Political News

చంద్ర‌బాబు `ఈవీ` మంత్రం..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌మ‌స్య‌ల‌ను త‌న‌దైన శైలిలో అర్థం చేసుకోవ‌డంతోపాటు.. వాటికి ప‌రిష్కారాల‌ను కూడా త‌న‌దైన శైలిలోనే చూపిస్తారు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఇంధ‌న స‌మ‌స్య పెరిగిపోయింది. దీంతో ఇంధన‌పొదుపు కోసం ముఖ్య‌మంత్రుల నుంచి మంత్రుల వ‌ర‌కు పొదుపు బాట ప‌డుతున్నారు. తాజాగా సిక్కిం రాష్ట్ర ముఖ్య‌మంత్రి త‌న కార్యాల‌యానికి చేరుకునేందుకు రెండు కిలో మీట‌ర్లు న‌డిచి వ‌చ్చారు. త‌ద్వారా.. 50-60 లీట‌ర్ల డీజిల్‌ను పొదుపు చేసినట్టు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం పేర్కొంది. ఇలా.. దేశ‌వ్యాప్తంగా పొదుపు మంత్రం పాటిస్తున్నారు.

కాగా.. ఏపీలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఒక‌వైపు పొదుపు పాటిస్తూనే మ‌రోవైపు ప్ర‌త్యామ్నాయాల‌పై దృష్టి పెట్టారు. ఇంధన పొదుపు కోసం చేపట్టే కార్యాచరణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖ‌ల అధికారుల‌ను ఆయ‌న ఆదేశించారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఉద్యమంగా మార్చేలా ప్రణాళికలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈవీ సైకిళ్లు, ఈవీ వాహనాల ను పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈవీ కంపెనీల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. రాష్ట్రంలో స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలకు ఎలక్ట్రిక్ సైకిళ్లు అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. మొత్తం 16 వేల ఎలక్ట్రిక్ సైకిళ్లను ఆయా కార్యాలయాల సిబ్బందికి అందించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఈవీ వాహనాలను సులభంగా కొనుగోలు చేసేలా రుణాలను అందించే ప్రయత్నం చేయాలని.. దీనికోసం ఓ ప్రత్యేక ఎస్పీవీ(స్పెష‌ల్ ప‌ర్ప‌స్ వెహిక‌ల్‌)ని ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. అవ‌స‌ర‌మైతే.. బ్యాంకుల‌తో మాట్లాడి రుణాలు ఇప్పించేలా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

ఈఎంఐ విధానంలో ఈవీ సైకిళ్లను ఇచ్చేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు ఛార్జింగ్ స్టేషన్ల లాంటి మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. అలానే.. మౌలికసదుపాయాల కల్పించటంపై ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. త‌ద్వారా రాష్ట్రంలో ఇంధ‌న వినియోగం త‌గ్గ‌డంతోపాటు.. ప‌ర్యావ‌ర‌ణ అనుకూల వాహ‌నాల వినియోగం కూడా పెరుగుతుంద‌ని సీఎం అభిప్రాయ‌ప‌డ్డారు.

This post was last modified on May 19, 2026 8:30 am

Share
Show comments
Published by
Kumar
Tags: Chandrababu

Recent Posts

క‌విత పాద‌యాత్ర ఏమైంది?

బీఆర్ ఎస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత‌గా పార్టీ పెట్టుకున్న క‌ల్వకుంట్ల క‌విత‌.. పాద‌యాత్ర చేస్తాన‌ని కొన్నాళ్ల కింద‌ట…

13 minutes ago

టాక్సిక్ నిర్మాతకు ‘డెవిల్’ షాక్ కొట్టింది

కెవిఎన్ ప్రొడక్షన్స్ అంటే నిన్న ఏడాది దాకా పెద్దగా పరిచయం లేదు కానీ గత ఆరు నెలల్లో ఒక్కసారిగా ఈ…

3 hours ago

నాయకుల ఇబ్బందిని పవన్ లైట్ తీసుకున్నారా?

ఏపీలో కూట‌మి పార్టీ ప్ర‌భుత్వం బ‌లంగా ఉంది. వ‌చ్చే 15 ఏళ్ల‌పాటు ప్ర‌భుత్వాన్ని కొన‌సాగిస్తామ‌ని కూడా చెబుతోంది. ఉన్న‌త‌స్థాయిలో సీఎం,…

8 hours ago

జాన్వీ కొంచెం మిస్ ఫైర్ అయ్యిందా

పెద్ది ట్రైలర్ లో జాన్వీ కపూర్ ని కేవలం గ్లామర్ షోకే పరిమితం చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రతి…

8 hours ago

ఆర్ఆర్ఆర్ హీరోలు… కాకతాళీయ పోలికలు

టాలీవుడ్ మల్టీస్టారర్స్ లో కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన హీరోలుగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎప్పటికీ స్పెషల్…

12 hours ago

బ్లాక్‌బస్టర్ కాంబో.. మళ్లీ కొడతారా?

తమిళనాట విజయ్ సినీ రంగానికి దూరం కావడంతో ఇండస్ట్రీలో ఒక శూన్యత ఆవహించిన పరిస్థితి. రజినీకాంత్, కమల్ హాసన్‌లకు వయసు…

12 hours ago