Political News

భ‌గీర‌థ్ కోసం లుకౌట్ నోటీసులు

బాలిక‌పై లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటున్న భ‌గీర‌థ్ విష‌యంలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఆయ‌న దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు .. తెలంగాణ పోలీసులు.. వైమానిక శాఖ అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా లుకౌట్‌(క‌నిపిస్తే.. ప‌ట్టేయండి) నోటీసులు జారీ చేశారు. దేశ‌వ్యాప్తంగా అన్ని విమానాశ్ర‌యాల్లోనూ ఈ ఉత్త‌ర్వులు అమ‌ల్లోకి వ‌చ్చిన‌ట్టు అయింది.

మ‌రోవైపు.. భ‌గీర‌థ్‌కు తెలంగాణ హైకోర్టు ముంద‌స్తు బెయిల్ నిరాక‌రించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో సుప్రీంకోర్టును ఆశ్ర‌యించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే.. ఏక్ష‌ణ‌మైనా.. విదేశాల‌కు పారిపోయే అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్న అధికారులు లుకౌట్ నోటీసులు ఇష్యూ చేశారు.

మ‌రోవైపు.. ఐదు బృందాలుగా ఏర్ప‌డిన పోలీసులు భ‌గీర‌థ్ కోసం గాలిస్తున్నారు. ఆయ‌న ఎక్క‌డున్నా ప‌ట్టుకుని తీరుతామ‌ని అధికారులు చెబుతున్నారు. అతని నివాసంలోనూ.. పోలీసులు త‌నిఖీలు చేయ‌డం గ‌మ‌నార్హం.

దీనికి సంబంధించి కోర్టు వారెంటు కూడా తీసుకున్నారు. కాగా.. ప్ర‌స్తుతం భ‌గీర‌థ్ కారు డ్రైవ‌ర్ నుంచి స్నేహితుల వ‌ర‌కు దాదాపు 30-50 మంది క‌రీంన‌గ‌ర్ పోలీసుల అదుపులో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

This post was last modified on May 16, 2026 3:01 pm

Share

Recent Posts

యానిమల్ పార్క్… ఇంకెంత దూరం?

రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వచ్చిన ‘యానిమల్’ 2023లో బాక్సాఫీస్ బిగ్ హిట్ గా నిలిచిన విషయం…

1 hour ago

తమన్ సమాజ సేవకు 12 కోట్ల టార్గెట్

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన ప్రపంచంలో మరో కోణాన్ని బయటపెట్టాడు. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో పర్సనల్ చారిటీ వర్క్ గురించి…

1 hour ago

చివరి సిక్సర్ కోసం కనకరాజు పోరాటం

వరుణ్ తేజ్ కు చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ ఇచ్చిన సినిమాగా కొరియన్ కనకరాజు తొలి నాలుగు రోజుల్లోనే బ్రేక్…

2 hours ago

గుజరాత్ ను వణికిస్తున్న చండీపుర…. 25 పిల్లలు బలి

గుజరాత్ రాష్ట్రంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది. రోజుల పరిధిలోనే పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలను బలికొనడం భయాందోళన కలిగిస్తుంది.…

3 hours ago

జనసేనలో వుండాలంటే బూతులు మానాలి

కొన్నేళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో విచారకర మార్పులు వచ్చాయి. రాజకీయ కాలుష్యం ఏర్పడ్డటంతో ప్రజలు చిరాకు పడుతున్నారు. వైసీపీ…

3 hours ago

హనుమాన్ విజయమే మహాకాళీ ధైర్యం

2027 సంక్రాంతి పందెం క్రమంగా వేడెక్కుతోంది. శర్వానంద్ - శ్రీను వైట్ల కాంబో ' జార్జ్ క్రిష్' జనవరి 14…

3 hours ago