బాలికపై లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటున్న భగీరథ్ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు .. తెలంగాణ పోలీసులు.. వైమానిక శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా లుకౌట్(కనిపిస్తే.. పట్టేయండి) నోటీసులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లోనూ ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చినట్టు అయింది.
మరోవైపు.. భగీరథ్కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఏక్షణమైనా.. విదేశాలకు పారిపోయే అవకాశం ఉంటుందని భావిస్తున్న అధికారులు లుకౌట్ నోటీసులు ఇష్యూ చేశారు.
మరోవైపు.. ఐదు బృందాలుగా ఏర్పడిన పోలీసులు భగీరథ్ కోసం గాలిస్తున్నారు. ఆయన ఎక్కడున్నా పట్టుకుని తీరుతామని అధికారులు చెబుతున్నారు. అతని నివాసంలోనూ.. పోలీసులు తనిఖీలు చేయడం గమనార్హం.
దీనికి సంబంధించి కోర్టు వారెంటు కూడా తీసుకున్నారు. కాగా.. ప్రస్తుతం భగీరథ్ కారు డ్రైవర్ నుంచి స్నేహితుల వరకు దాదాపు 30-50 మంది కరీంనగర్ పోలీసుల అదుపులో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…