Political News

భార‌త్‌కు 2 స‌వాళ్లు.. తక్ష‌ణం మేల్కోవాలి!

ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న యుద్ధ వాతావ‌ర‌ణం ప్ర‌స్తుతం తుఫాను ముందు ప్ర‌శాంత‌త‌గా ఉంది. కాల్పుల విర‌మ‌ణ పాటిస్తు న్నప్ప‌టికీ.. ఏ క్ష‌ణాన ఏం జ‌రుగుతుందో అన్న‌ట్టుగా ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఇరాన్ తాజాగా చేసిన హెచ్చ‌రిక తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల‌కు బ‌ల‌మైన ప్ర‌తిదాడులు చేస్తూనే.. ఇరాన్‌.. త‌న ప‌రిధిలోని హార్ముజ్ జ‌ల‌సంధిపై ప‌ట్టు బిగించింది. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా ఇంధ‌న సంక్షోభం నెల‌కొంది. ప్ర‌స్తుతం భార‌త్ కూడా పొదుపు మంత్రం పాటించ‌డానికి ఇదే కార‌ణ‌మ‌నే విష‌యం తెలిసిందే.

ఇక‌, తాజాగా ఇరాన్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకునే దిశ‌గా అడుగులు వేస్తోంది. త‌న ప‌రిధిలోని హార్ముజ్ జ‌ల‌సంధిలో స‌ముద్ర గ‌ర్భంపైనా ఇరాన్ త‌న నియంత్ర‌ణ‌ను పాటించాల‌ని నిర్ణ‌యించింది. త‌ద్వారా.. ఇంట‌ర్‌నెట్‌, డేటా కేబుళ్ల‌పై ఆధిప‌త్యం సాధించాల ని భావిస్తోంది. ఇదే జ‌రిగితే.. ఇరాన్ ప‌రిధిలోని స‌ముద్ర గ‌ర్భం గుండా ప్ర‌యాణించే కేబుళ్ల‌పై నియంత్ర‌ణ మొద‌ల‌వుతుంది. అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా వంటి సంస్థ‌లు ఈ ప‌రిధిలో యూర‌ప్‌-ఆసియా-గల్ఫ్ దేశాల‌ను అనుసంధానం చేస్తూ.. కేబుళ్ల‌ను ఏర్పాటు చేశాయి. ఈ జాబితాలో భార‌త్ కూడా ఉంది.

ఇప్పుడు ఇరాన్ క‌నుక కేబుళ్ల‌కు అంతరాయం క‌లిగిస్తే..(క‌లిగిస్తామ‌ని చెబుతోంది) డేటాకు, నెట్‌కు కూడా తీవ్ర అంత‌రాయాలు ఏర్ప‌డ‌తాయి. త‌ద్వారా బ్యాంకింగ్ రంగంపై ప్ర‌భావం ప‌డ‌నుంది. అదేవిధంగా స్టాక్ మార్కెట్ కూడా ప్ర‌భావితం కానుంది. అలానే.. సామాజిక మాధ్య‌మాలు.. ఆర్థిక‌రంగం కూడా నిలిచిపోయే ప్ర‌మాదం ఏర్ప‌డింది. ఇరాన్ త‌న దూకుడును పెంచేందుకు నిర్దిష్ట స‌మ‌యం ప్ర‌క‌టించ‌క‌పోయినా.. అమెరికా చ‌ర్య‌లపై ఆధార‌ప‌డి నిర్ణ‌యించే అవ‌కాశం ఉంటుంది. ఈ వ్య‌వ‌హారంపై భార‌త్ త‌క్ష‌ణ‌మే జోక్యం చేసుకోవాల‌ని నిపుణులు కోరుతున్నారు.

ఇక‌, రెండో విష‌యం.. డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ‌. గ‌త నాలుగు రోజులుగా డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ గ‌ణ‌నీయంగా త‌గ్గిపోతోంది. తాజాగా సోమ‌వారం 96.60 రూపాయ‌ల‌కు చేరుకుంది. అంటే ఒక డాల‌ర్‌కు దాదాపు 97 రూపాయ‌ల‌ను వెచ్చించే ప‌రిస్థితి వ‌చ్చింది. మరి కొద్ది రోజుల్లోనే ఇది రూ.100కుచేరే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

ఇదే జ‌రిగితే.. దేశంలో ఎంత పొదుపు మంత్రం ప‌ఠించినా.. ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని.. ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు స‌హా.. సాధార‌ణ జ‌న జీవ‌నం కూడా తీవ్రంగా ప్ర‌భావిత‌మ‌య్యే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ రెండు విష‌యాల‌ను భార‌త్ త‌క్ష‌ణ‌మే ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు.

This post was last modified on May 20, 2026 9:25 am

Share
Show comments
Published by
Kumar
Tags: India

Recent Posts

మ‌ళ్లీ `ఇన్‌ఫ్లేష‌న్` భూతం… జేబుల‌కు చిల్లే!

దేశంలో గ‌త ఆరు మాసాలుగా ఒకింత అదుపులో ఉన్న ద్రవ్యోల్బ‌ణం(ఇన్‌ఫ్లేష‌న్‌) ప్ర‌స్తుతం పెరుగుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆర్బీఐ కూడా…

48 minutes ago

బంగారం వదిలేసిన టోవినో థామస్

నిన్న విడుదలైన డ్రాగన్ టీజర్ లో పాత్రల పరిచయం, జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రో అన్నీ చూపించేశారు. ఆఫ్గనిస్తాన్ మాఫియాలో ఎన్ని…

1 hour ago

రెహమాన్‌ను తక్కువ అంచనా వేయొద్దు

ఇండియన్ సినిమా హిస్టరీలోనే గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన ఏఆర్ రెహమాన్.. ఇంతకుముందులా మెరుపులు మెరిపించలేకపోతున్నాడని ఆయన అభిమానులే అసంతృప్తి…

2 hours ago

ధోని పేరు చెప్పి మోసం చేశారా?

లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి కొన్నేళ్ల నుంచి చర్చ జరుగుతోంది. 2022, 2023 సీజన్లలోనే…

2 hours ago

ప్రశాంత్ నీల్ నమ్మకం నిలబడిందా

నిన్న అర్ధరాత్రి విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ నాలుగు నిమిషాల టీజర్ సోషల్ మీడియాని కమ్మేసింది. విపరీతమైన అంచనాల నేపథ్యంలో…

3 hours ago

శ్రీవారి భ‌క్తుల‌కు అద్భుత ఛాన్స్‌… మిస్ కావొద్దు!

తిరుమ‌ల శ్రీవారిని ఒక్క నిమిషం ద‌ర్శించుకోవాల‌ని ప‌రిత‌పించే భ‌క్తులు కోట్ల‌లో ఉంటారు. అలానే తిరుమ‌ల ప్రసాదాన్ని ప‌ర‌మ‌ప‌విత్రంగా కూడా భావిస్తారు.…

5 hours ago