్న శ్రీధర్.. ఆ మహిళ ఓపెన్ అప్ అవ్వడంతో అడ్డంగా బుక్కయ్యారు. విడతలవారీగా సదరు మహిళ శ్రీధర్ కు సంబందించిన వీడియోలను విడుదల చేయడంతో పాటుగా తనకు పవన్ కల్యాణ్ న్యాయం చేయాలంటూ డిమాండ్ చేయడం ఇటీవల సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
తాజాగా ముస్లిం మహిళల పట్ల శ్రీధర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోను కూడా బాధిత మహిళ విడుదల చేయడంతో శ్రీధర్ మరింతగా ఇబ్బందుల్లో పడిపోయారు. ఫలితంగా విప్ పదవికి ఆయన రాజీకాయా చేయాల్సి వచ్చింది.
వాస్తవానికి శ్రీధర్ వ్యవహారంపై వేగంగానే స్పందంచిన పవన్ కల్యాణ్… ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేయాలంటూ ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీ ఈ వ్యవహారానికి సంబందించిన అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి ఇప్పటికే పార్టీ అధిష్ఠానానికి నివేదిక సమర్పించినట్లు సమాచారం. ఈ నివేదిక అందిన తర్వాతే విప్ పదవికి రాజీనామా చేయాలని పార్టీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసిందని… ఆ మేరకే శ్రీధర్ తన విప్ పదవికి రాజీనామా చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on May 23, 2026 2:55 pm
రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానిలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని శ్రీరామ్…
ఒకప్పుడు షకీలాకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వరుస సినిమాలు, భారీ గుర్తింపు, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్తో…
ఏఐ రంగప్రవేశం తర్వాత తమ ఫొటోలు, వీడియోలను ఇష్టానుసారం వాడేస్తున్న నేపథ్యంలో పర్సనాలిటీ రైట్స్ కోసం ఫిలిం సెలబ్రెటీలను న్యాయస్థానాలను…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాధమిక ప్రాజెక్టులుగా భావిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు తాజాగా…
ఓజిలో విలన్ గా పరిచయమైన ఇమ్రాన్ హష్మీ ఒకప్పుడు బాలీవుడ్ సోలో హీరోగా మంచి మార్కెట్ ఎంజాయ్ చేసిన వైనం…
కొందరు నిర్మాతలకు కాకతాళీయంగా జరిగేవే అయినా కొన్ని సంఘటనల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. నాగవంశీకి ఇది బాగా అనుభవం. లక్కీ…